Tuesday, February 25, 2020

China bans trade consumption of wild animals due to coronavirus

వన్యప్రాణి మాంసంపై చైనా నిషేధాస్త్రం
కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) తీవ్రత దృష్ట్యా దేశంలో వన్యప్రాణి మాంస విక్రయాలు, వినియోగంపై  చైనా నిషేధాస్త్రం ప్రయోగించింది. మేరకు మ్యూనిస్టు చైనా పాలకులు సోమవారం కీలక నిర్ణయం ప్రటించారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు కాపాడ్డమే క్ష ర్తవ్యని పేర్కొన్నారు. దేశ అత్యున్నత నిర్ణాయక మండలి నేషనల్పీపుల్స్కాంగ్రెస్‌ (ఎన్పీసీ) మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు చైనా అధికారిక టీవీ చానల్పేర్కొంది. అధిక మోతాదులో వన్యప్రాణి మాంసభక్షణ సమస్యలకు దారితీస్తోందని చైనా ర్కార్ భావిస్తోంది. మరోవైపు కొవిడ్‌-19 కారణంగా చైనాలో మృతుల సంఖ్య 2,590 దాటింది. వైరస్నిర్ధారిత కేసుల సంఖ్య 77 వేల పైమాటేనని తెలుస్తోందిఇదిలావుండ‌గా వైరస్‌ కేంద్ర స్థానం హుబెయ్ ప్రావిన్స్ రాజధాని వూహాన్‌లో జన సంచారంపై ఆంక్షల్ని పరిమితంగా సడలించిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు కొవిడ్‌-19 బాధితులు 80 వేలకు చేరుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తాజాగా ప్రకటించింది. ప్రాణాంత రోనా ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో చీఫ్టెడ్రోస్అధానమ్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. వైరస్ ను అంచనా వేసేందుకు డబ్ల్యూహెచ్వో బృందాన్ని పంపగా వారిని హుబెయ్ ప్రావిన్స్, వూహాన్ ప్రాంతాల్లోకి వెళ్లనివ్వబోమని చైనా స్పష్టం చేసింది. తాజాగా  చైనా అనుమతి భించడంతో మందులు, వైద్య పరికరాలతో కూడిన భారత విమానం బుధవారం దేశానికి బయల్దేరనుంది.