Thursday, October 8, 2020

`Jagananna Vidya Kanuka` launches in Andhra Pradesh by CM YSJagan Mohan Reddy

గుర్తుకొస్తున్నాయి..!

బాల్యం ఎవరికైనా తిరిగి రాని తీపి గుర్తు. మన సీఎం జగన్ అందుకు అతీతులు కాదు. ఇదిగో అందుకు ఇదే సాక్ష్యం.. స్కూలు బ్యాగ్ తగిలించుకుని జగన్ పిల్లాడిలా ఇలా మురిసిపోయారు. ఒక్క క్షణం ఆనందడోలికల్లో తేలియాడారు. `విద్యాకానుక` పథకాన్ని గురువారం మంత్రులు, అధికారులు సమక్షంలో ప్రారంభించిన సందర్భంగా జగన్ ఇలా స్కూలు బ్యాగును భుజాన వేసుకుని ఫొటోలకు పోజిచ్చారు. సీఎం ఆల్బమ్ లోఈరోజు ఫొటో మరో చిత్రరాజమే. గతేడాది డిసెంబర్ 7`కంటి వెలుగు` పథకాన్ని ప్రారంభించిన సందర్భంగానూ జగన్ ఇదే తరహాలో అపురూపమైన ఫొటోతో అలరించారు. నాటి కార్యక్రమంలో పిల్లలకు అందజేసిన కళ్లజోడును ధరించిన సీఎం చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగారు.