Monday, April 22, 2019

chennai two cars go up in flames cause of malfunctioned

పెట్రోల్ కారులో డీజిల్ కొట్టడంతో రెండు కార్లు దగ్ధం

చెన్నైలో పొరపాటున ఓ వ్యక్తి తన పెట్రోల్ కారుకు డీజిల్ కొట్టించాడు. దాంతో అతని కారుకు మంటలంటుకుని పక్కనే ఉన్న మరో కారుకు వ్యాపించడంతో రెండూ దగ్ధమైన ఘటన చెన్నైలో జరిగింది. సోమవారం (ఏప్రిల్ 22) ఉదయం 11కు ఈ ఘటన జి.ఎన్.శెట్టి రోడ్డులో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ప్రయివేటు బ్యాంక్ లో పనిచేస్తున్న రమేశ్ తన కారులో ఇంధనం పోయించడానికి వెళ్లాడు. అక్కడ బంక్ లో డీజిల్ కొట్టారు. కారు ట్రబుల్ ఇస్తుండగా రాత్రి ఎలాగోలా తను నివాసముంటున్న కెనరా బ్యాంక్ కాలనీకి తిరిగి వచ్చి దగ్గర్లో గల టీనగర్ లో కారును పార్క్ చేశాడు. సోమవారం మెకానిక్ ని తీసుకు వచ్చి చూపించాడు. అతని ద్వారా కారులో డీజిల్ పోసిన విషయం గ్రహించాడు. ఇంతలోనే కారు నుంచి పొగలు వస్తుండడాన్ని వారు గమనించారు. అంతలోనే కారులో మంటలు ఎగసి పడ్డాయి. పక్కనే పార్క్ చేసి ఉన్న మాధవన్ అనే వ్యక్తి కారుకు జ్వాలలు వ్యాపించడంతో రెండు కార్లూ తగలబడిపోయాయి.



karnataka cid team in raichur to investigate btech girl`s death


బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతిపై సీఐడీ దర్యాప్తు
కర్ణాటకలోని రాయచూర్ కు చెందిన 23 ఏళ్ల బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ బిడ్డను పోగొట్టుకున్నామని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దాంతో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన గళం విప్పడంతో ప్రభుత్వం ఈ దర్యాప్తునకు ఆదేశించింది. నవోదయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆమె మూడో సంవత్సరం చదువుతోంది. ఇంటి నుంచి ఏప్రిల్13న వెళ్లిన విద్యార్థిని జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. అయితే పోలీసులు పట్టించుకోలేదు. ఏప్రిల్ 15న ఓ ఫామ్ హౌస్ లో చెట్టుకు ఉరి వేసిన స్థితిలో విద్యార్థిని శవాన్ని కనుగొన్నారు. తొలుత పోలీసులు సైతం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే తమ బిడ్డను అదే కాలేజీలో చదువుతున్న సుదర్శన్ యాదవ్ అత్యాచారం చేసి చంపేసి సూసైడ్ డ్రామా ఆడుతున్నాడని వారు ఆరోపించారు. ఈ సుదర్శన్ బంధువు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుండడంతో కేసును మాఫీ చేసే ప్రయత్నం చేశాడన్నారు. విద్యార్థిని తను పరీక్షలో ఫెయిల్ కావడంతోనే మనస్థాపంతో ఉరివేసుకుంటున్నట్లు నకిలీ సూసైడ్ నోట్ ను సుదర్శన్ సృష్టించాడని పేర్కొన్నారు. దాంతో ప్రభుత్వం సీఐడీ ఎస్.పి. శరణప్ప ఆధ్వర్యంలో కేసు దర్యాప్తునకు సోమవారం ఆదేశాలిచ్చింది.



sri lanka receives brand new type of terrorism bombings death toll raises to 290 hurted 500 people


శ్రీలంకలో కొత్త తరహా ఉగ్రవాదం 


  • 290కు పెరిగిన మృతుల సంఖ్య 
  • 500 మందికి గాయాలు

శ్రీలంకలో దశాబ్దం తర్వాత భారీ సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. జాతుల సమరంలో నిత్యం రక్తమోడిన దేశం పదేళ్లుగా దాదాపు ప్రశాంతంగా ఉంది. ఆదివారం (ఏప్రిల్21) మళ్లీ రక్త చరిత్ర ప్రపంచం ముందు సాక్షాత్కారమయింది. పర్యాటక ప్రాంతాలు, విదేశీయులే లక్ష్యంగా ఉగ్రవాదులు తాజా బాంబు పేలుళ్లకు తెగబడిన నేపథ్యంలో మృతుల సంఖ్య 290కు పెరగింది. అంతకు దాదాపు రెట్టింపు సంఖ్యలో 500 మందికి పైబడి క్షతగాత్రులయ్యారు. ఆదివారం ఉదయం నుంచి చర్చిలు, స్టార్ హోటళ్లు ఎనిమిది చోట్ల ఉగ్రమూక ఆత్మాహుతి దాడులకు బరితెగించింది. దాంతో దేశంలో అత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ)ని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. విమాన, రైలు, బస్ తదితర అన్ని రవాణా వ్యవస్థల్ని నిలిపివేసింది. దేశం నలుమూలలా ముమ్మర గాలింపు చేపట్టింది. అనుమానితులు 24 మందిని ఇంతవరకు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రాజధాని కొలంబోలోని బండారు నాయకే విమానాశ్రయంలో ఓ బాంబు పేలకుండా భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. మొత్తంగా తొమ్మిది చోట్ల బాంబు(ఐ.ఇ.డి)లు ఉగ్రవాదులు అమర్చగా ఆఖరి బాంబును పేలకుండా నిర్వీర్యం చేసినట్లు సమాచారం. మొహ్మద్ సాహారన్ నాయకత్వంలోని జాతీయ తవాహిద్ జమాన్(ఎన్ టీ జే) ఉగ్రవాద సంస్థ నుంచి ముప్పున్నట్లు నిఘా వర్గాలు ముందుగానే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఎంతో ముందుగానే ఉప్పందినా ప్రభుత్వ ఉదాసీనత కారణంగా శ్రీలంక భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.
భారత్ లో హైఅలర్ట్
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఓ వైపు జరుగుతుండగా శ్రీలంక లో ఉగ్రవాదులు చెలరేగిపోయిన నేపథ్యంలో భారత్ అప్రమత్తమయింది. ఉగ్రవాదుల ఆత్మాహుతి బాంబు పేలుళ్లలో సుమారు ఏడుగురు భారతీయులు చనిపోయినట్లు రాయబార కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని మోదీ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని విక్రమ్ సింఘేలతో ఫోన్ లో మాట్లాడారు. బాంబు దాడుల్ని తీవ్రంగా ఖండించి శ్రీలంక కు అవసరమైన సాయాన్ని అందించడానికి ముందుంటామని హామీ ఇచ్చారు. దాడులు ఆటవిక చర్యగా అభివర్ణించిన ప్రధాని మోదీ ఇవి ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసిన పేలుళ్లగా పేర్కొన్నారు. ఉగ్రవాదం మానవాళికి పొంచి ఉన్న పెనుముప్పుగా చెప్పారు. ఇది ఓ దేశానికో ప్రాంతానికో కాక యావత్ ప్రపంచానికి సంబంధించిన పెను సమస్యని మోదీ పేర్కొన్నారు. శ్రీలంక-భారత మధ్య దూరం కేవలం 18 కి.మీ ఉండడంతో తమిళనాడు తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.