Monday, April 15, 2019

cricket world cup 2019 team india the men in blue


వరల్డ్ కప్ భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ సెలెక్టర్లు
క్రికెట్ మక్కా ఇంగ్లండ్‌లో మే30 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ్ కప్‌కు భారత జట్టును సెలక్షన్ కమిటీ సోమవారం (ఏప్రిల్15) ప్రకటించింది. ముంబయిలో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని ఎంపిక సంఘం సమావేశమైంది. ఈ సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ హాజరయ్యారు. చర్చల అనంతరం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. టీమిండియా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ, వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నారు. దినేశ్ కార్తీక్‌కు రిజర్వ్ వికెట్ కీపర్‌గా స్థానం లభించింది. యువ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్‌(21)కు స్థానం దక్కలేదు. మ్యాచ్‌లో ధోనీ ఆడని పక్షంలో ఆ స్థానాన్ని దినేశ్ కార్తీక్ చక్కగా భర్తీ చేయగలడని అతనిపై సెలెక్టర్లు భరోసా ఉంచారు. సీనియర్టీతో పాటు లక్ష్య చేధన సమయంలో కూల్ గా బ్యాటింగ్ చేయడంలో దినేశ్ కార్తీక్ దిట్టని అతణ్ని ఎంపిక చేశారు. మిగిలిన సీనియర్ ఆటగాళ్లు సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవిచంద్రన్ అశ్విన్‌, ఉమేశ్ యాదవ్‌ల ఎంపికను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. అయిదుగురు స్పెషలిస్టు బ్యాట్స్ మెన్, ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు, ఇద్దరు వికెట్ కీపింగ్ స్పెషలిస్టులు, ఇద్దరు ఆల్ రౌండర్ల కూర్పుగా జట్టును ప్రకటించారు. ఇందులో మూడు విభాగాల నుంచి ఎంపికలో విజయ్ శంకర్ నిలవడం విశేషం. స్పెషలిస్ట్ కీపింగ్ బ్యాట్స్ మెన్ గా ధోని, దినేశ్ లు, ఆల్ రౌండర్లుగా జడేజా, హార్దిక్, మీడియం పేసర్లుగా షమీ,భువనేశ్వర్, బుమ్రాలు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా ధావన్, రోహిత్, రాహుల్, కోహ్లీ, విజయ్ శంకర్ జట్టుకు ఎంపికయ్యారు.
భారత జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్ ), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోనీ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్,
విజయ్ శంకర్, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్,
జస్ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ.

huge fire in ntr electronic shopping complex at vijayawada due to electric short circuit


ఎన్టీయార్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం
విజయవాడలోని అతి పెద్ద ఎలక్ట్రానిక్ షాపింగ్ ప్రాంగణం ఎన్టీయార్ కాంప్లెక్స్ లో సోమవారం (ఏప్రిల్15) భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఉదయం షాప్ నెం.72లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగి షాప్ పూర్తిగా దగ్ధమయింది. అన్నీ ఎలక్ట్రానిక్ వస్తువులు, వైర్లు కావడంతో వస్తువులు మొత్తం భస్మీపటలం అయ్యాయి. గోడౌన్ కూడా షాపునకు ఆనుకునే ఉండడంతో మంటలు త్వరగా వ్యాపించినట్లు సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.10లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.  ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వ్యాపారులు బయటికి పరుగులు తీశారు. ఈ కాంప్లెక్స్ లో 150కి పైగా ఎలక్ట్రానిక్ షాపులున్నాయి. పెద్ద సంఖ్యలో గోడౌన్లు కూడా ఇదే కాంప్లెక్స్ లో ఉన్నాయి. అగ్నిమాపక శకటాలతో సిబ్బంది సకాలంలో చేరుకోని మంటల్ని అదుపుచేశారు. లేదేంటే మంటలు కాంప్లెక్స్ లోని మిగిలిన షాప్ లకు వ్యాపించి ఉంటే నష్టం అంచనాలకు అందందని స్థానికులు వ్యాఖ్యానించారు.


yes i had a quarrel with power star pawan kalyan comedy king ali


అవును..పవన్ తో గొడవయిందన్న అలీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో గొడవ అయిన మాట నిజమేనని హాస్యనటుడు అలీ అంగీకరించాడు. ఇటీవల ‘ఆలీతో సరదాగా’ అనే టీవీ షోకు వచ్చిన పవన్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ నవ్వుతూ ఎదురుప్రశ్న వేశారు. సరదాగా అడుగుతున్నట్లున్నా నిజానికి నేను ఓ సీరియస్ ప్రశ్న వేస్తున్నానంటూ ఆమె అలీతో `మీకు కల్యాణ్ గారికి చాలా పెద్ద గొడవైందని విన్నాను. నిజమేనా?` అని సూటిగా అడిగారు. వెంటనే అలీ కూడా తడుముకోకుండా అవును..నిజమేనంటూ ఠకీమని సమాధానమిచ్చాడు. బాల నటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అలీ నాలుగు దశాబ్దాలుగా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. పవన్ కల్యాణ్ సినిమాల్లోకి వచ్చాక ఆయనతోను కలిసి నటిస్తూ సన్నిహితమయ్యాడు. ఆ తర్వాత చాలా ఏళ్లుగా వీరిద్దరూ మంచి మిత్రులుగా ఉన్నారు. రాజకీయాల్లోకి రావాలని చాలా ఏళ్లగా అలీ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు పవన్ కల్యాణ్‌తో ఏపీ సీఎం చంద్రబాబుతోనూ భేటీ అయిన సంగతి తెలిసిందే. అలీ అలా వైఎస్ఆర్ సీపీలో చేరగానే `అసలు ఎవరినీ నమ్మాలో నమ్మకూడదో తెలియడం లేదు` అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అలీ లాంటి వ్యక్తిని తాను ఇంతవరకూ చూడలేదని, సాయం పొంది మోసం చేశాడని పవన్ తీవ్రంగా ఆరోపించారు. అలీ కూడా ఆ ఆరోపణల్ని గట్టిగానే తిప్పికొట్టారు. పవన్ తనకు ఆర్థికంగా ఏదైనా సాయం చేశారా? అంటూ ఎదురు ప్రశ్నించారు.


sc directs ec to watch pm modi biopic full movie submit decision in sealed cover


మోదీ బయోపిక్ సినిమా చూసి సీల్డ్ కవర్లో నివేదికివ్వండి
·    ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం
ప్రధాని మోదీపై నిర్మించిన బయోపిక్ సినిమాను పూర్తిగా చూశాక నివేదికను తమకు సీల్డ్ కవర్ లో పంపాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ఈసీ) సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. మోదీ బయోపిక్ సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు ప్రదర్శించరాదని ఈసీ నిషేధించిన సంగతి తెలిసిందే. ఈసీ నిర్ణయంపై స్టే విధించాలని ఆ సినిమా నిర్మాతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను సోమవారం(ఏప్రిల్15) ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించి ఈ మేరకు తీర్పిచ్చింది. కేవలం సినిమా ప్రోమోలను చూసి ఈసీ నిషేధం నిర్ణయాన్ని అమలు చేయడం తగదని నిర్మాతల తరఫున న్యాయవాది ముకుల్ రోహ్టగి వాదించారు. శుక్రవారం (ఏప్రిల్19) లోపుగా నివేదికను తమకు అందజేయాలని కోరింది. ఈనెల 22 న (సోమవారం) మోదీ బయోపిక్ పై తుది తీర్పు వెలువడనుంది.