Monday, July 19, 2021

AP CM YSJagan Polavaram project tour highlights review development works

 సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు సందర్శన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను సమీక్షించారు. ప్రాజెక్టు సందర్శనలో భాగంగా తొలుత ఆయన ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం అధికారులతో కలిసి సీఎం క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రాజెక్టును హిల్ వ్యూ పాయింట్ వద్ద నుంచి జగన్ స్వయంగా పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్ పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. తర్వాత జగన్‌  పోలవరం నిర్వాసితులతో మాట్లాడారు. స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్‌ను సీఎం పరిశీలించాకా పోలవరం పనుల ఫొటో గ్యాలరీని వీక్షించారు. సీఎం వెంట నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. గడువులోగా పనులు పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలుత నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 2022 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరాలని సూచించారు.