Wednesday, June 2, 2021

Petrol Diesel rates hike in Telangana

టీఎస్ లో సెంచరీ కొట్టిన పెట్రోల్

తెలంగాణలో పెట్రోల్ సెంచరీ కొట్టింది. ఆదిలాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.23 పైసలుగా ఉంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు మరోసారి పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు, లీటర్ డీజిల్‌పై 23 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఒక్క నెల రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలనూ ఆయిల్ కంపెనీలు 17 సార్లు పెంచాయి. ఓ వైపు కరోనా లాక్ డౌన్ మరోవైపు ధరాఘాతంతో ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో పాటు వంట నూనె, కూరగాయల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా పెట్రోల్ ధరల సెగ జనాలకు తాకుతోంది. సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూంటాయి. ఈ నేపథ్యంలో పెట్రో ధరలు ఒక రోజు పెరగొచ్చు.. లేదా తగ్గొచ్చు.. స్థిరంగానూ కొనసాగవచ్చు. అందుకే పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తేవాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

No comments:

Post a Comment