Thursday, June 30, 2022

Sri Sathya Sai auto accident CM YSJagan announces Rs.10 lakhs ex gratia

 కూలీల్ని పొట్టనబెట్టుకున్న కరెంట్ తీగ

శ్రీ సత్యసాయి జిల్లాలో గురువారం ఘోర దుర్ఘటన సంభవించింది. తాడిమర్రి మండలంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలో అయిదుగురు మహిళలు సజీవదహనం అయ్యారు. చిల్లకొండయ్యపల్లిలో ఈ ఉదయం వ్యవసాయ పనుల కోసం మహిళా కూలీలు ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో ఆటోపై  హైటెన్షన్‌ కరెంట్‌ తీగలు తెగిపడిపోయాయి. దాంతో ఒక‍్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో ఆటోలో వెళ్తున్న మహిళా కూలీలు అక్కడికక్కడే కాలిబూడిదయ్యారు. వీరిని గుడ్డంపల్లి వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.