Monday, October 26, 2020

Kanyaka Parameswari Mata decoration with worth above Rs.1 crore currency notes

రూ.కోటి కాంతుల కన్యకాపరమేశ్వరీ

తెలంగాణ గద్వాల్ లోని ప్రసిద్ధ శ్రీ కన్యకాపరమేశ్వరీ ఆలయం సోమవారం కరెన్సీ నోట్లతో దగదగలాడింది. ఈరోజు అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చింది. కన్యకాపరమేశ్వరీ మాతను రూ.1,11,11,111 విలువైన కరెన్సీతో అలంకరించారు. రంగురంగుల కరెన్సీ నోట్లను పుష్పాల మాదిరిగా మలచి అమ్మవారికి అలంకరించారు. చాలా కాలం లాక్ డౌన్ కారణంగా మూసివున్న ఆలయం దసరా పర్వదినం వల్ల తెరుచుకోవడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రంగురంగుల దీపపు కాంతులతో ఆలయం దేదీప్యమానంగా వెలుగుతోంది. ఈ ఆలయం హైదరాబాద్ కు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతేడాది దసరాతో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య కూడా తగ్గింది. అదేవిధంగా గత దసరాలో అమ్మవారిని రూ.3 కోట్ల 33 లక్షల 33 వేల 33 నోట్లతో అలంకరించినట్లు ఆలయ కోశాధికారి పి.రాము తెలిపారు.