Friday, March 26, 2021

President Ramnath Kovind visits army hospital after experiencing chest discomfort

ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన రాష్ట్రపతి

స్వల్ప అస్వస్థత కారణంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆర్మీ రిసెర్చ్ ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం ఉదయం ఆయనకు ఛాతీలో నొప్పిగా అనిపించడంతో రాష్ట్రపతి భవన్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అక్కడ వైద్యులు తెలిపారు. అయితే ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. రాష్ట్రపతికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు వివరించారు. ఈమేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. రాష్ట్రపతి ఇటీవల కరోనా వ్యాక్సిన్‌ను వేయించుకున్నారు. దేశంలో రెండో దశ టీకా పంపిణీ ప్రారంభమైన తర్వాత మార్చి 3న ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలోనే రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారు. మార్చి 8న ప్రథమ మహిళ ఆయన సతీమణి సవితా కోవింద్‌ కు టీకా వేశారు.