Wednesday, June 5, 2019

Gujarat: Five killed as car jumps divider and hits tempo



గుజరాత్ లో కారు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రంజాన్ పర్వదినం రోజున బుధవారం (జూన్5) ఉదయం కారు ఎదురుగా వస్తున్న టెంపోను ఢీకొన్న ప్రమాదంలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన నవసరి జిల్లాలోని ఖరెల్ ప్రాంతంలో సంభవించింది. కారు సూరత్ కు ప్రయాణిస్తోంది. జాతీయ రహదారిపై అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు తొలుత రోడ్డు డివైడర్ ను ఢీకొట్టి పక్క లైన్ లోకి ఎగిరిపడి దూసుకుపోయింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న టెంపోను కారు బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ మితిమీరిన వేగంతో కారు నడుపుతుండడం వల్లే దానిపై నియంత్రణ కోల్పోయినట్లు గాన్దేవి పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 20 ఏళ్ల లోపు వారేనని తెలుస్తోంది. కారు మొత్తం నుజ్జునుజ్జయిపోవడంతో అందులో నుంచి మృతదేహాల్ని చాలా సమయం శ్రమించి బయటకు తీయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. గాన్దేవి ఆసుపత్రి మార్చురికి మృతదేహాల్ని తరలించారు.