Friday, December 6, 2019

It`s a lesson to the rapist`s:Chiru and Balaiah


రేపిస్టులకు ఇదో గుణపాఠం: చిరంజీవి
షాద్ నగర్ ప్రాంతంలోని చటాన్ పల్లిలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు నిర్వహించిన ఎన్ కౌంటర్ రేపిస్టులకు గొప్ప గుణపాఠం వంటిందని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. `దిశ` విషాదాంతంలోని నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారన్న వార్తను ఉదయం టీవీలో చూశానన్నారు. నిజంగా దీంతో ఆ  కుటుంబానికి సత్వర న్యాయం లభించినట్లేనని చెప్పారు. ఈ ఎదురుకాల్పులతో దిశ తల్లిదండ్రుల ఆవేదనకు కొంత ఊరట లభిస్తుందన్నారు. వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కిరావడం అభినందనీయమని మెగాస్టార్ చెప్పారు. సీపీ సజ్జనార్‌ సహా యావత్ తెలంగాణ పోలీస్‌ శాఖకు, సీఎం కేసీఆర్‌ కు చిరంజీవి అభినందనలు తెలిపారు.

దేవుడే పోలీసుల రూపంలో వచ్చాడు:బాలకృష్ణ
మరో టాలీవుడ్ వెటరన్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ దేవుడే పోలీసుల రూపంలో వచ్చి `దిశ` నిందితులకు సరైన శిక్ష విధించాడన్నారు. ఎవరూ మరోసారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడబోరని, అసలు అటువంటి ఆలోచనే మొలకెత్తదని.. అందుకు తగిన సందేశాన్ని తాజా ఎన్ కౌంటర్ ద్వారా పోలీసులు సమాజానికి అందించినట్లు చెప్పారు. అందరికీ ఇదొక గుణపాఠం కావాలన్నారు. ``దిశ` ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరిందిఅని బాలకృష్ణ పేర్కొన్నారు.