Thursday, October 22, 2020

Vijayawada 6th day of Navratri festival goddess Durga worshiped as Lalitha Tripura Sundari Devi

లలితా త్రిపురసుందరిదేవిగా అనుగ్రహిస్తోన్న కనకదుర్గమ్మ

విజయవాడలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శ్రీ లలితాత్రిపురసుందరిదేవిగా భక్తుల్ని అనుగ్రహిస్తోంది. ఆరో రోజు గురువారం తెల్లవారుజాము 5 నుంచే పెద్ద సంఖ్యలో భక్తులకు అమ్మలగన్నమ్మ దర్శనం లభిస్తోంది. శ్రీచక్ర అధిష్ఠానశక్తిగా, పంచదాశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసిన అమ్మవారిని తిలకించి భక్తులు, ఉపాసకులు తరిస్తున్నారు. బుధవారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మూలా నక్షత్రం రోజున కనకదుర్గమ్మను సీఎం సంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి దర్శించుకున్నారు. ఆయనకు అమ్మవారి ఫొటోను  దేవస్థానం ట్రస్ట్ బహుకరించింది. అదేవిధంగా సీఎం అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దుర్గగుడి 2021 క్యాలెండర్‌ను జగన్ ఆవిష్కరించారు.