Friday, December 25, 2020

Vaikuntha Ekadashi Dwara Darshanam started Tirumala

వైకుంఠాన్ని తలపిస్తున్న

తిరుమల

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఉదయం అభిషేకం అనంతరం ఆలయ ఆర్చకులు వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఉదయం నాలుగు గంటలకు దర్శనం ప్రారంభం కాగా.. సామాన్య భక్తులు, వీఐపీలు దర్శనాల కోసం క్యూకట్టారు. శుక్రవారం కావడంతో అభిషేకం అనంతరం దర్శనాలు మొదలయ్యాయి. దాంతో తిరుమల క్షేత్రం వైకుంఠాన్ని తలపిస్తోంది. కాగా వైకుంఠ ఏకాదశి పర్వ దినాన పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంకా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో నగరి ఎమ్మెల్యే, ఏపీ ఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా తదితరులు ఉన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వారంలో నడవటం స్వర్గంలో నడిచినట్లుందన్నారు. 2021లో అందరి కష్టాలు తీరి శుభం కలగాలని కోరుకున్నాని తెలిపారు.

Wednesday, December 23, 2020

AP CM YSJagan reached idupulapaya 3 days tour in Kadapa district

ఇడుపులపాయ చేరుకున్న సీఎం

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గురువారం శంకుస్థాపనలు చేయనున్నారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆయన ఇడుపులపాయకు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడ నుంచి హెలీకాప్టర్‌ ద్వారా ఇడుపులపాయకు వెళ్లారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రికి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ అతిథి గృహంలో ముఖ్యమంత్రి బస చేయనున్నారు. రూ.3115 కోట్లతో గండికోట-సీబీఆర్గండికోట-పైడిపాలెం లిఫ్ట్ స్కీంకు శంకుస్థాపనరూ.1256 కోట్లతో మైక్రో ఇరిగేషన్‌ పనుల ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. 

Tuesday, December 22, 2020

Senior IAS Officer Adityanath Das become Andhra Pradesh New Chief Secretary

ఏపీ కొత్త సీఎస్ ఆదిత్యనాథ్ దాస్

ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రధానకార్యదర్శి (సీఎస్‌)గా ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారిణి తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి బదిలీ అయివచ్చిన శ్రీలక్ష్మికి కీలక బాధ్యతలు అప్పగించారు. పురపాలక శాఖ కార్యదర్శిగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కె. సునీతను  ప్రభుత్వం నియమించింది. సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ ఈనెల 31న బాధ్యతలు స్వీకరించనున్నారు. పదవీ విరమిణ పొందనున్న ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని ముఖ్యమంత్రి ప్రిన్సిపిల్ అడ్వైజర్‌గా విధులు నిర్వర్తించనున్నారు. తాజా సీఎస్ రేసులోకి పలువురు వచ్చినా వారంతా సెంట్రల్ సర్వీసులో ఉండడంతో 1987 బిహార్‌ బ్యాచ్‌కు చెందిన ఆదిత్యనాథ్‌ దాస్‌ వైపే సీఎం జగన్‌ మొగ్గు చూపారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Monday, December 21, 2020

YSRCP MLA RK Roja Adopts Orphan Girl to Fulfil Her Ambition to Become A Doctor

సీఎం జగన్ కు రోజా అరుదైన కానుక

https://youtu.be/mTc8ZMg6m-M

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు ఆ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా అరుదైన కానుక ఇచ్చారు. సోమవారం ముఖ్యమంత్రి పుట్టినరోజు కాగా రోజా ఈ రోజు ఓ అనాథ బాలికను దత్తత తీసుకున్నారు. అమ్మఒడి పథకం స్ఫూర్తితో ఆమె ముందుకు వచ్చారు. ఆడపిల్లల్ని చదివించాలనే ఆశయంతో పేద విద్యార్థిని దత్తత తీసుకున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో తిరుపతిలోని గర్ల్స్ హోమ్‌లో చదువుకుంటున్న పుష్ప కుమారిని రోజా అక్కున చేర్చుకున్నారు. ఆ బాలికకు మెడిసిన్ చేయాలని ఉందనే విషయాన్ని గర్ల్స్ హోమ్ నిర్వాహకులు రోజా దృష్టికి తీసుకొచ్చారు. దాంతో రోజా బాలిక వైద్య విద్యకయ్యే మొత్తం ఖర్చును తను భరిస్తానని ప్రకటించారు.

Sunday, December 20, 2020

Boyapati designs two powerful roles for Balakrishna

జిల్లా కలెక్టర్ గా బాలకృష్ణ

బాలకృష్ణ ఇంతకుముందు చేయని పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి జిల్లా కలెక్టర్ గా బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో అభిమానుల్ని అలరించనున్నాడు. పదేళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ జోడీ బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో మూడో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సింహ, లెజెండ్ ల తర్వాత బాలయ్య, బోయపాటి కలిసి చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.  ఈ చిత్రంలో బాలయ్య డబుల్ రోల్ చేస్తున్నాడు. రెండు పాత్రలూ పవర్ ఫుల్ గా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఇందులో పోరాట సన్నివేశాలు కొత్తతరహాలో ఉంటాయట. యాక్షన్ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన బోయపాటి ఈ సినిమాకి ఫాంటసీ కూడా జోడిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రజ్ఞా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. `సమరసింహారెడ్డి` ఫేమ్ అలనాటి సూపర్ హీరోయిన్ సిమ్రాన్ ప్రత్యేక పాత్రలో ఈ చిత్రంలో కనిపించనుందట.

Saturday, December 19, 2020

Hectic cold waves in north India

ఉత్తరాదిలో చలి పంజా

ఉత్తర భారతదేశంలో చలి పంజా విసురుతోంది. రోజురోజుకూ చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. శీతల గాలులకు జనం వణికిపోతున్నారు. ముఖ్యంగా సిమ్లా, కశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది.  ఢిల్లీలో కూడా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నవెూదవుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ అత్యల్ప డిగ్రీలు ఉష్ణోగ్రతల నమోదులో సిమ్లాతో పోటీపడుతోంది. ఢిల్లీలోని జాఫర్‌పూర్‌లో సాధారణం కన్నా 6 డిగ్రీల దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అదేవిధంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠానికి పడిపోయి గత పదేళ్ల నాటి రికార్డులను బద్దలు కొట్టాయి. ఇక్కడ 0.4 డిగ్రీల ఉష్ణోగ్రత నవెూదైంది. జలంధర్‌లో 1.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. బీహార్‌ లోనూ  4 డిగ్రీలకు కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాజస్థాన్‌లో గడచిన 24 గంటల్లో అనేక నగరాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నవెూదయ్యాయి. మౌంట్‌ అబూ, చందన్‌ తదితర ప్రాంతాల్లో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి.

Friday, December 18, 2020

Nithyananda, absconding rape accused, announces visa for Kailasa, flights from Australia

కైలాస దేశానికి నిత్యానంద ఆహ్వానం

   ·   వీసాకు kailaasa.org లో సంప్రదించొచ్చు

`కైలాస` పేరుతో ఏకంగా దేశాన్నే ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన వివాదాస్పద నిత్యానందస్వామి తాజాగా వీసా ఆహ్వానంతో తెరముందుకు వచ్చారు. ఈ ఏడాది వినాయకచవితి రోజున తమ దేశంలో రిజర్వుబ్యాంక్ ను కూడా ఏర్పాటు చేసినట్లు స్వాములవారు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎక్కడుందో తెలియని దేశానికి హిందూమత ప్రేమికులకు వీసా ఇస్తామంటూ ఆహ్వానం పలికారు. ఆస్ట్రేలియా వరకు సొంత ఖర్చులతో వచ్చిన వారిని తామే స్వయంగా సకల లాంఛనాలతో తమ దేశంలోకి తీసుకుపోతామన్నారు. పరమశివుని సందర్శించడానికి అనుమతిస్తామని సెలవిచ్చారు. అత్యాచారం, మహిళల అక్రమ నిర్బంధం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ నిత్యానందస్వామి ఏడాదిగా పరారీలో ఉన్నారు. ఓ దివిలో తలదాచుకుంటున్న స్వామి ఆకస్మికంగా కైలాస పేరుతో ఓ దేశాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు.  ఇందులో ఆరోగ్య శాఖ, రాష్ట్ర విభాగం, సాంకేతిక విభాగం, జ్ఞానోదయ నాగరికత విభాగం, విద్యా శాఖ, మానవ సేవల విభాగం, హౌసింగ్ విభాగం, వాణిజ్య విభాగం, ఖజానా విభాగం ఉన్నాయని వివరించారు. రిషభ ధ్వజ- కైలాస జెండాలో నిత్యానందతో పాటు దేశ జాతీయ జంతువు నంది కూడా ఉంది. కైలాస దేశానికి వెళ్లగోరే వారు kailaasa.org లో సంప్రదించొచ్చునట. 

Thursday, December 17, 2020

PSLV-C50 successfully launches CMS-01 from Sriharikota

పీఎస్ఎల్వీ-సీ50 సక్సెస్

పీఎస్ఎల్వీ-సి50 రాకెట్‌ నింగిలోకి దిగ్విజయంగా దూసుకెళ్లింది. సీఎంఎస్-01 దేశీయ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని నిప్పులు చిమ్ముకుంటూ సగర్వంగా మోసుకెళ్లింది. ఇస్రో సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు ఈ శాటిలైట్ ను కక్ష్యలోకి పంపింది.  నిర్దేశిత సమయంలోనే ఉపగ్రహం కక్ష్యలోకి చేరుకునేలా శాస్త్రవేత్తలు కృషి చేశారు. పీఎస్ఎల్వీ కేటగిరిలో ఇది 52వ ప్రయోగం కాగా ఎక్సెల్ కేటగిరిలో 22వది. 42వ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ లాంచ్ ప్రయోగం. మొత్తంగా ఇస్రోకు ఇది 77వ రాకెట్‌ ప్రయోగం. 2011లో ప్రయోగించిన జీశాట్‌-12 కాలపరిమితి ముగిసిపోవడంతో దాని ప్లేస్‌లో జీశాట్‌-12ఆర్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాలని ఇస్రో నిర్ణయించింది. అయితే ప్రస్తుతం దాని పేరును సీఎంఎస్-01గా మార్చి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. గతంలో జీశాట్‌-12 ఉపగ్రహాన్ని 36 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూస్థిర కక్షలోకి ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం సీఎంఎస్-01 శాటిలైట్‌  42 వేల 164 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరగనుంది. మొత్తం 1410 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహం అండమాన్‌, ‌నికోబార్‌ ‌దీవులు, లక్షద్వీప్‌ ‌దీవులతో పాటు యావత్ భారత్ దేశంలో కమ్యూనికేషన్ సేవలను అందించనుంది. ఏడేళ్ల పాటు ఈ ఉపగ్రహం విధులు నిర్వర్తించనుంది. ఇస్రో చైర్మన్ కె.శివన్ ఈ ప్రయోగ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలిపారు.

Wednesday, December 16, 2020

TRS gets cracking on crucial Nagarjunasagar bypoll

మార్చిలో తిరుపతి, నాగార్జునసాగర్ ఉపఎన్నికలు!

తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక మార్చిలో జరగవచ్చని తెలుస్తోంది. ఆ మేరకు సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇటీవల నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాలమరణం చెందిన సంగతి తెలిసిందే. దాంతో టీఎస్ లో మరో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల సీటును పార్టీ కోల్పోయింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాలమరణంతో జరిగిన ఉపఎన్నికలో బీజేపీ గెలుపొందింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీకి ఆశించిన ఫలితం దక్కలేదు. మరోసారి అలా జరగకూడదని టీఆర్ఎస్ భావిస్తోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి వైఎస్ఆర్ సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మరణించారు. ఆ స్థానానికి ఉపఎన్నిక జరగాల్సి ఉంది. ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఈ రెండు స్థానాలకు మార్చిలో ఒకేసారి షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tuesday, December 15, 2020

Eluru mystery disease: Traces of organochlorine, organophosphorus found in blood samples

వీడిన ఏలూరు వింత వ్యాధి మిస్టరీ

ఎట్టకేలకు ఏలూరు వింత వ్యాధి గుట్టును కేంద్ర వైద్య బృందాలు రట్టు చేశాయి. కూరగాయల్లో మోతాదు మించిన పురుగుల మందులు వాడకం, అదే విధంగా కల్తీ బియ్యం కూడా కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.  వింత వ్యాధి బారిన పడిన బాధితుల రక్తంలో సీసం, నికెల్ ఉన్నట్లుగా ఢిల్లీ ఎయిమ్స్ తెలిపింది. మరికొన్ని సంస్థలు మాత్రం బాధితులు తీసుకున్న ఆహారంలో పురుగుల మందు వంటి రసాయన అవశేషాలు ఉన్నట్లుగా ప్రాథమిక పరిశోధన ఫలితాల్లో వెల్లడించాయి. మూర్చ, నోట్లో నురగ, తలనొప్పి, వికారం, వాంతులు, మతిమరపు, వెన్నునొప్పి, ఆందోళన వంటి లక్షణాలతో వందల మంది గత వారంలో ఆసుపత్రుల పాలయ్యారు. ఈ వ్యాధి వల్ల ఇప్పటికే 622 మంది ఆస్పత్రుల్లో చికిత్సలు పొందారు. అందులో ఒకరు మృత్యుపాలయిన సంగతి తెలిసిందే. బాధితుల్లో 90శాతం మంది డిశ్చార్జి అయ్యారు. అయితే గాలి, నీరు ద్వారా వింత వ్యాధి ప్రబలలేదని స్పష్టమయింది. అలాగే పాలు, మాంసాహారం కారణం కాదని సమాచారం. కార్తీక మాసం కావడంతో చికెన్, మటన్ విక్రయాలు కూడా తగ్గాయి. అదీ గాక బాధితుల్లో 83 శాతం మంది  వ్యాధికి గురైన సమయంలో కేవలం శాకాహారం భోజనమే చేసినట్లు చెప్పారు. తాజా నివేదిక ప్రకారం కూరగాయల్లో పురుగుల మందుల అవశేషాలు కనిపించాయి. బియ్యంలో పాస్పరస్ ఆనవాళ్లు లభించినట్లు తెలుస్తోంది.

Monday, December 14, 2020

Thousands of iPhones looted, violence cost us Rs 440 crore in Wistron Bengaluru


 కోలారు ఐఫోన్ ప్లాంట్ విధ్వంసంలో నష్టం రూ.440 కోట్లు

 వేతనాలు చెల్లించాలంటూ కాంట్రాక్టు కార్మికులు సాగించిన విధ్వంసంలో రూ.440కోట్లు ఆస్తి నష్టం జరిగినట్లు విస్ట్రాన్ కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన ఐఫోన్ ప్లాంట్ సిబ్బంది తమ జీతాల సమస్యను పట్టించుకోవడం లేదంటూ శనివారం ఉదయం విధ్వంసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు సమీపంలోని కోలార్ జిల్లాలో గల నర్సాపురలోని ఈ ప్లాంట్‌లో యాపిల్ ఐఫోన్ విడి భాగాలను అమరుస్తుంటారు. ఈ విస్ట్రాన్ ప్లాంట్‌లో మొత్తం ఆరు కాంట్రాక్ట్ సంస్థల నుంచి 8,900 మందిని నియమించుకున్నారు. ప్లాంట్ లో మరో  1,200 మంది శాశ్వత ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కాంట్రాక్టు సిబ్బంది తమ జీతాలు చెల్లించలేదనే ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డారు. దాంతో వందలకోట్ల ఆస్తి నష్టం సంభవించింది. వేల సంఖ్యలో ఐఫోన్‌లు లూటీ అయ్యాయి. నష్టాన్ని ఇంకా పూర్తిగా అంచనా వేయాల్సి ఉందని పోలీస్ స్టేషన్‌లో సమర్పించిన ఫిర్యాదులో యాజమాన్యం వెల్లడించింది. దాదాపు 5,000 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. దాడితో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న 132 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విస్ట్రాన్ ప్లాంట్‌ దాడి ఘటనపై ఎస్పీ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ ఆందోళనకారులు ప్లాంట్ అద్దాలు పగలగొట్టి వాహనాలు ధ్వంసం చేశారన్నారు. కంప్యూటర్లు, ప్రింటర్లు, ల్యాప్‌టాప్స్, ఫ్లోర్,సీలింగ్స్, ఏసీ తయారీ పూర్తయిన స్మార్ట్‌ఫోన్లు ఇలా దేన్ని వదలకుండా విధ్వంసం సృష్టించినట్లు వివరించారు. భారత్‌లో ఏర్పాటైన తొలి ఐఫోన్ యూనిట్ విస్ట్రాన్‌పై దాడిని కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అదేవిధంగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించడంలో ఆ సంస్థ జాప్యం చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్ తెలిపారు. మూడ్రోజుల్లో సిబ్బందికి వేతనాలు చెల్లించాలని ఇప్పటికే కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

Sunday, December 13, 2020

390 kgs Ganjaa seize in Rajahmundry

రాజమండ్రిలో భారీగా గంజాయి పట్టివేత

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ గంజాయి కలకలం రేగుతోంది. ఉత్తరాంధ్ర ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ కేంద్రంగా భారీగా గంజాయి సాగవుతోందని ఇటీవల తరచు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో పెద్దఎత్తున గంజాయిని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని గామన్‌ బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లారీలో తరలిస్తున్న 390 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ గంజాయిని నర్సీపట్నం నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠా వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Saturday, December 12, 2020

Pawan Kalyan visits Dokiparru Venkateswara Swamy temple



డోకిపర్రు వెంకన్న సన్నిధిలో పవర్ స్టార్

https://www.youtube.com/watch?v=3jKNB2qvDe4

జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలోని డోకిపర్రు గ్రామంలో కొలువైన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో శనివారం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. వారిని ఉద్దేశించి పవర్ స్టార్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆలయాన్నిదర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రెండుమూడేళ్లుగా ఇక్కడకు రావాలనుకున్నా ఆ అదృష్టం ఇప్పుడు కల్గిందన్నారు. జిల్లాలో గల ప్రసిద్ధ ఆలయాల్లో ఇక్కడ శ్రీవారి ఆలయం కూడా ఒకటని పేర్కొన్నారు. ప్రస్తుత కల్యాణోత్సవంలో పాలుపంచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తిరుమల తరహాలో ఈ ఆలయ వేద పండితులు పూజాది కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఈ ఆలయ వైభవానికి అహర్నిశలు శ్రమిస్తున్న కృష్ణారెడ్డి  తదితరులకు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.

Friday, December 11, 2020

US New president Joe Biden and Kamala Harris named Time Person of the Year

టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్

బైడన్..కమలా

అమెరికా తదుపరి అధ్యక్ష, ఉపాధ్యక్షులు జో బైడెన్, కమలా హ్యారిస్‌లను టైమ్స్ పత్రిక `పర్సన్ ఆఫ్ ది ఇయర్`‌గా ఎంపిక చేసింది.‌ నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను  డెమొక్రాటిక్ అభ్యర్థి బైడెన్ ఓడించిన సంగతి తెలిసిందే.‌ దాంతో ఈ ఏడాది టైమ్ మ్యాగజైన్ `పర్సన్ ఆఫ్ ది ఇయర్` తాజా జాబితాలో  బైడెన్, కమలాలకు అగ్రస్థానం దక్కింది. ఈ ఇద్దరు డెమొక్రాటిక్ నేతలు ముగ్గురు ఫైనలిస్టులను దాటుకుని ఎంపికయ్యారు. కోవిడ్-19 మహమ్మారిపై ముందుండి పోరాటం చేస్తున్న ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు ఆంథోనీ ఫౌచీ, డొనాల్డ్ ట్రంప్ తదితరులు పోటీపడ్డారు. 78 ఏళ్ల బైడెన్, 56 ఏళ్ల కమలా ఫోటోలను కవర్ పేజీపై ముద్రించిన టైమ్ మ్యాగజైన్ `అమెరికా కథను మార్చారుఅంటూ  కింద ఉప-శీర్షికను పెట్టింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కు మొత్తం 306 ఎలక్టోరల్ ఓట్లు రాగా.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు 232 ఓట్లు వచ్చాయి. అలాగే అమెరికా ఎన్నికల్లో ఇప్పటి వరకూ ఎవరికి సాధ్యం కానిరీతిలో బైడెన్ 70 మిలియన్లకు పైగా ఓట్లను సాధించారు. ఇంత వరకు 2006 ఎన్నికల్లో బారాక్ ఒబామా సాధించిన 6.9 మిలియన్ ఓట్లే అత్యధికం కాగా దానిని బైడన్ అధిగమించి రికార్డు నెలకొల్పిన విషయం విదితమే.

Thursday, December 10, 2020

Vijayashanthi satirical comments on KCR

కేసీఆర్ పై రాములమ్మ వ్యంగ్యోక్తులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తాజాగా బీజేపీలో చేరిన రాములమ్మ (విజయశాంతి) వ్యంగ్యోక్తులు విసిరారు. కేసీఆర్ ను మించిన మహానటుడు లేరన్నారు. కేసీఆర్ కన్నా ముందే తాను తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టినట్లు విజయశాంతి చెప్పారు. ఉద్యమం కోసమే `తల్లి తెలంగాణ పార్టీ`ని టీఆర్ఎస్‌లో విలీనం చేశానన్నారు. మెదక్ ఎంపీగా ప్రజలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన సంగతి గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉండొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ తనను అనేక ఇబ్బందులకు గురిచేశారని రాములమ్మ ఆరోపించారు.