Thursday, August 22, 2019

Kia Seltos SUV launched by Tiger Shroff in Mumbai


కియా సెల్టాస్ కారును ప్రారంభించిన టైగర్ ష్రాఫ్
మేడ్ ఇన్ ఇండియా కియా సెల్టాస్ కారును కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ ముంబయిలో గురువారం ప్రారంభించారు. దక్షిణకొరియా దిగ్గజ అటో మోటార్ కార్ప్ కియా కార్ల ఉత్పత్తి కర్మాగారాన్ని భారత్ లో ఆరంభించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో కియా ఉత్పత్తి కేంద్రంలో తయారైన కియా సెల్టాస్ కారు (రూ.9.7లక్షలు) డిజిల్, పెట్రోల్, టర్బో పెట్రో మోడళ్లలో మార్కెట్ లో లభ్యమౌతోంది. కంపెనీ ప్లాంట్ (పెనుగొండ) లో కియా సెల్టాస్ మోడల్ కు సంబంధించి 5,000 కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ మోడల్ ఎస్.యు.వి.లకు ఆన్ లైన్ ద్వారా ఇప్పటికే 32,000 బుకింగ్స్ జరిగినట్లు కియా మోటార్స్ ఇండియా ఎండీ, సీఈఓ కుక్యాన్ షిమ్ తెలిపారు. కియా సెల్టాస్ ఎస్.యు.వి.కి ఆసియా దేశాలతో పాటు, యూరప్, లాటిన్ అమెరికా దేశాల్లోనూ డిమాండ్ రావచ్చన్నారు. టర్కీలో తయారవుతున్న హుండై గ్రాండ్ ఐ-10 నియోస్ కు కియా సెల్టాస్ గట్టి పోటీ ఇవ్వొచ్చని భావిస్తున్నారు. యూరప్ మార్కెట్  ప్రధానంగా హుండై గ్రాండ్ ఎన్ సీరిస్ కార్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. భారత్ లో గత కొద్ది నెలలుగా విక్రయాల పరంగా ఆటోమొబైల్ పరిశ్రమ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న సమయంలో కియా చాలెంజ్ గా తమ కన్జ్యూమర్ ఫ్రెండ్లీ కార్లను విడుదల చేస్తోంది. ప్రతి మూణ్నెలకో కొత్త మోడల్ కారుతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్నామని కియా ప్రకటించడం విశేషం.