Monday, May 17, 2021

TTD vigilance officers found huge cash from begger`s house in Tirupati

ఈ యాచకుడు లక్షాధికారి!

కరోనాతో చనిపోయిన ఓ యాచకుడి ఇంట్లో బయటపడిన డబ్బుల కట్టలు సంచలనం రేపాయి. సోమవారం తిరుపతిలో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) విజిలెన్స్ అధికారుల దాడిలో ఈ విషయం వెలుగుచూసింది. తిరుమల స్వామి వారి సన్నిధిలో ఏళ్ల తరబడి భిక్షాటన చేసిన శ్రీనివాసాచారి అనే వ్యక్తి గతేడాది కరోనాతో చనిపోయాడు. గతంలో ఈ యాచకుడు తిరుమలలోనే గుడిసె వేసుకుని భిక్షాటన చేస్తూ పొట్టపోసుకునేవాడు. అయితే టీటీడీ కొండపై ఈ విధంగా జీవనం సాగిస్తున్న వారినందర్ని తిరుపతికి తరలించి ఇళ్లను నిర్మించి ఇచ్చింది.  ఆ విధంగా రోజువారీ శ్రీనివాసాచారి తిరుమల నుంచి రాత్రికి తిరుపతి చేరుకుని టీటీడీ కేటాయించిన ఇంట్లో నివసించేవాడు. అతనికి బంధువులు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగానే ఉండేవాడని ఇరుగుపొరుగులు తెలిపారు. కరోనాతో చనిపోవడంతో అతనికిచ్చిన ఇంటిని వేరేవారికి కేటాయించేందుకు విజిలెన్స్ తనిఖీ కోసం ఆ ఇంటికి వచ్చింది. ఇంటి తలుపులు తెరిచి లోపలకు వెళ్లిన అధికారులకు  పెద్ద ఎత్తున డబ్బు కట్టలు కనిపించడంతో అవాక్కయ్యారు. టీటీడీ స్వాధీనం చేసుకున్న ఆ సొమ్ము రూ.10 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.