Friday, December 25, 2020

Vaikuntha Ekadashi Dwara Darshanam started Tirumala

వైకుంఠాన్ని తలపిస్తున్న

తిరుమల

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఉదయం అభిషేకం అనంతరం ఆలయ ఆర్చకులు వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఉదయం నాలుగు గంటలకు దర్శనం ప్రారంభం కాగా.. సామాన్య భక్తులు, వీఐపీలు దర్శనాల కోసం క్యూకట్టారు. శుక్రవారం కావడంతో అభిషేకం అనంతరం దర్శనాలు మొదలయ్యాయి. దాంతో తిరుమల క్షేత్రం వైకుంఠాన్ని తలపిస్తోంది. కాగా వైకుంఠ ఏకాదశి పర్వ దినాన పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంకా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో నగరి ఎమ్మెల్యే, ఏపీ ఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా తదితరులు ఉన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వారంలో నడవటం స్వర్గంలో నడిచినట్లుందన్నారు. 2021లో అందరి కష్టాలు తీరి శుభం కలగాలని కోరుకున్నాని తెలిపారు.

Wednesday, December 23, 2020

AP CM YSJagan reached idupulapaya 3 days tour in Kadapa district

ఇడుపులపాయ చేరుకున్న సీఎం

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గురువారం శంకుస్థాపనలు చేయనున్నారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆయన ఇడుపులపాయకు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడ నుంచి హెలీకాప్టర్‌ ద్వారా ఇడుపులపాయకు వెళ్లారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రికి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ అతిథి గృహంలో ముఖ్యమంత్రి బస చేయనున్నారు. రూ.3115 కోట్లతో గండికోట-సీబీఆర్గండికోట-పైడిపాలెం లిఫ్ట్ స్కీంకు శంకుస్థాపనరూ.1256 కోట్లతో మైక్రో ఇరిగేషన్‌ పనుల ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. 

Tuesday, December 22, 2020

Senior IAS Officer Adityanath Das become Andhra Pradesh New Chief Secretary

ఏపీ కొత్త సీఎస్ ఆదిత్యనాథ్ దాస్

ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రధానకార్యదర్శి (సీఎస్‌)గా ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారిణి తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి బదిలీ అయివచ్చిన శ్రీలక్ష్మికి కీలక బాధ్యతలు అప్పగించారు. పురపాలక శాఖ కార్యదర్శిగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కె. సునీతను  ప్రభుత్వం నియమించింది. సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ ఈనెల 31న బాధ్యతలు స్వీకరించనున్నారు. పదవీ విరమిణ పొందనున్న ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని ముఖ్యమంత్రి ప్రిన్సిపిల్ అడ్వైజర్‌గా విధులు నిర్వర్తించనున్నారు. తాజా సీఎస్ రేసులోకి పలువురు వచ్చినా వారంతా సెంట్రల్ సర్వీసులో ఉండడంతో 1987 బిహార్‌ బ్యాచ్‌కు చెందిన ఆదిత్యనాథ్‌ దాస్‌ వైపే సీఎం జగన్‌ మొగ్గు చూపారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Monday, December 21, 2020

YSRCP MLA RK Roja Adopts Orphan Girl to Fulfil Her Ambition to Become A Doctor

సీఎం జగన్ కు రోజా అరుదైన కానుక

https://youtu.be/mTc8ZMg6m-M

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు ఆ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా అరుదైన కానుక ఇచ్చారు. సోమవారం ముఖ్యమంత్రి పుట్టినరోజు కాగా రోజా ఈ రోజు ఓ అనాథ బాలికను దత్తత తీసుకున్నారు. అమ్మఒడి పథకం స్ఫూర్తితో ఆమె ముందుకు వచ్చారు. ఆడపిల్లల్ని చదివించాలనే ఆశయంతో పేద విద్యార్థిని దత్తత తీసుకున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో తిరుపతిలోని గర్ల్స్ హోమ్‌లో చదువుకుంటున్న పుష్ప కుమారిని రోజా అక్కున చేర్చుకున్నారు. ఆ బాలికకు మెడిసిన్ చేయాలని ఉందనే విషయాన్ని గర్ల్స్ హోమ్ నిర్వాహకులు రోజా దృష్టికి తీసుకొచ్చారు. దాంతో రోజా బాలిక వైద్య విద్యకయ్యే మొత్తం ఖర్చును తను భరిస్తానని ప్రకటించారు.

Sunday, December 20, 2020

Boyapati designs two powerful roles for Balakrishna

జిల్లా కలెక్టర్ గా బాలకృష్ణ

బాలకృష్ణ ఇంతకుముందు చేయని పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి జిల్లా కలెక్టర్ గా బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో అభిమానుల్ని అలరించనున్నాడు. పదేళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ జోడీ బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో మూడో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సింహ, లెజెండ్ ల తర్వాత బాలయ్య, బోయపాటి కలిసి చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.  ఈ చిత్రంలో బాలయ్య డబుల్ రోల్ చేస్తున్నాడు. రెండు పాత్రలూ పవర్ ఫుల్ గా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఇందులో పోరాట సన్నివేశాలు కొత్తతరహాలో ఉంటాయట. యాక్షన్ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన బోయపాటి ఈ సినిమాకి ఫాంటసీ కూడా జోడిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రజ్ఞా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. `సమరసింహారెడ్డి` ఫేమ్ అలనాటి సూపర్ హీరోయిన్ సిమ్రాన్ ప్రత్యేక పాత్రలో ఈ చిత్రంలో కనిపించనుందట.

Saturday, December 19, 2020

Hectic cold waves in north India

ఉత్తరాదిలో చలి పంజా

ఉత్తర భారతదేశంలో చలి పంజా విసురుతోంది. రోజురోజుకూ చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. శీతల గాలులకు జనం వణికిపోతున్నారు. ముఖ్యంగా సిమ్లా, కశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది.  ఢిల్లీలో కూడా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నవెూదవుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ అత్యల్ప డిగ్రీలు ఉష్ణోగ్రతల నమోదులో సిమ్లాతో పోటీపడుతోంది. ఢిల్లీలోని జాఫర్‌పూర్‌లో సాధారణం కన్నా 6 డిగ్రీల దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అదేవిధంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠానికి పడిపోయి గత పదేళ్ల నాటి రికార్డులను బద్దలు కొట్టాయి. ఇక్కడ 0.4 డిగ్రీల ఉష్ణోగ్రత నవెూదైంది. జలంధర్‌లో 1.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. బీహార్‌ లోనూ  4 డిగ్రీలకు కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాజస్థాన్‌లో గడచిన 24 గంటల్లో అనేక నగరాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నవెూదయ్యాయి. మౌంట్‌ అబూ, చందన్‌ తదితర ప్రాంతాల్లో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి.

Friday, December 18, 2020

Nithyananda, absconding rape accused, announces visa for Kailasa, flights from Australia

కైలాస దేశానికి నిత్యానంద ఆహ్వానం

   ·   వీసాకు kailaasa.org లో సంప్రదించొచ్చు

`కైలాస` పేరుతో ఏకంగా దేశాన్నే ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన వివాదాస్పద నిత్యానందస్వామి తాజాగా వీసా ఆహ్వానంతో తెరముందుకు వచ్చారు. ఈ ఏడాది వినాయకచవితి రోజున తమ దేశంలో రిజర్వుబ్యాంక్ ను కూడా ఏర్పాటు చేసినట్లు స్వాములవారు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎక్కడుందో తెలియని దేశానికి హిందూమత ప్రేమికులకు వీసా ఇస్తామంటూ ఆహ్వానం పలికారు. ఆస్ట్రేలియా వరకు సొంత ఖర్చులతో వచ్చిన వారిని తామే స్వయంగా సకల లాంఛనాలతో తమ దేశంలోకి తీసుకుపోతామన్నారు. పరమశివుని సందర్శించడానికి అనుమతిస్తామని సెలవిచ్చారు. అత్యాచారం, మహిళల అక్రమ నిర్బంధం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ నిత్యానందస్వామి ఏడాదిగా పరారీలో ఉన్నారు. ఓ దివిలో తలదాచుకుంటున్న స్వామి ఆకస్మికంగా కైలాస పేరుతో ఓ దేశాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు.  ఇందులో ఆరోగ్య శాఖ, రాష్ట్ర విభాగం, సాంకేతిక విభాగం, జ్ఞానోదయ నాగరికత విభాగం, విద్యా శాఖ, మానవ సేవల విభాగం, హౌసింగ్ విభాగం, వాణిజ్య విభాగం, ఖజానా విభాగం ఉన్నాయని వివరించారు. రిషభ ధ్వజ- కైలాస జెండాలో నిత్యానందతో పాటు దేశ జాతీయ జంతువు నంది కూడా ఉంది. కైలాస దేశానికి వెళ్లగోరే వారు kailaasa.org లో సంప్రదించొచ్చునట. 

Thursday, December 17, 2020

PSLV-C50 successfully launches CMS-01 from Sriharikota

పీఎస్ఎల్వీ-సీ50 సక్సెస్

పీఎస్ఎల్వీ-సి50 రాకెట్‌ నింగిలోకి దిగ్విజయంగా దూసుకెళ్లింది. సీఎంఎస్-01 దేశీయ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని నిప్పులు చిమ్ముకుంటూ సగర్వంగా మోసుకెళ్లింది. ఇస్రో సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు ఈ శాటిలైట్ ను కక్ష్యలోకి పంపింది.  నిర్దేశిత సమయంలోనే ఉపగ్రహం కక్ష్యలోకి చేరుకునేలా శాస్త్రవేత్తలు కృషి చేశారు. పీఎస్ఎల్వీ కేటగిరిలో ఇది 52వ ప్రయోగం కాగా ఎక్సెల్ కేటగిరిలో 22వది. 42వ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ లాంచ్ ప్రయోగం. మొత్తంగా ఇస్రోకు ఇది 77వ రాకెట్‌ ప్రయోగం. 2011లో ప్రయోగించిన జీశాట్‌-12 కాలపరిమితి ముగిసిపోవడంతో దాని ప్లేస్‌లో జీశాట్‌-12ఆర్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాలని ఇస్రో నిర్ణయించింది. అయితే ప్రస్తుతం దాని పేరును సీఎంఎస్-01గా మార్చి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. గతంలో జీశాట్‌-12 ఉపగ్రహాన్ని 36 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూస్థిర కక్షలోకి ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం సీఎంఎస్-01 శాటిలైట్‌  42 వేల 164 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరగనుంది. మొత్తం 1410 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహం అండమాన్‌, ‌నికోబార్‌ ‌దీవులు, లక్షద్వీప్‌ ‌దీవులతో పాటు యావత్ భారత్ దేశంలో కమ్యూనికేషన్ సేవలను అందించనుంది. ఏడేళ్ల పాటు ఈ ఉపగ్రహం విధులు నిర్వర్తించనుంది. ఇస్రో చైర్మన్ కె.శివన్ ఈ ప్రయోగ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలిపారు.

Wednesday, December 16, 2020

TRS gets cracking on crucial Nagarjunasagar bypoll

మార్చిలో తిరుపతి, నాగార్జునసాగర్ ఉపఎన్నికలు!

తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక మార్చిలో జరగవచ్చని తెలుస్తోంది. ఆ మేరకు సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇటీవల నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాలమరణం చెందిన సంగతి తెలిసిందే. దాంతో టీఎస్ లో మరో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల సీటును పార్టీ కోల్పోయింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాలమరణంతో జరిగిన ఉపఎన్నికలో బీజేపీ గెలుపొందింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీకి ఆశించిన ఫలితం దక్కలేదు. మరోసారి అలా జరగకూడదని టీఆర్ఎస్ భావిస్తోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి వైఎస్ఆర్ సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మరణించారు. ఆ స్థానానికి ఉపఎన్నిక జరగాల్సి ఉంది. ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఈ రెండు స్థానాలకు మార్చిలో ఒకేసారి షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tuesday, December 15, 2020

Eluru mystery disease: Traces of organochlorine, organophosphorus found in blood samples

వీడిన ఏలూరు వింత వ్యాధి మిస్టరీ

ఎట్టకేలకు ఏలూరు వింత వ్యాధి గుట్టును కేంద్ర వైద్య బృందాలు రట్టు చేశాయి. కూరగాయల్లో మోతాదు మించిన పురుగుల మందులు వాడకం, అదే విధంగా కల్తీ బియ్యం కూడా కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.  వింత వ్యాధి బారిన పడిన బాధితుల రక్తంలో సీసం, నికెల్ ఉన్నట్లుగా ఢిల్లీ ఎయిమ్స్ తెలిపింది. మరికొన్ని సంస్థలు మాత్రం బాధితులు తీసుకున్న ఆహారంలో పురుగుల మందు వంటి రసాయన అవశేషాలు ఉన్నట్లుగా ప్రాథమిక పరిశోధన ఫలితాల్లో వెల్లడించాయి. మూర్చ, నోట్లో నురగ, తలనొప్పి, వికారం, వాంతులు, మతిమరపు, వెన్నునొప్పి, ఆందోళన వంటి లక్షణాలతో వందల మంది గత వారంలో ఆసుపత్రుల పాలయ్యారు. ఈ వ్యాధి వల్ల ఇప్పటికే 622 మంది ఆస్పత్రుల్లో చికిత్సలు పొందారు. అందులో ఒకరు మృత్యుపాలయిన సంగతి తెలిసిందే. బాధితుల్లో 90శాతం మంది డిశ్చార్జి అయ్యారు. అయితే గాలి, నీరు ద్వారా వింత వ్యాధి ప్రబలలేదని స్పష్టమయింది. అలాగే పాలు, మాంసాహారం కారణం కాదని సమాచారం. కార్తీక మాసం కావడంతో చికెన్, మటన్ విక్రయాలు కూడా తగ్గాయి. అదీ గాక బాధితుల్లో 83 శాతం మంది  వ్యాధికి గురైన సమయంలో కేవలం శాకాహారం భోజనమే చేసినట్లు చెప్పారు. తాజా నివేదిక ప్రకారం కూరగాయల్లో పురుగుల మందుల అవశేషాలు కనిపించాయి. బియ్యంలో పాస్పరస్ ఆనవాళ్లు లభించినట్లు తెలుస్తోంది.

Monday, December 14, 2020

Thousands of iPhones looted, violence cost us Rs 440 crore in Wistron Bengaluru


 కోలారు ఐఫోన్ ప్లాంట్ విధ్వంసంలో నష్టం రూ.440 కోట్లు

 వేతనాలు చెల్లించాలంటూ కాంట్రాక్టు కార్మికులు సాగించిన విధ్వంసంలో రూ.440కోట్లు ఆస్తి నష్టం జరిగినట్లు విస్ట్రాన్ కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన ఐఫోన్ ప్లాంట్ సిబ్బంది తమ జీతాల సమస్యను పట్టించుకోవడం లేదంటూ శనివారం ఉదయం విధ్వంసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు సమీపంలోని కోలార్ జిల్లాలో గల నర్సాపురలోని ఈ ప్లాంట్‌లో యాపిల్ ఐఫోన్ విడి భాగాలను అమరుస్తుంటారు. ఈ విస్ట్రాన్ ప్లాంట్‌లో మొత్తం ఆరు కాంట్రాక్ట్ సంస్థల నుంచి 8,900 మందిని నియమించుకున్నారు. ప్లాంట్ లో మరో  1,200 మంది శాశ్వత ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కాంట్రాక్టు సిబ్బంది తమ జీతాలు చెల్లించలేదనే ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డారు. దాంతో వందలకోట్ల ఆస్తి నష్టం సంభవించింది. వేల సంఖ్యలో ఐఫోన్‌లు లూటీ అయ్యాయి. నష్టాన్ని ఇంకా పూర్తిగా అంచనా వేయాల్సి ఉందని పోలీస్ స్టేషన్‌లో సమర్పించిన ఫిర్యాదులో యాజమాన్యం వెల్లడించింది. దాదాపు 5,000 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. దాడితో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న 132 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విస్ట్రాన్ ప్లాంట్‌ దాడి ఘటనపై ఎస్పీ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ ఆందోళనకారులు ప్లాంట్ అద్దాలు పగలగొట్టి వాహనాలు ధ్వంసం చేశారన్నారు. కంప్యూటర్లు, ప్రింటర్లు, ల్యాప్‌టాప్స్, ఫ్లోర్,సీలింగ్స్, ఏసీ తయారీ పూర్తయిన స్మార్ట్‌ఫోన్లు ఇలా దేన్ని వదలకుండా విధ్వంసం సృష్టించినట్లు వివరించారు. భారత్‌లో ఏర్పాటైన తొలి ఐఫోన్ యూనిట్ విస్ట్రాన్‌పై దాడిని కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అదేవిధంగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించడంలో ఆ సంస్థ జాప్యం చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్ తెలిపారు. మూడ్రోజుల్లో సిబ్బందికి వేతనాలు చెల్లించాలని ఇప్పటికే కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

Sunday, December 13, 2020

390 kgs Ganjaa seize in Rajahmundry

రాజమండ్రిలో భారీగా గంజాయి పట్టివేత

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ గంజాయి కలకలం రేగుతోంది. ఉత్తరాంధ్ర ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ కేంద్రంగా భారీగా గంజాయి సాగవుతోందని ఇటీవల తరచు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో పెద్దఎత్తున గంజాయిని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని గామన్‌ బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లారీలో తరలిస్తున్న 390 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ గంజాయిని నర్సీపట్నం నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠా వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Saturday, December 12, 2020

Pawan Kalyan visits Dokiparru Venkateswara Swamy temple



డోకిపర్రు వెంకన్న సన్నిధిలో పవర్ స్టార్

https://www.youtube.com/watch?v=3jKNB2qvDe4

జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలోని డోకిపర్రు గ్రామంలో కొలువైన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో శనివారం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. వారిని ఉద్దేశించి పవర్ స్టార్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆలయాన్నిదర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రెండుమూడేళ్లుగా ఇక్కడకు రావాలనుకున్నా ఆ అదృష్టం ఇప్పుడు కల్గిందన్నారు. జిల్లాలో గల ప్రసిద్ధ ఆలయాల్లో ఇక్కడ శ్రీవారి ఆలయం కూడా ఒకటని పేర్కొన్నారు. ప్రస్తుత కల్యాణోత్సవంలో పాలుపంచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తిరుమల తరహాలో ఈ ఆలయ వేద పండితులు పూజాది కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఈ ఆలయ వైభవానికి అహర్నిశలు శ్రమిస్తున్న కృష్ణారెడ్డి  తదితరులకు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.

Friday, December 11, 2020

US New president Joe Biden and Kamala Harris named Time Person of the Year

టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్

బైడన్..కమలా

అమెరికా తదుపరి అధ్యక్ష, ఉపాధ్యక్షులు జో బైడెన్, కమలా హ్యారిస్‌లను టైమ్స్ పత్రిక `పర్సన్ ఆఫ్ ది ఇయర్`‌గా ఎంపిక చేసింది.‌ నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను  డెమొక్రాటిక్ అభ్యర్థి బైడెన్ ఓడించిన సంగతి తెలిసిందే.‌ దాంతో ఈ ఏడాది టైమ్ మ్యాగజైన్ `పర్సన్ ఆఫ్ ది ఇయర్` తాజా జాబితాలో  బైడెన్, కమలాలకు అగ్రస్థానం దక్కింది. ఈ ఇద్దరు డెమొక్రాటిక్ నేతలు ముగ్గురు ఫైనలిస్టులను దాటుకుని ఎంపికయ్యారు. కోవిడ్-19 మహమ్మారిపై ముందుండి పోరాటం చేస్తున్న ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు ఆంథోనీ ఫౌచీ, డొనాల్డ్ ట్రంప్ తదితరులు పోటీపడ్డారు. 78 ఏళ్ల బైడెన్, 56 ఏళ్ల కమలా ఫోటోలను కవర్ పేజీపై ముద్రించిన టైమ్ మ్యాగజైన్ `అమెరికా కథను మార్చారుఅంటూ  కింద ఉప-శీర్షికను పెట్టింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కు మొత్తం 306 ఎలక్టోరల్ ఓట్లు రాగా.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు 232 ఓట్లు వచ్చాయి. అలాగే అమెరికా ఎన్నికల్లో ఇప్పటి వరకూ ఎవరికి సాధ్యం కానిరీతిలో బైడెన్ 70 మిలియన్లకు పైగా ఓట్లను సాధించారు. ఇంత వరకు 2006 ఎన్నికల్లో బారాక్ ఒబామా సాధించిన 6.9 మిలియన్ ఓట్లే అత్యధికం కాగా దానిని బైడన్ అధిగమించి రికార్డు నెలకొల్పిన విషయం విదితమే.

Thursday, December 10, 2020

Vijayashanthi satirical comments on KCR

కేసీఆర్ పై రాములమ్మ వ్యంగ్యోక్తులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తాజాగా బీజేపీలో చేరిన రాములమ్మ (విజయశాంతి) వ్యంగ్యోక్తులు విసిరారు. కేసీఆర్ ను మించిన మహానటుడు లేరన్నారు. కేసీఆర్ కన్నా ముందే తాను తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టినట్లు విజయశాంతి చెప్పారు. ఉద్యమం కోసమే `తల్లి తెలంగాణ పార్టీ`ని టీఆర్ఎస్‌లో విలీనం చేశానన్నారు. మెదక్ ఎంపీగా ప్రజలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన సంగతి గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉండొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ తనను అనేక ఇబ్బందులకు గురిచేశారని రాములమ్మ ఆరోపించారు. 

Sunday, November 29, 2020

Remote-controlled Robot Deployed at Egypt Hospital to Take Covid Tests, Warn Those Without Mask

ఈజిప్ట్ లో కరోనా కట్టడికి రోబో సేవలు

కరోనా సెకండ్ వేవ్ భయాందోళనల నేపథ్యంలో ఈజిప్ట్ లో రోబోల్ని రంగంలోకి దింపారు. మహమూద్ ఎల్-కోమి అనే ఆవిష్కర్త ఈ రిమోట్-కంట్రోల్ రోబోట్‌ను సిద్ధం చేశాడు. దాంతో ప్రస్తుతం అక్కడ ఆసుపత్రుల్లో ఈ రోబో సేవల్ని విరివిగా వినియోగించుకుంటున్నారు. సిరా-03 అని పిలువబడే ఈ రోబోట్ కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగలదు. రోగుల ఉష్ణోగ్రతను పరీక్షిస్తుంది. అదేవిధంగా మాస్క్ లు ధరించని వారిని హెచ్చరిస్తుంది. అచ్చం మనిషిలాంటి తల, మొహం, చేతులతో ఈ రోబోట్ ను తీర్చిదిద్దారు. ఈ మరమనిషికి మరో ప్రత్యేకత కూడా ఉంది. వైద్యుల మాదిరిగా ఎకోకార్డియోగ్రామ్‌లు, ఎక్స్‌రేలు చేయగలదు. అంతేకాకుండా ఆ రిపోర్టు ఫలితాలను దాని ఛాతీకి అనుసంధానించిన తెరపై రోగులకు ప్రదర్శిస్తుంది. ఈ రోబోట్లను మనుషుల్లా రూపొందించడమెందుకంటే రోగులు భయపడకుండా ఉండడానికేనని మహమూద్ తెలిపాడు.

Wednesday, November 25, 2020

Diego Maradona dies, aged 60, after heart attack

సాకర్ మాంత్రికుడు మారడోనా కన్నుమూత

సాకర్ ప్రపంచంలో మాంత్రికుడిగా పేరొందిన అర్జెంటీనా అలనాటి మేటి ఆటగాడు డిగో మారడోనా ఆకస్మికంగా మృత్యు ఒడి చేరారు. అర్జెంటీనా వార్తాపత్రిక క్లారన్ కథనం ప్రకారం బుధవారం ఉదయం ఈ ఫుట్‌బాల్ లెజెండ్ టైగ్రేలోని ఇంట్లో గుండెపోటుతో కన్నుమూశారు. 60 ఏళ్ల మారడోనా తుదిశ్వాస విడిచే వరకు ఆయన శ్వాసధ్యాస సాకరే. అనారోగ్యం కలవరపెడుతున్నా ఫుట్ బాల్ క్రీడకు ఆయన దూరం కాలేదు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ అక్టోబర్ 30 న మారడోనా ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇప్పటికీ వివిధ సాకర్ క్లబ్ లకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.ఇటీవల అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ సమీపంలోని లా ప్లాటాలో పట్రోనాటోను 3-0తో ఓడించిన గిమ్నాసియా జట్టుతో విజయానందంలో పాలుపంచుకున్నాడు. మెదడు శస్త్రచికిత్స అనంతరం కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి మారడోనా ను డిశ్చార్జ్ చేశారు. అయితే ప్రాణాంతక గుండె పోటు ఆయనను బలితీసుకుంది. తన 21 సంవత్సరాల కెరీర్లో కనబర్చిన అద్భుత ఆటతీరుతో మారడోనాకు "ఎల్ పిబే డి ఓరో" ("ది గోల్డెన్ బాయ్") అనే మారుపేరు స్థిరపడింది. అర్జెంటీనాకు 1986 లో ప్రపంచ కప్ టైటిల్‌ అందించిన ఘనాపాఠి మారడోనా. 20 వ ఫిఫా ప్లేయర్‌గా పీలేతో పాటు, మారడోనా గౌరవం పొందాడు.  2010 ప్రపంచ కప్ సందర్భంగా అర్జెంటీనాకు కొంతకాలం శిక్షణ ఇచ్చాడు.

Tuesday, November 24, 2020

PM Narendra Modi And AP CM YSJagan led trends across Social Media

ప్రజాదరణలో మోదీ, జగన్, మమతా టాప్

దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం జగన్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. సోషల్‌ మీడియా టాప్‌ ట్రెండ్స్‌ను చెక్‌బ్రాండ్స్‌సంస్థ నివేదిక రూపంలో వెల్లడించింది. గడిచిన మూణ్నెల్ల కాలంలో 95 మంది టాప్‌ పొలిటీషియన్లు, 500 మంది అత్యున్నత ప్రభావశీలురకు సంబంధించిన ట్రెండ్స్‌ను చెక్‌బ్రాండ్స్‌ విశ్లేషించింది. సోషల్‌ మీడియాలో మోదీ హవా టాప్ గేర్ లో కొనసాగుతోంది. తర్వాత స్థానంలో జగన్, మమతాలు దూసుకువచ్చారు. ట్విటర్, గూగుల్‌ సెర్చ్, యూట్యూబ్‌ ప్లాట్‌ఫామ్స్‌ల్లో అత్యధిక ట్రెండ్స్‌ మోదీ పేరుపైనే ఉన్నాయి. ఆగస్ట్‌ నుంచి అక్టోబర్‌ వరకు నమోదైన గణాంకాల్ని చెక్‌బ్రాండ్స్‌సంస్థ పరిగణలోకి తీసుకుంది.  10 కోట్ల ఆన్‌లైన్‌ ఇంప్రెషన్స్‌ ఆధారంగా ఈ తొలి నివేదికను వెలువరించింది. 2,171 ట్రెండ్స్‌తో మోదీ తొలి స్థానంలో ఉండగా స్వల్ప దూరంలో 2,137 ట్రెండ్స్‌తో జగన్‌ రెండో స్థానం కైవసం చేసుకున్నారు. మూడో స్థానంలో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ లు ఉన్నారు. బ్రాండ్‌ వ్యాల్యూ విషయంలోనూ మోదీనే తొలి స్థానంలో ఉన్నారు. ఆయన బ్రాండ్‌ వాల్యూ రూ. 336 కోట్లు కాగా ఆ తర్వాత స్థానాల్లో అమిత్‌ షా (రూ. 335 కోట్లు), ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (రూ. 328 కోట్లు) ఉన్నారు.

Saturday, November 21, 2020

Patient Watches BigBoss show and Avataar movie as Guntur doctors perform brain surgery

రోగి బిగ్ బాస్ షో

చూస్తుండగా బ్రెయిన్ సర్జరీ

గుంటూరు సర్వజనాసుపత్రి జీజీహెచ్ మరో రికార్డును సొంతం చేసుకుంది. మెదడులో కణితిని తొలగించే క్రమంలో రోగితో మాట్లాడుతూనే వైద్యులు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.  పెదకూరపాడు మండలం పాటిబండ్లకు చెందిన వరప్రసాద్‌(33)కు మెదడులో కణితి (బ్రెయిన్‌ ట్యూమర్‌) వచ్చింది. అయితే ఆ కణితిని 2016లో హైదరాబాద్‌లో డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించి తొలగించారు. ఆ తర్వాత రేడియేషన్ చికిత్స చేశారు. కానీ మళ్లీ వరప్రసాద్ కు ఫిట్స్ వస్తుండడంతో పరీక్షలు చేయగా మరో కణితి పెరిగినట్లు గుర్తించారు. డాక్టర్లు భవనం హనుమా శ్రీనివాసరెడ్డి, శేషాద్రి శేఖర్‌, త్రినాథ్‌ లు ఈ కేసును చాలెంజ్ గా తీసుకున్నారు. డాక్టర్లు మెదడు త్రీడీ మ్యాప్‌ను తయారు చేసుకుని.. నావిగేషన్‌ సాయంతో కణితి సరిగ్గా ఎక్కడ ఉందో గుర్తించారు. మెదడులో ఆ భాగం కీలకమైనది కావడంతో చాలా జాగ్రత్తగా సర్జరీ చేశారు. రోగి స్పృహలో ఉండగానే మెదడులో మార్పులు, పరిణామాలను గమనిస్తూ సర్జరీ చేశారు. అతడు మెలకువగా ఉండటం కోసం బిగ్‌బాస్ షో, అవతార్ సినిమా చూపించారు. రోగికి పైసా ఖర్చు లేకుండా బీమా సౌకర్యంతో సర్జరీ నిర్వహించారు. రోగి పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి శుక్రవారం డిశ్ఛార్జి చేశారు. ఇదే ఆసుపత్రిలో 2017 లోనూ ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించి వైద్యులు విజయం సాధించారు. విజయకుమారి అనే మహిళకు మెదడులో కణితి (కెవర్నోమా)ని ఆపరేషన్ చేసి తొలగించారు. ఆమెకు బాహుబలి-2 సినిమాను చూపిస్తూ అప్పట్లో ఈ శస్త్రచికిత్స చేశారు. గుంటూరు గవర్న్ మెంట్ హాస్పిటల్ న్యూరోసర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బీహెచ్ శ్రీనివాస్ రెడ్డి ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు.

Wednesday, November 18, 2020

Roja birthtday..takes blessings from CM YSJaganmohan Reddy

 రోజాకి జగన్ ఆశీస్సులు

నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులు అందజేశారు. రోజా బుధవారం తన పుట్టిన రోజు సందర్భంగా సీఎం ని కలిశారు. భర్త సెల్వమణితో కలసి అమరావతిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన రోజా జగన్‌ కు స్వీట్ బాక్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రోజాను ఆశీర్వదించి మిఠాయి తినిపించారు. అదే విధంగా రోజాకు జగన్ స్వీట్ బాక్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజున ఎవరైనా జగన్ వద్దకు వస్తే వారికి ఓ స్వీట్ బాక్స్ కానుకగా ఇవ్వడం ఆయనకు అలవాటు. అనంతరం రోజా ఈ సాయంత్రం తన కుటుంబసభ్యులతో కలిసి బర్త్ డే వేడుక ఘనంగా జరుపుకున్నారు.

Monday, November 16, 2020

Nitish Kumar takes oath as Bihar CM for fourth consecutive time

బిహార్ సీఎంగా నితీశ్ నాల్గోసారి 

బిహార్ ముఖ్యమంత్రిగా జెేడీ (యు) చీఫ్ నితీశ్ కుమార్  వరుసగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో ఆయనతో పాటు ఎన్డీయే కూటమిలోని పార్టీల నాయకులు కూడా కేబినెట్ మంత్రులుగా పదవులు చేపట్టారు. డిప్యూటీ సీఎంలుగా తార్కిషోర్ ప్రసాద్, రేణు దేవి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) చీఫ్ జితాన్ రామ్ మంజి కుమారుడు సంతోష్ కుమార్ సుమన్, వికాషీల్ ఇన్సాన్ పార్టీ (వి.ఐ.పి) కు చెందిన ముఖేష్ సాహ్ని, జేడీ (యు) విజయ్ కుమార్ చౌదరి, విజయేంద్ర ప్రసాద్ యాదవ్, అశోక్ చౌదరి, మేవాలౌచౌదరి తదితరులు మంత్రులుగా పదవీ ప్రమాణం చేశారు. 2005 నుంచి గరిష్ఠ కాలం బిహార్‌ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పదవులు చేపట్టిన సుశీల్ కుమార్ మోడీ (బీజేపీ)కి కొత్త మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఆయనకు సెంట్రల్ బెర్త్ దక్కవచ్చని సమాచారం. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్ హాజరుకాలేదు. నితీశ్ ప్రమాణ స్వీకారాన్ని ఆర్జేడీ బహిష్కరించింది. 

Friday, November 13, 2020

Telangana High Court Bans Sale, Use Of Firecrackers Ahead Of Diwali

తెలంగాణలో బాణసంచా నిషేధం

తెలంగాణలో బాణసంచా కొనుగోళ్లు, అమ్మకాలపై నిషేధం విధించారు. రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఈమేరకు ఆదేశాలు  జారీ చేసింది.  బాణసంచా కాల్చడం వల్ల పెద్దఎత్తున వాయుకాలుష్యం ఏర్పడుతోంది. ప్రజలు శ్వాస కోశవ్యాధుల బారిన పడుతున్నారు. వీటి క్రయవిక్రయాలు నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈమేరకు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై తెలంగాణ రాష్ట్ర క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టుకు అప్పీలు చేసింది. ఇప్పటికే కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, పశ్చిమబెంగాల్, సిక్కింల్లో బాణసంచాపై నిషేధం అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 మహమ్మారి కొనసాగుతున్న కారణంగా దీపావళికి ముందు రాష్ట్రంలో క్రాకర్ల అమ్మకం, వాడకాన్ని గౌరవ హైకోర్టు నిషేధించినట్లు సీనియర్ కౌన్సెల్ మాచార్ల రంగయ్య మీడియాకు తెలిపారు. కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా బాణసంచా కాల్చొద్దని హైకోర్టు సూచించిందన్నారు. ఈ మహమ్మారి ఇప్పటికే  చాలా మంది ప్రాణాలు బలిగొంది. సంక్రమణ ప్రధాన లక్షణంగా గల కరోనా ఊపిరితిత్తుల పైనే అధికప్రభావం చూపుతున్న దృష్ట్యా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చినట్లు వివరించారు. అంతేగాక ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించి నవంబర్ 19న నివేదికను సమర్పించాలని  హైకోర్టు ఆదేశాలిచ్చింది. 

Tuesday, November 10, 2020

Indian Premier League 2020 title winner again Mumbai

ఐపీఎల్ విజేత మళ్లీ ముంబయే!!

ఐపీఎల్ టాప్ క్లాస్ విన్నింగ్ టీమ్ ముంబయి మరో ఫైనల్ విజయాన్ని నమోదు చేసింది. డ్రీమ్ ఏ లెవన్ టోర్నీ తుది పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి మరోసారి ఐపీఎల్ విన్నర్ గా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబయికి ఇది అయిదో ఐపీఎల్ టైటిల్. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. గెలుపునకు 157 పరుగులు చేయాల్సిన ఎం.ఐ జట్టు కలిసికట్టుగా ఆడి టైటిల్ ను ముద్దాడింది. మరో ఎనిమిది బంతులు మిగిలివుండగానే అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. డీసీని కట్టడి చేయడంలో సక్సెస్ అయిన ఎం.ఐ. జట్టు బ్యాటింగ్ లోనూ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ముఖ్యంగా స్కిపర్ రోహిత్ శర్మ (68) అర్ధ సెంచరీ, ఇషాంత్ కిషన్ అద్భుత బ్యాటింగ్ (19 బంతుల్లో 33 పరుగులు) నైపుణ్యంతో జట్టును తేలిగ్గా విజయతీరానికి చేర్చారు. ఈ మ్యాచ్ తొలి బంతికే స్టోయినెస్ ను బౌల్ట్ బోల్తా కొట్టించాడు. పరుగులేమీ చేయకుండానే స్టోయినెస్ కీపర్ డీకాక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత రహానె(2), సూపర్ ఫామ్ లో ఉన్న ధావన్ (15) పరుగులకే వెనుదిరగ్గా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, యంగ్ టాలెంట్ రిషబ్ పంత్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. అయ్యర్ 50 బంతుల్లో 65 పరుగులు, రిషబ్ 38 బంతుల్లో 56 పరుగులతో అర్ధ  సెంచరీలు సాధించారు. రిషబ్ కి ఈ టోర్నీలో తొలి అర్ధ సెంచరీ ఇది. వీరిద్దరి జోడి నాల్గో వికెట్ కు 96 పరుగులు చేసి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. అయితే చివరి ఓవర్లలో ముంబయి బౌలర్లు బూమ్రా, బోల్ట్, జయంత్, కోల్ట్రెనైల్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఢిల్లీ పరుగులకు కళ్లెం వేశారు. బోల్ట్ నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు, కోల్ట్రెనైల్ 29 పరుగులకు 2 వికెట్లు తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును ట్రెంట్ బౌల్ట్ సాధించాడు.మ్యాచ్ తొలిబంతికే అవుటైన స్టోయినెస్ తన బౌలింగ్ లో తొలి బంతికే డీకాక్ ను క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చాడు. టోర్నీలో చక్కగా రాణించిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ రోహిత్ కోసం తన వికెట్ ను త్యాగం చేశాడు. ముంబయి పటిష్ట స్థితిలో ఉండగా లేని పరుగు కోసం యత్నించిన రోహిత్ కోసం సూర్యకుమార్ రనౌట్ గా వెనుదిరిగాడు. తాజా విజయంతో ముంబయి జట్టు 2013, 2015, 2017, 2019, 2020 ఐపీఎల్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నట్లయింది.

Monday, November 9, 2020

Trailblazers lifted JioT-20 womens Trophy for the first time

ట్రయల్ బ్లేజర్స్ దే టీ20 కప్

స్మృతి మంధాన విజృంభణతో ట్రయల్ బ్లేజర్స్ తొలిసారి మహిళల టీ20 కప్ ను సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన  జియో 2020 టీ20 చాలెంజర్ కప్ ఫైనల్స్ లో  సూపర్ నోవాస్ పై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్మృతి బ్యాటర్ గానే కాక కెప్టెన్ గానూ రాణించి మ్యాచ్ ను తన జట్టుకు తొలిసారి ట్రోఫీని సాధించిపెట్టింది. గతంలో ఈ ట్రోఫీని సూపర్ నోవాస్ రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్ పై కన్నేసినా ట్రయల్ బ్లేజర్స్ అన్నిరంగాల్లో రాణించి కైవసం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 119 పరుగులు చేసింది. స్మృతి 49 బంతుల్లో 3 సిక్సర్లు 5 ఫోర్లతో 68 పరుగులు స్కోరు చేసింది. ప్రత్యర్థి జట్టులో రాధా యాదవ్ 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 5 వికెట్లు ఖాతాలో వేసుకుంది. టీ20 మహిళా టోర్నీల్లో ఓ మ్యాచ్ లో 5 వికెట్లు సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డు సృష్టించింది. అనంతరం 120 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సూపర్ నోవాస్ 7 వికెట్లు కోల్సోయి 102 పరుగులే చేయగల్గింది. సల్మా కాతున్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా పొదుపుగా పరుగులిచ్చి దీప్తి శర్మ 2 వికెట్లు తీసింది. ఈ ఫైనల్స్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన స్మృతి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు మొత్తం మూడు అవార్డుల్ని సాధించడం విశేషం.

Sunday, November 8, 2020

CM Jagan condolences to YSRCP Kakinada city president Frooti Kumar`s Death

వైఎస్సార్సీపీ తూ.గో. నేత మృతి: సీఎం సంతాపం

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్ కరోనాతో ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన చురుగ్గా పనిచేస్తున్నారు. కరోనా సోకడంతో గత కొంతకాలంగా విశాఖపట్నంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. ఇటీవల సీఎం జగన్.. ఫ్రూటీకుమార్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి చంద్రకళా దీప్తికి ఫోన్‌ చేసి ఆరా తీశారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన అకాల మరణం బాధిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుమార్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తరుణంలో ఇలా జరగడం పట్ల విచారం వెలిబుచ్చారు.

Friday, November 6, 2020

TV9 has bagged a record 17 NT awards

టీవీ9 కు ఎన్టీ అవార్డుల పంట

టీవీ9 తెలుగు రికార్డు స్థాయిలో న్యూస్ టెలివిజన్ అవార్డులు సాధించింది. వివిధ విభాగాల్లో మొత్తం 17 అవార్డులు సొంతం చేసుకుని కాలరేగరేసింది. బెస్ట్ న్యూస్ డిబేట్ షో అవార్డును `బిగ్ న్యూస్ బిగ్ డిబేట్` దక్కించుకోగా బెస్ట్ ప్రైమ్టీవీ న్యూస్ యాంకర్ అవార్డును మురళీకృష్ణ కైవసం చేసుకున్నారు. బెస్ట్ టీవీ న్యూస్ ప్రెజెంటర్ అవార్డు పూర్ణిమకు లభించింది. బెస్ట్ డైలీ న్యూస్ బులిటెన్ అవార్డు `టాప్ న్యూస్ 9` ఖాతాలో వేసుకుంది. అదేమాదిరిగా బెస్ట్ టీవీ న్యూస్ రిపోర్టర్ గా అశోక్ వేములపల్లి, బెస్ట్ యంగ్ టీవీ జర్నలిస్ట్ గా స్వప్నిక అవార్డులు గెలుచుకున్నారు. బెస్ట్ ప్రైమ్ టైమ్ న్యూస్ షో అవార్డును `అనగనగా ఒక ఊరు` దక్కించుకుంది. అలాగే టీవీ9 తెలుగు బెస్ట్ న్యూస్ చానల్ వెబ్సైట్ అవార్డు tv9telugu.com ను వరించింది.

Tuesday, November 3, 2020

3 Killed in Vienna `Terror Attack` At 6 Locations

వియన్నాలో ఉగ్రపంజా

          · ముంబయి దాడి తరహాలో ఘటన

ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉగ్రవాదులు పంజా విసిరారు. దేశంలో మంగళవారం నుంచి రెండో విడత కరోనా లాక్ డౌన్ విధించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా సోమవారం అర్ధరాత్రి వరకు హోటళ్లు, మార్కెట్, మాల్స్ లో ఆనందంగా గడిపారు. ఇదే అదునుగా వియన్నా లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో ముష్కరులు ఇష్టానుసారం కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ముగ్గురు దుర్మరణం చెందగా మరో 15 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సెంట్రల్ వియన్నా అంతటా సోమవారం రాత్రి వేర్వేరు ప్రాంతాల్లో జట్లుగా విడిపోయిన ఉగ్రవాదులు పెద్దఎత్తున కాల్పులకు దిగారు.  ఈ దుశ్చర్యను ఛాన్సలర్ సెబాస్టియన్ కుర్జ్ `పాశవిక ఉగ్రవాద దాడి`గా పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిలో ఓ వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా బంధించినట్లు తెలుస్తోంది. అయితే ప్రజలంతా నగరం మధ్యలోనే సురక్షితంగా ఉండాలని సరిహద్దు తనిఖీలను ముమ్మరం చేశామని దేశ అంతర్గత వ్యవహారాలశాఖ (హోం) మంత్రి కార్ల్ నెహమ్మర్ తెలిపారు. పిల్లలు మంగళవారం పాఠశాలకు హాజరు కానవసరం లేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారత్ లో పన్నేండేళ్ల క్రితం (2008 నవంబర్ 26-29 తేదీల్లో) పాక్ నుంచి దేశంలోకి చొరబడిన లష్కర్ ఎ తోయిబాకు చెందిన ముష్కరులు 166 మందిని బలిగొన్న సంగతి తెలిసిందే. నాడు ఈ ఉగ్రదాడిలో మొత్తం 10 మంది పాల్గొన్నారు.

Saturday, October 31, 2020

Government directs private schools to cut tuition fee by 30%

30% ఫీజుల కోతకు సర్కారు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూలు, కాలేజీ ఫీజుల్లో కోత విధిస్తూ శుభవార్తను అందించింది. స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ (ఎ.పి.ఎస్.ఇ.ఆర్.ఎం.సి) సిఫారసు ఆధారంగా, ప్రస్తుత విద్యా సంవత్సరానికి (2020-21) ఫీజుల్లో 30% తగ్గించి వసూలు చేయాలని ఆదేశించింది. విద్యా సంవత్సరానికి గాను ట్యూషన్ ఫీజులో 70 శాతం మాత్రమే వసూలు చేయాలని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు తెలియపర్చింది.
కోవిడ్ -
19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత వెసులుబాటు తప్పనిసరి అయినందునే ఈమేరకు ఆదేశాలిచ్చినట్లు జగన్ సర్కారు స్పష్టం చేసింది. ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు 2020-21 సంవత్సరానికి సమీక్షించి ఫీజులు నిర్ణయించాలని ఎ.పి.ఎస్‌.ఇ.ఆర్‌.ఎం.సి. ఇంతకుముందే ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి ఈ  మే 26 న నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేగాక సంబంధిత డేటాను సమర్పించాలని యాజమాన్యాల్ని ఆదేశించింది. ఇదిలావుండగా తాజా ఆదేశాలను లెక్కజేయకుండా పూర్తి ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.                                                                  
నవంబర్ 2 నుంచి 9,10 తరగతులు, ఇంటర్‌కు క్లాస్‌లు జరుగుతాయి. 23 నుంచి 6,7,8 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్-14 నుంచి 1,2,3,4,5 తరగతులకు క్లాస్‌లు ప్రారంభమవుతాయి. రోజు విడిచి రోజు పాఠశాలల్లో తరగతులు నిర్వహించనున్నట్లు ఇటీవల ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహిస్తామని ఇదివరకే ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

Tuesday, October 27, 2020

Unlock guidelines issued in September to remain in force till November 30: MHA

నవంబర్ 30 వరకు అన్ లాక్-5 నిబంధనలే 

అన్ లాక్-5 నిబంధనలే నవంబర్ 30 వరకు అమలులో ఉంటాయని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది. మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి రాగా జూన్ 1 నుంచి దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను అమలు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న అన్ లాక్-5 నిబంధల్ని నవంబర్ ముగిసేవరకు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ కొద్దిరోజుల క్రితం స్వయంగా మీడియా ముందుకు వచ్చి కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. లాక్‌డౌన్ తీసేయడం అంటే కరోనా పోయినట్లు భావించొద్దని ఆయన స్పష్టం చేశారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంతవరకు దాని విషయంలో అజాగ్రత్త వద్దని సూచించారు. పండగల సమయంలో కరోనా విషయంలో మరింత అప్రమత్తత అవసరమని సూచించారు. గత నెల అన్ లాక్-5 సడలింపులను ప్రకటించిన కేంద్రం అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు అనుమతించింది. అయితే దీనిపై ఆయా రాష్ట్రాలు, విద్యాసంస్థలే నిర్ణయం తీసుకోవాలని కోరింది. విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఇదే సమయంలో ఆన్ లైన్, డిస్టెన్స్ విద్యకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, ఎగ్జిబిషన్ హాల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో వీటిని నిర్వహించాలని షరతు పెట్టింది.

Monday, October 26, 2020

Kanyaka Parameswari Mata decoration with worth above Rs.1 crore currency notes

రూ.కోటి కాంతుల కన్యకాపరమేశ్వరీ

తెలంగాణ గద్వాల్ లోని ప్రసిద్ధ శ్రీ కన్యకాపరమేశ్వరీ ఆలయం సోమవారం కరెన్సీ నోట్లతో దగదగలాడింది. ఈరోజు అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చింది. కన్యకాపరమేశ్వరీ మాతను రూ.1,11,11,111 విలువైన కరెన్సీతో అలంకరించారు. రంగురంగుల కరెన్సీ నోట్లను పుష్పాల మాదిరిగా మలచి అమ్మవారికి అలంకరించారు. చాలా కాలం లాక్ డౌన్ కారణంగా మూసివున్న ఆలయం దసరా పర్వదినం వల్ల తెరుచుకోవడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రంగురంగుల దీపపు కాంతులతో ఆలయం దేదీప్యమానంగా వెలుగుతోంది. ఈ ఆలయం హైదరాబాద్ కు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతేడాది దసరాతో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య కూడా తగ్గింది. అదేవిధంగా గత దసరాలో అమ్మవారిని రూ.3 కోట్ల 33 లక్షల 33 వేల 33 నోట్లతో అలంకరించినట్లు ఆలయ కోశాధికారి పి.రాము తెలిపారు.

Saturday, October 24, 2020

Gitam University Constructions Demolished by Revenue officials

గీతం వర్సిటీ అక్రమ కట్టడాల కూల్చివేత

 విశాఖ గీతం యూనివర్సిటీలో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. వర్సిటీకి చెందిన కొన్నికట్టడాల్ని రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు. ప్రభుత్వ భూములు అక్రమించి ఈ నిర్మాణాలు చేపట్టారని అధికారులు పేర్కొన్నారు. రుషికొండ, ఎండాడ పరిధిలో 40.51 ఎకరాల్లో గీతం యాజమాన్యం చేపట్టిన నిర్మాణాలు కొన్ని అక్రమమని రెవెన్యూ యంత్రాంగం విచారణలో తేలిందట. యూనివర్సిటీ ప్రహరీ (కొంత భాగం), ప్రధాన ద్వారాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆ పరిసరాల్లో భారీగా పోలీసుల్ని మోహరించారు. బీచ్ రోడ్డు మీదుగా యూనివర్సిటీ వైపు వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేశారు. ఆ పరిసరాల్లోకి ఎవర్ని అధికారులు అనుమతించడం లేదు. అయితే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు నిర్మాణాల్ని కూల్చివేస్తున్నారని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆరోపిస్తోంది. సినీ నటుడు బాలకృష్ణ చిన్నఅల్లుడు, టీడీపీ నేత భరత్ ఈ వర్సిటీకి చైర్మన్‌గా ఉన్నారు. ఆయన 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Thursday, October 22, 2020

Vijayawada 6th day of Navratri festival goddess Durga worshiped as Lalitha Tripura Sundari Devi

లలితా త్రిపురసుందరిదేవిగా అనుగ్రహిస్తోన్న కనకదుర్గమ్మ

విజయవాడలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శ్రీ లలితాత్రిపురసుందరిదేవిగా భక్తుల్ని అనుగ్రహిస్తోంది. ఆరో రోజు గురువారం తెల్లవారుజాము 5 నుంచే పెద్ద సంఖ్యలో భక్తులకు అమ్మలగన్నమ్మ దర్శనం లభిస్తోంది. శ్రీచక్ర అధిష్ఠానశక్తిగా, పంచదాశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసిన అమ్మవారిని తిలకించి భక్తులు, ఉపాసకులు తరిస్తున్నారు. బుధవారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మూలా నక్షత్రం రోజున కనకదుర్గమ్మను సీఎం సంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి దర్శించుకున్నారు. ఆయనకు అమ్మవారి ఫొటోను  దేవస్థానం ట్రస్ట్ బహుకరించింది. అదేవిధంగా సీఎం అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దుర్గగుడి 2021 క్యాలెండర్‌ను జగన్ ఆవిష్కరించారు.

Tuesday, October 20, 2020

Officials on alert as IMD extends heavy rain warning for next 72 hours in Telugu states

జడి వానకు.. వెన్నులో వణుకు

ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎడతెగని వానలతో భీతిల్లుతున్నాయి. ఇటీవల కుంభవృష్టికి ఊళ్లకు ఊళ్లు చివురుటాకుల్లా వణికిపోయాయి. మరోవిడత ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో జడివాన విరుచుకుపడనుంది. రాగల మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రంగా మారనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ కారణంగా ఏపీలో ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిశ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రాబోయే 72 గంటల్లో అతి భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనా. అదే విధంగా కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు; అనంతపురం, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది.

Friday, October 16, 2020

Punjab: Shaurya Chakra Awardee Balwinder Singh Shot Dead In Tarn Taran

ఉగ్ర తూటాలకు నేలకొరిగిన `శౌర్య చక్ర`

ఉగ్రవాదులకు ఆయన సింహస్వప్నం.. ముష్కరుల ఏరివేతలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన యోధుడు. ఆయనే బల్వీందర్ సింగ్.  నిరుపమాన సేవలకు గాను 1993లో భారత ప్రభుత్వం ఆయనను శౌర్య చక్ర పురస్కారంతో సత్కరించింది. బల్వీందర్ సింగ్ పై లెక్కలేనన్ని సార్లు ఉగ్రవాదులు హత్యాయత్నాలకు పాల్పడ్డారంటేనే ఆయన వారిపై ఏ స్థాయిలో ఉక్కుపాదం మోపారో తేటతెల్లమౌతుంది. అయితే ఏడాది కిందట ఎందుకనో ప్రభుత్వం ఆయనకు సెక్యూరిటీని తగ్గించింది. దాంతో శుక్రవారం బల్వీందర్ సింగ్ ఇంటిపై దాడి చేసిన దుండగులు ఆయనను అతి సమీపం నుంచి కాల్చి చంపారు. పంజాబ్‌లోని తరణ్ తరణ్ జిల్లాలోని భిఖివింద్ గ్రామంలోని తన నివాసం పక్కనే ఉన్న కార్యాలయంలో బల్వీందర్ సింగ్ ఉండగా మోటార్ బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపి పారిపోయారని పోలీసులు తెలిపారు. 62 ఏళ్ల ముదిమిలో ఉగ్రవాదులు ఆయనను పొట్టనబెట్టుకున్నారు. ఉగ్రవాదుల‌కు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన బల్వీందర్ సింగ్‌కు పంజాబ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన దారుణంగా హత్యకు గురవ్వడం రాష్ట్ర వాసుల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

Wednesday, October 14, 2020

Legendary Kuchipudi Dancer Shobha Naidu Passed away

నాట్య మయూరి శోభానాయుడు ఇకలేరు

ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి శోభా నాయుడు (64) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. సెప్టెంబర్‌ నుంచి  శోభా నాయుడు చికిత్స పొందుతూ ఉన్నారు. ఇంట్లో జారిపడడంతో తలకు తీవ్ర గాయమైంది. అప్పట్నుంచి ఆమె ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. ఆర్థో న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్నారు. అదే క్రమంలో శోభానాయుడుకు కరోనా కూడా సోకింది. దాంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. కరోనా పాజిటివ్ అని తేలిన దగ్గర నుంచి ఆమె ఆస్పత్రికే పరిమితమయ్యారు. 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించిన శోభానాయుడు కూచిపూడి నృత్యంతో జగద్విఖ్యాతి సాధించారు. క్వీన్స్ మేరీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 12 ఏళ్లకే కూచిపూడిలో ఆరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆమె ఎన్నో వేల ప్రదర్శనలు ఇచ్చారు. వెంపటి నృత్య రూపాలలోని పలు పాత్రలను పోషించారు. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో రాణించి మెప్పించిన శోభా నాయుడును కేంద్రం 2001లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 40 ఏళ్లగా కూచిపూడి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న శోభా నాయుడుకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శిష్యులున్నారు.

Thursday, October 8, 2020

`Jagananna Vidya Kanuka` launches in Andhra Pradesh by CM YSJagan Mohan Reddy

గుర్తుకొస్తున్నాయి..!

బాల్యం ఎవరికైనా తిరిగి రాని తీపి గుర్తు. మన సీఎం జగన్ అందుకు అతీతులు కాదు. ఇదిగో అందుకు ఇదే సాక్ష్యం.. స్కూలు బ్యాగ్ తగిలించుకుని జగన్ పిల్లాడిలా ఇలా మురిసిపోయారు. ఒక్క క్షణం ఆనందడోలికల్లో తేలియాడారు. `విద్యాకానుక` పథకాన్ని గురువారం మంత్రులు, అధికారులు సమక్షంలో ప్రారంభించిన సందర్భంగా జగన్ ఇలా స్కూలు బ్యాగును భుజాన వేసుకుని ఫొటోలకు పోజిచ్చారు. సీఎం ఆల్బమ్ లోఈరోజు ఫొటో మరో చిత్రరాజమే. గతేడాది డిసెంబర్ 7`కంటి వెలుగు` పథకాన్ని ప్రారంభించిన సందర్భంగానూ జగన్ ఇదే తరహాలో అపురూపమైన ఫొటోతో అలరించారు. నాటి కార్యక్రమంలో పిల్లలకు అందజేసిన కళ్లజోడును ధరించిన సీఎం చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగారు.