Tuesday, October 20, 2020

Officials on alert as IMD extends heavy rain warning for next 72 hours in Telugu states

జడి వానకు.. వెన్నులో వణుకు

ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎడతెగని వానలతో భీతిల్లుతున్నాయి. ఇటీవల కుంభవృష్టికి ఊళ్లకు ఊళ్లు చివురుటాకుల్లా వణికిపోయాయి. మరోవిడత ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో జడివాన విరుచుకుపడనుంది. రాగల మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రంగా మారనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ కారణంగా ఏపీలో ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిశ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రాబోయే 72 గంటల్లో అతి భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనా. అదే విధంగా కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు; అనంతపురం, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది.