Tuesday, December 22, 2020

Senior IAS Officer Adityanath Das become Andhra Pradesh New Chief Secretary

ఏపీ కొత్త సీఎస్ ఆదిత్యనాథ్ దాస్

ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రధానకార్యదర్శి (సీఎస్‌)గా ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారిణి తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి బదిలీ అయివచ్చిన శ్రీలక్ష్మికి కీలక బాధ్యతలు అప్పగించారు. పురపాలక శాఖ కార్యదర్శిగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కె. సునీతను  ప్రభుత్వం నియమించింది. సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ ఈనెల 31న బాధ్యతలు స్వీకరించనున్నారు. పదవీ విరమిణ పొందనున్న ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని ముఖ్యమంత్రి ప్రిన్సిపిల్ అడ్వైజర్‌గా విధులు నిర్వర్తించనున్నారు. తాజా సీఎస్ రేసులోకి పలువురు వచ్చినా వారంతా సెంట్రల్ సర్వీసులో ఉండడంతో 1987 బిహార్‌ బ్యాచ్‌కు చెందిన ఆదిత్యనాథ్‌ దాస్‌ వైపే సీఎం జగన్‌ మొగ్గు చూపారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.