Saturday, March 19, 2022

10 died 25 injured in bus accident in Karnataka

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

·        10 మంది దుర్మరణం, 15 మందికి గాయాలు

కర్ణాటకలోని ఓ ట్రావెల్స్ బస్ బోల్తా పడిన దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 26 మందితో ప్రయాణిస్తున్న ఎస్.వి.టి. బస్సు అతివేగంగా ప్రయాణిస్తుండడం వల్లే డివైడర్ ను ఢీకొట్టి బోల్తాపడిందని స్థానికులు తెలిపారు. వై.ఎన్.హోసకోట నుంచి పావగడకి బస్సు బయలుదేరింది. పలవలహళ్లి సమీపంలో ప్రమాదం బారినపడింది. ఈ దుర్ఘటనలో 15 మంది గాయాల పాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.