Saturday, February 29, 2020

Andhra Pradesh Govt. increases Petrol and Diesel prices and VAT affect from 1st March

ఏపీలో వాహనదారులకు ప్రభుత్వం షాక్
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగనున్నాయి. వాహనదారులకు వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వం ఈ మేరకు షాక్ ఇచ్చింది. వ్యాట్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమననున్నాయి.  వాణిజ్యపన్నుల శాఖ వ్యాట్ పెంపు ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్ మీద వ్యాట్ 31 శాతం వడ్డనతో లీటర్‌కు రూ.2.76 వరకు ధర పెరగనుంది. డీజిల్ మీద వ్యాట్ 22.25 శాతం  కలుపుకుని లీటర్ ధర రూ.3.07కు పెరుగుతుంది. ప్రస్తుతం ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.07 ఉండగా డీజిల్ రూ.70.67 ధరగా ఉంది. కాగా దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీలో 71.94/64.65, కోల్ కతా 74.58/66.97, ముంబయి 77.60/67.75, చెన్నైలో 74.73/68.27 ధరలు అమలులో ఉన్నాయి.

Wednesday, February 26, 2020

Botsa Satyanarayana slams Chandrababu Over Trump Dinner issue

జగన్ దేశంలోనే గొప్ప సీఎం:బొత్స
దేశంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డే గొప్ప ప్రజానాయకుడని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. బహుశా అందుకే మంగళవారం ఢిల్లీలో ట్రంప్ విందు సమావేశానికి ఆయనను కేంద్రప్రభుత్వం ఆహ్వానించకపోయి ఉండొచ్చన్నారు. విశాఖలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతుల గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టర్, కర్ణాటక సీఎం యడ్యూరప్ప, అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులు చేసిన విమర్శల్ని బొత్స తిప్పికొట్టారు. తొలిసారి ముఖ్యమంత్రి అయినందునే జగన్ ను పిలవలేదనడం కూడా సరైనది కాదన్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ల్ని ఆహ్వానించని విషయాన్ని గమనించాలని కోరారు. జగన్‌పై కేసులున్నందుకే ఆహ్వానం అందలేదని టీడీపీ నేతలు వ్యంగ్యోక్తులు విసరడంపై బొత్స తనదైన శైలిలో దుమ్మెత్తిపోశారు. సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పైనా ఆయన విరుచుకుపడ్డారు. 

Tuesday, February 25, 2020

China bans trade consumption of wild animals due to coronavirus

వన్యప్రాణి మాంసంపై చైనా నిషేధాస్త్రం
కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) తీవ్రత దృష్ట్యా దేశంలో వన్యప్రాణి మాంస విక్రయాలు, వినియోగంపై  చైనా నిషేధాస్త్రం ప్రయోగించింది. మేరకు మ్యూనిస్టు చైనా పాలకులు సోమవారం కీలక నిర్ణయం ప్రటించారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు కాపాడ్డమే క్ష ర్తవ్యని పేర్కొన్నారు. దేశ అత్యున్నత నిర్ణాయక మండలి నేషనల్పీపుల్స్కాంగ్రెస్‌ (ఎన్పీసీ) మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు చైనా అధికారిక టీవీ చానల్పేర్కొంది. అధిక మోతాదులో వన్యప్రాణి మాంసభక్షణ సమస్యలకు దారితీస్తోందని చైనా ర్కార్ భావిస్తోంది. మరోవైపు కొవిడ్‌-19 కారణంగా చైనాలో మృతుల సంఖ్య 2,590 దాటింది. వైరస్నిర్ధారిత కేసుల సంఖ్య 77 వేల పైమాటేనని తెలుస్తోందిఇదిలావుండ‌గా వైరస్‌ కేంద్ర స్థానం హుబెయ్ ప్రావిన్స్ రాజధాని వూహాన్‌లో జన సంచారంపై ఆంక్షల్ని పరిమితంగా సడలించిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు కొవిడ్‌-19 బాధితులు 80 వేలకు చేరుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తాజాగా ప్రకటించింది. ప్రాణాంత రోనా ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో చీఫ్టెడ్రోస్అధానమ్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. వైరస్ ను అంచనా వేసేందుకు డబ్ల్యూహెచ్వో బృందాన్ని పంపగా వారిని హుబెయ్ ప్రావిన్స్, వూహాన్ ప్రాంతాల్లోకి వెళ్లనివ్వబోమని చైనా స్పష్టం చేసింది. తాజాగా  చైనా అనుమతి భించడంతో మందులు, వైద్య పరికరాలతో కూడిన భారత విమానం బుధవారం దేశానికి బయల్దేరనుంది.

Monday, February 24, 2020

US President Mr and Mrs Trump,PM Modi’s mega roadshow in Ahmedabad

ట్రంప్ మోః

  • మెరికా అధ్యక్షుడి భారత్ ర్య షురూ


అమెరికా ప్ర పౌరులు డోనాల్డ్, మెలానియా ట్రంప్ దంపతులు భారత్ విచ్చేశారు. స్థానిక‌ కాలమానం ప్రకారం సోమవారం ధ్యాహ్నం 12.30కు అహ్మదాబాద్ (గుజరాత్) చేరుకున్నారు. వీరితో పాటు ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ కూడా రెండ్రోజుల భారత్ ర్యలో పాల్గొంటున్నారు. ఆమె భారత్ కు విచ్చేయడం ఇది రెండోసారి. 2017 వంబర్ లో ఇవాంక భారత్ కు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్ట్ నుంచి ట్రంప్ దంపతులు నేరుగా ర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్క వీరికి ప్రధానమంత్రి రేంద్ర మోదీ సాద స్వాగతం లికారు. హాత్మాగాంధీ ఆశ్రమంలో అనుభూతుల్ని ట్రంప్ దంపతులు సందేశ పుస్తకంలో రాశారు. సందర్భంగా మోదీ వారికి గాంధీజీ సిద్ధాంతాలు అహింసా, త్యమేవతే గురించి తెలిపారు. బాపూజీ ప్రచిత మూడు కోతుల నీతిని వివరించారు. `చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు` అనే నీతిని వివరిస్తూ అక్క మూడు కోతుల బొమ్మను ట్రంప్ దంపతులకు మోడీ చూపించారు. అద్భుతమైన అతిథ్యమిచ్చిన ప్రియమిత్రుడు మోదీకి న్యవాదాలు అని ట్రంప్ పేర్కొన్నారు. అనంతరం `స్తే ట్రంప్` కార్యక్రమానికి హాజయ్యేందుకు ట్రంప్ దంపతులతో లిసి మోదీ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం మోతెరా (ర్దార్ టేల్)కు  చేరుకున్నారు. భారత్ - అమెరికా మైత్రి టిష్ట కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాజకీయ‌, సినీ, క్రీడా ప్రముఖులు హాజయ్యారు.

Saturday, February 22, 2020

Yediyurappa Govt. in Karnataka follows AP CM YSJagan`s decentralization idea

జగన్ ను అనుసరిస్తున్న యెడ్డీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని కర్ణాటక సీఎం యడ్యూరప్ప అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా బెంగళూర్ నుంచి కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్ని కర్ణాటక బీజేపీ సర్కార్ తరలించాలని నిర్ణయించింది. అయితే యడ్యూరప్ప ఏపీలో మూడు రాజధానుల అంశంపై మాత్రం పెదవి విరిచినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. కేంద్రంలో, రాష్ట్రంలోని బీజేపీకి చెందిన వివిధ స్థాయుల్లోని నాయకులు ఇప్పటికే అనేక సందర్భాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే తమ పార్టీ ఆలోచనగా పేర్కొన్నారు. అంతే తప్పా రాజధాని వికేంద్రీకరణ (ఒకటికి మించిన రాజధానుల ఏర్పాటు)ను తమ పార్టీ కోరుకోవడంలేదని స్పష్టం చేశారు. తాజాగా కర్ణాటకలో ప్రభుత్వ కార్యాలయాల తరలింపుకు బీజేపీ అధిష్ఠానం అంగీకారం తెలిపింది. ఇప్పటికే రాజధాని బెంగళూరు ట్రాఫిక్ సమస్యతో సతమతమౌతోంది. ఈ దృష్ట్యా ముఖ్య కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు యడ్యూరప్ప సర్కారు సిద్ధమైంది. అదే సమయంలో ఉత్తర కర్ణాటక ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలని యోచించింది. కొన్ని కార్యాలయాలను మరో ప్రాంతానికి తరలించాలని నిర్ణయించినట్లు మంత్రి ఈశ్వరప్ప ప్రకటించారు. కృష్ణ భాగ్య జలనిగం, కర్ణాటక నీరావరి నిగమ్, పవర్ లూమ్ కార్పొరేషన్, షుగర్ డైరెక్టరేట్, చెరకు డెవలప్‌మెంట్ కమిషనర్, కర్ణాటక హ్యూమన్ రైట్స్ కమిషన్, ఉప లోకాయుక్త తదితర మొత్తం 9 కార్యాలయాల్ని తరలించాలని తలపోస్తున్నారు. ఉత్తర కర్ణాటకలోని బెళగావికి ఈ కార్యాలయాలు తరలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సరిహద్దుల్లో జాతీయరహదారి నం.4 సమీపంలో గల బెళగావిలో `సువర్ణ విధాన సౌధ`ను కర్ణాటక ప్రభుత్వం 2012లోనే నిర్మించింది. బెంగళూరుతో పాటు ఇక్కడ కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటారు. కర్ణాటక అప్రకటిత రెండో రాజధానిగా ఉన్న బెళగావికి ముఖ్య కార్యాలయాలు తరలితే ఈ ప్రాంత అభివృద్ధి మరింత వేగం పుంజుకోగలదని యడ్యూరప్ప సర్కారు భావిస్తోంది.

Thursday, February 20, 2020

Germany shooting: at least eight dead in Hanau attack

జర్మనీ రక్తసిక్తం: ఉన్మాదుల కాల్పుల్లో 11 మంది బలి
ఉన్మాదుల కాల్పులతో జర్మనీ రక్తమోడింది. బుధవారం రాత్రి హనాన్ లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో మొత్తం 11 మంది ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఆ ఇద్దరు దుండగులు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. జర్మనీలో ఇటీవల పలు ఉగ్రదాడులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బెర్లిన్ లో 2016 డిసెంబరులోనూ ఉగ్రవాదులు బాంబు పేలుళ్లతో 12 మందిని పొట్టనుబెట్టుకున్నారు. తాజా దాడికి పాల్పడింది ఎవరనేది తెలియాల్సి ఉంది. సమాచారం అందగానే హనాన్ పోలీసులు కాల్పులు జరిగిన రెండు ప్రాంతాలకు హుటాహుటిన చేరుకున్నారు. ఆ ప్రాంతాల్ని ఆధీనంలోకి తీసుకున్నారు. దుండగుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. నగరంలోని మిడ్‌నైట్ బార్‌లో తొలుత గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు వార్తలందుతున్నాయి. ఆ కాల్పుల్లో నలుగురు నెలకొరిగారు. కొద్దిసేపు అక్కడ విధ్వంసం సృష్టించిన తర్వాత ఎరేనా బార్ లోకి జొరబడి తూటాల వర్షం కురిపించగా మరో అయిదుగురు ప్రాణాలు విడిచారు. ఆ ప్రాంతంలోనే మరో రెండు మృతదేహాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బహుశా ఆ ఇద్దరే కాల్పులకు పాల్పడిన దుండగులు కావొచ్చని తెలుస్తోంది.

Tuesday, February 18, 2020

Another Usain Bolt in kambala Nishanth Shetty the record of Srinivas Gowda

ఉసేన్ బోల్ట్ ను తలదన్నే కంబళ వీరులు..
వారం వ్యవధిలోనే ప్రపంచ ప్రఖ్యాత, ఒలింపిక్స్ పతకాల విజేత జమైకాకు చెందిన ఉసేన్ బోల్ట్ రికార్డు రెండుసార్లు బద్ధలయింది. అయితే స్ప్రింట్ ఈవెంట్ లో కాదు.. కర్ణాటకలో ఏటా జరిగే సంప్రదాయ కంబళ క్రీడల్లో గత వారం బోల్ట్ ను తలదన్నెలా తన ఎడ్లతో శ్రీనివాస్ గౌడ్ మెరుపు వేగంతో పరిగెత్తగా మంగళవారం అతని రికార్డును నిషాంత్ శెట్టి బద్ధలు కొట్టాడు. ఈ ఇద్దరికి స్ప్రింట్ ఈవెంట్లలో తగిన తర్ఫీదు ఇప్పిస్తే ఒలింపిక్స్ పరుగులో పతకాల పంట ఖాయమని సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు ఎలుగెత్తి చాటుతున్నారు. దక్షిణ కన్నడ, ఉడుపి, తుళునాడు తీర ప్రాంతంలో ప్రతి ఏడాది ఈ కంబళ పోటీలు నిర్వహిస్తారు. గౌడ కులస్థులు ఈ పోటీల్లో ఎక్కువగా పాల్గొంటుంటారు. కంబళ ఆటలో పోటీదారుడు (బఫెల్లో జాకీ) బురద నీటిలో తన రెండు దున్నపోతులు లేదా ఎడ్లతో పరిగెడతాడు. ఎవరైతే వీటిని వేగంగా పరుగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారే విజేతలు. కర్ణాటకలో వ్యవసాయదారులే ఎక్కువగా ఈ పోటీలో పాల్గొనడం రివాజు. బురద నెలలో ఎడ్లతో రివ్వున లక్ష్యం దిశగా దూసుకుపోవడం పోటీదారులతో పాటు ప్రేక్షకులకు థ్రిల్ కల్గిస్తుంది. శ్రీనివాస గౌడ 142.5 మీటర్ల దూరాన్ని 13.62 సెకన్లలో పూర్తి చేశాడు. అంటే 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలోనే చేరుకున్నాడు. ఇది జమైకా పరుగుల యంత్రం బోల్ట్‌ రికార్డు కన్నా 0.03 సెకన్లు తక్కువ. తాజాగా నిశాంత్ శెట్టి ఈ రికార్డును బద్ధలు కొట్టాడు. బోల్ట్ కంటే 0.07 సెకన్లు, శ్రీనివాస్ గౌడ్ కంటే 0.04 సెకన్ల ముందే పరుగును పూర్తి చేశాడు. నిషాంత్ 143 మీటర్ల దూరాన్ని కేవలం 13.68 సెకన్లలో పరిగెత్తి చరిత్ర సృష్టించాడు. అంటే 100 మీటర్ల పరుగును 9.51 సెకన్లలోనే పూర్తి చేసినట్లు లెక్క.

Tuesday, February 11, 2020

Doctor attempts to commit suicide at Gandhi Hospital in Hyderabad

గాంధీ ఆసుపత్రిలో హైడ్రామా: డాక్టర్ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఓ వైద్యుడు ఆత్మహత్యకు యత్నించడంతో హైరానా నెలకొంది. మంగళవారం  డాక్టర్ వసంత్ కుమార్ (ఎంబీబీఎస్) తన చొక్కాలో పెట్రోల్ సీసాలను పెట్టుకుని లైటర్ తో నిప్పంటించుకుంటానంటూ బెదిరింపులకు దిగారు. ఈ ఉదయం గంటన్నరపాటు నడిచిన ఈ హైడ్రామాకు పోలీసులు చాకచక్యంగా తెరదించారు. చెట్టు కింద నిలబడి వసంత్ తన ఆవేదనను వ్యక్తం చేస్తుండగా పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గర్భిణిగా ఉన్న ఆయన భార్య కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. అదును చూసుకుని ఒక్కసారిగా పోలీసులు వసంత్ ను ఒడిసి పట్టుకుని ఆయన చేతిలో ఉన్న లైటర్ ను లాగేసుకున్నారు. వ్యాన్ లోకి ఆయనను బలవంతంగా ఎక్కించారు. వసంత్ షర్టును విప్పేసి అందులో దాచుకున్న పెట్రోల్ సీసాల్ని తీసి దూరంగా విసిరేశారు. అనంతరం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. `గాంధీ`లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సోషల్ మీడియాలో వసంత్ తదితరులు వదంతులు రేపారని ప్రభుత్వం ఆయనతో పాటు మరో ముగ్గురు వైద్యుల్ని విధులు నుంచి సస్పెండ్ చేసింది. మూడ్రోజులుగా వసంత్ తన పై అధికారులపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రవణ్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి(డీఎంఈ) అవకతవకలకు పాల్పడుతున్నారంటూ వసంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే డీఎంఈ మీడియాతో మాట్లాడుతూ వసంత్ పైనే గత కొంతకాలంగా అవినీతి, బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలు ఉన్నాయన్నారు. వాస్తవానికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నందునే గాంధీ ఆసుపత్రి నేడు ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందుతోందన్నారు. ఒకవేళ ఆసుపత్రిలో సౌకర్యాల లేమి, అవకతవకలుంటే ఆయన ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని డీఎంఈ ఎదురు ప్రశ్న వేశారు. ఒక డాక్టర్ అయి ఉండి కరోనా వంటి సంక్షోభ సమయంలో ఆసుపత్రి ఆవరణలోనే బరితెగింపు ధోరణి కనబర్చడమేంటని నిలదీశారు. శాఖాపరంగా డాక్టర్ వసంత్ పై చర్యలు తీసుకోక తప్పదని చెప్పారు. 

Monday, February 10, 2020

Jaanu Movie Team Visits Tirumala Temple

తిరుమలకు టాలీవుడ్ టూరు: నయా ట్రెండ్ షురూ
తెలుగు చిత్ర పరిశ్రమ కొత్త ఒరవడి కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో తిరుమల శ్రీవారి దర్శనం సెంటిమెంట్ నయా ట్రెండ్. టాలీవుడ్ నమ్మకాలకు పెట్టింది పేరు. సినిమా ప్రారంభానికి కొబ్బరికాయ కొట్టే దగ్గర నుంచి ముహూర్తాలు, సెంటిమెంట్లతో యావత్ చిత్ర నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం తమ సినిమాలు విడుదలై విజయం సాధించాక తిరుమల శ్రీవారి దర్శనానికి సినీ యూనిట్లు క్యూ కడుతున్నాయి. తాజాగా `జాను` చిత్ర యూనిట్ కూడా స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చింది. శనివారం ఆ చిత్ర దర్శకులు, సినీ తారలు, నిర్మాతలు తిరుమలలో సందడి చేశారు. దిల్ రాజు, కిశోర్, సమంత, శర్వానంద్ వేంకటేశుని సన్నిధిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది మహేశ్ బాబు, అల్లు అర్జున్ చిత్రాలు `సరిలేరునీకెవ్వరు`..`అల వైకుంఠాపురం` బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. సంక్రాంతి పండుగ సమయంలో ఈ చిత్రాలు విడుదలై విజయవంతంగా బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని తొలుత మహేశ్ బాబు అండ్ యూనిట్ ఆ తర్వాత బన్నీ కుటుంబం సహా ఆ సినిమా టీమ్ స్వామి వారి దర్శనం చేసుకుని తరించారు. మహేశ్ బాబు సకుటుంబ సమేతంగా.. బాబాయి ఆదిశేషగిరిరావు, నమత్రా, గౌతమ్, సితారలతో కలిసి స్వామి దర్శనం చేసుకున్నారు. ఆయన వెంట అత్యంత సన్నిహితుడు యువదర్శకుడు వంశీ పైడిపల్లి కూడా తన కుటుంబంతో దర్శనానికి వచ్చారు. మూవీ డైరెక్టర్ అనిల్ రావివూడి, లేడీ అమితాబ్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్ తదితరులు స్వామి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే బన్నీ, త్రివిక్రమ్ టీమ్ తిరుమలలో శ్రీవారి సన్నిధికి విచ్చేశారు. ఈ నెలలోనే `జాను` విడుదలై తెలుగు ప్రేక్షకుల్ని ఫీల్ గుడ్ మూవీగా అలరిస్తోంది. దాంతో సెంటిమెంట్ గా ఈ చిత్ర యూనిట్ కూడా స్వామి వారి  మొక్కులు తీర్చుకుంది. గతంలోనూ బాలీవుడ్ టు టాలీవుడ్ దర్శక, నిర్మాతలు, తారాగణం తిరుమల వెంకన్న దర్శనాలు చేసుకోవడం రివాజుగా వస్తున్నదే. అయితే ఇలా సినిమా యూనిట్లకు యూనిట్లే శ్రీవారి చెంతకు చేరుతుండడం తాజా విశేషం.

Saturday, February 8, 2020

AP CM YS Jagan Inaugurates First Disha Police Station In Rajahmundry

రాజమండ్రిలో తొలి `దిశ` పోలీస్ స్టేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి `దిశ పోలీస్ స్టేషన్` రాజమండ్రిలో ఏర్పాటయింది. శనివారం ఉదయం 11 గంటలకు ఈ పీఎస్ ను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మహిళల తోనే  రిబ్బన్ కట్ చేయించి ప్రారంభించారు. మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దిశచట్టంలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 13 ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఒక్కో దిశ పోలీస్ స్టేషన్‌లో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది సిబ్బంది ఉంటారు. ఇందులో అధిక సంఖ్యలో మహిళలే ఉంటారని సీఎం చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శిమన్ శర్మ కూడా మహిళే కాబట్టి మరో అడుగు ముందుకేసి ఏకంగా 47 మంది మహిళా సిబ్బందిని ఈ పోలీస్ స్టేషన్ లో నియమించారని ప్రశంసించారు. దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడానికి, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఏఎస్‌ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్‌ అధికారి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది. త్వరితగతిన శిక్షలు పడితేనే వ్యవస్థలో భయం వచ్చి నేరాలు తగ్గుతాయని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 రోజుల్లో విచారణనూ పూర్తి చేసి మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడిన వారికి ఉరి శిక్షలు విధిస్తామని చెప్పారు. మహిళలు, చిన్నారులను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటారు. తొలిసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి అదే తప్పు చేస్తే నాల్గేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఈసందర్భంగా `దిశ` యాప్‌ను సీఎం ఆరంభించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖమంత్రి సుచరిత, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎంపీ వంగాగీతా, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.

Friday, February 7, 2020

Telangana CM KCR Inaugurate JBS-MGBS Metro carridor

జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్ కు జెండా ఊపిన కేసీఆర్
హైదరాబాద్ మణిహారంగా అలరారుతున్న మెట్రో రైల్ ప్రాజెక్టు (హెచ్.ఎం.ఆర్.ఎల్) లో భాగమైన జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రారంభించారు. జేబీఎస్ స్టేషన్ లో ఈ సాయంత్రం 4గంటలకు మెట్రో రైలు సర్వీసుకు సీఎం పచ్చ జెండా ఊపారు. 11 కిలోమీటర్ల ఈ రూట్లో ప్రయాణికులు కేవలం 16 నిమిషాల్లోనే గమ్య స్థానం చేరుకుంటారు. ఈ కారిడార్లో జేబీఎస్ (పరేడ్ గ్రౌండ్స్), సికింద్రాబాద్ వెస్ట్, న్యూగాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ స్టేషన్లు ఉన్నాయి. రోజూ సుమారు లక్ష మంది ప్రయాణిస్తారని అంచనా. ఈ కారిడార్ తో కలుపుకొని హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో రైలు మార్గం 69 కిలోమీటర్ల కు చేరుకుంది. ఇప్పటికే అమలులో ఉన్న ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం కారిడార్లతో పాటు తాజాగా జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్ నగరవాసులకు అందుబాటులోకి వచ్చినట్లయింది. మొత్తంగా ఈ మూడు కారిడార్లలో 16 లక్షల మంది నిత్యం ప్రయాణిస్తారని హైదరాబాద్ మెట్రో వర్గాలు ఆశిస్తున్నాయి. కోల్ కతా దేశంలో మొట్టమొదట మెట్రో రైలు వ్యవస్థను కల్గిన నగరం. ఆ తర్వాత ఢిల్లీ మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. అయితే దేశంలో ఢిల్లీ (డీఎంఆర్సీ) ఎక్కువ దూరం విస్తరించిన మెట్రోగా రికార్డు నెలకొల్పింది.  2002లో కేవలం ఆరుస్టేషన్లతో షహదర-తీస్ హజారీ (8.5 కిలోమీటర్లు) మార్గం తొలుత అందుబాటులోకి వచ్చింది. 17 ఏళ్లలో మొత్తం 11 లైన్లతో 391 కిలోమీటర్ల మేర ఢిల్లీ మెట్రో విస్తరించింది. నగరంలో గల 285 స్టేషన్లలో రోజూ సుమారు 35 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. కోలకతా మెట్రో రైలు సర్వీసు (కె.ఎం.ఆర్.సి) 1984లోనే ప్రారంభమయింది. ప్రస్తుతం 24 స్టేషన్లతో నౌపరా-కవి సుభాష్ (27.22 కిలోమీటర్ల) మార్గమే అందుబాటులో ఉండగా మరో నాలుగు లైన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం 7.5 లక్షల మంది ఇక్కడ మెట్రో రైలు సేవల్ని పొందుతున్నారు.