Sunday, April 12, 2020

Super Star Mahesh Babu intresting tweet on quarantine time

సితారతో ఆడుకుంటున్న ప్రిన్స్ మహేశ్
వృత్తి, ప్రవృత్తి పరంగానూ టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ శైలి పూర్తి క్రమశిక్షణతో కూడుకున్నది. దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ నేపథ్యంలోనూ ఆయన అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. ఏమాత్రం తీరిక దొరికినా కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడిపే తెలుగు సూపర్ స్టార్ ప్రస్తుతం అదే అనుసరిస్తున్నారు. భార్యాపిల్లలతో  ఎంచక్కా ఇంట్లోనే ఉంటూ సరదాగా గడుపుతున్నారు. క్వారంటైన్ టైమ్ని తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నట్లు ఆయన ఫొటోతో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. తన గారాలపట్టీ సితారతో మహేశ్ ఆడుకుంటున్న ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది. 'అందరూ ఇంట్లోనే ఉండండి.. సేఫ్గా ఉండండి' అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక ఫ్యాన్స్ ఫొటోతో పండుగ చేసుకుంటున్నారు. `ఇది చాలు' మాకు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలావుండగా 'సరిలేరు నీకెవ్వరు' బిగ్గెస్ట్ హిట్ తో ఖుషీగా ఉన్న మహేష్ 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్దర్శకత్వంలో మూవీని ఫైనల్ చేయనున్నారు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.