Monday, November 9, 2020

Trailblazers lifted JioT-20 womens Trophy for the first time

ట్రయల్ బ్లేజర్స్ దే టీ20 కప్

స్మృతి మంధాన విజృంభణతో ట్రయల్ బ్లేజర్స్ తొలిసారి మహిళల టీ20 కప్ ను సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన  జియో 2020 టీ20 చాలెంజర్ కప్ ఫైనల్స్ లో  సూపర్ నోవాస్ పై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్మృతి బ్యాటర్ గానే కాక కెప్టెన్ గానూ రాణించి మ్యాచ్ ను తన జట్టుకు తొలిసారి ట్రోఫీని సాధించిపెట్టింది. గతంలో ఈ ట్రోఫీని సూపర్ నోవాస్ రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్ పై కన్నేసినా ట్రయల్ బ్లేజర్స్ అన్నిరంగాల్లో రాణించి కైవసం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 119 పరుగులు చేసింది. స్మృతి 49 బంతుల్లో 3 సిక్సర్లు 5 ఫోర్లతో 68 పరుగులు స్కోరు చేసింది. ప్రత్యర్థి జట్టులో రాధా యాదవ్ 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 5 వికెట్లు ఖాతాలో వేసుకుంది. టీ20 మహిళా టోర్నీల్లో ఓ మ్యాచ్ లో 5 వికెట్లు సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డు సృష్టించింది. అనంతరం 120 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సూపర్ నోవాస్ 7 వికెట్లు కోల్సోయి 102 పరుగులే చేయగల్గింది. సల్మా కాతున్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా పొదుపుగా పరుగులిచ్చి దీప్తి శర్మ 2 వికెట్లు తీసింది. ఈ ఫైనల్స్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన స్మృతి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు మొత్తం మూడు అవార్డుల్ని సాధించడం విశేషం.