Friday, May 10, 2019

amazon in talks with workers in Poland as another strike looms

   ఉద్యోగులతో నేరుగా చర్చలకు సిద్ధమైన అమెజాన్



 
జీతాల పెంపును కోరుతూ సమ్మెకు సిద్ధమవుతున్న అమెజాన్ పొలాండ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఉద్యోగులతో సంస్థ యాజమాన్యం శుక్రవారం (మే10) చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఈ ఏడాది స్పెయిన్, జర్మనీ కేంద్రాల్లోనూ ఉద్యోగులు అధిక జీతాలు, మంచి పని పరిస్థితులు కల్పించాలని కోరుతూ సమ్మె బాట పట్టారు. పోలాండ్ లో ప్రస్తుతం ఉద్యోగుల కోరికల్ని సంస్థ పరిగణనలోకి తీసుకుందని సత్వరం వాటిని నెరవేర్చే దిశగా వారితో నేరుగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెజాన్ అధికార ప్రతినిధి ప్రతికలకు తెలిపారు. పోలాండ్ కేంద్రంలో తమ వ్యాపార కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయన్నారు. అయితే గురువారం ఉద్యోగ సంఘాలు తమకు గంటకు చెల్లించే రూ.320-360 (17.5 19.5 జ్లోటీలు) మొత్తాన్ని రెట్టింపు చేయాలని ఆందోళనకు దిగాయి. అమెజాన్ సంస్థ తమ డిమాండ్లను ఇంతవరకు పట్టించుకోలేదని ఉద్యోగ సంఘం మారియా మలినొవ్ స్కా పేర్కొంది. పోలాండో లో అమెజాన్ లో ప్రస్తుతం 14000 మంది పనిచేస్తుండగా మారియా మలినొవ్ స్కా సంఘంలో వెయ్యి మంది సభ్యులున్నారు. ఏప్రిల్ లో సంస్థ ఇక్కడ ముగ్గురు ఉద్యోగుల్ని తొలగించింది. వారు బహిరంగంగానే యెల్లో జాకెట్ (ఇంధనం పన్ను పెంపుపై నిరసన) ఉద్యమానికి మద్దతు తెల్పుతూ సంస్థ నియమ నిబంధనలు, విలువలకు తిలోదకాలిచ్చారని యాజమాన్యం వారిని విధుల నుంచి తప్పించింది. దాంతో యెల్లో జాకెట్ ఉద్యమకారులు ఆ ఉద్యోగులకు సంఘీభావం తెల్పుతూ ఫేస్ బుక్ మెసేజ్ ల ద్వారా ఆందోళనకు తెరతీశారు. అమెజాన్ కేంద్రాల ముట్టడికి యత్నించారు. తాజాగా అమెజాన్ పోలాండ్ కేంద్రం సంస్థ ఉద్యోగ సంఘాల నుంచి నిరసనల్ని ఎదుర్కొంటోంది.