Wednesday, July 3, 2019

England enters semis crushed out Newzealand by 119 runs in icc world cup

వరల్డ్ కప్ సెమీస్ చేరిన ఇంగ్లాండ్ 119 పరుగుల తేడాతో కివీస్ చిత్తు
ఐసీసీ వరల్డ్ కప్12 లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు సగర్వంగా సెమీ ఫైనల్స్ కు చేరింది. బ్యాటింగ్బౌలింగ్ఫీల్డింగ్ అన్నింటా న్యూజిలాండ్ పై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఆ జట్టును 119 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బుధవారం డర్హం రివర్ సైడ్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్ నం.41లో ఇంగ్లాండ్ పిడుగు జానీ బెయిర్ స్టో తనపై గల అంచనాలు నిలబెట్టుకుంటూ టోర్నీలో వరుసగా రెండో సెంచరీ సాధించాడు. క్రీడా పండితుల అంచనాలకు తగ్గట్లు టైటిల్ ఫెవరేట్ గా పరిగణింపబడుతున్న ఇంగ్లాండ్ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. టోర్నీ ఆరంభంలో వరుస మ్యాచ్ ల గెలుపుతో పులిలా కనిపించిన న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ తో ఈ రోజు మ్యాచ్ లో పిల్లిలా మారిపోయింది. అద్భుతాలు చేయగలదనుకున్న దశ నుంచి ఒక్కో మెట్టు కిందకు జారిపోయింది. ముఖ్యంగా ఆతిథ్య జట్టుతో మ్యాచ్ లో లక్ష్య ఛేదనలో ఏ దశలోనూ పోరాడకుండా బ్యాట్ ఎత్తేసి పెవిలియన్ బాట పట్టింది.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేపట్టి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. ఓపెనర్లు జాసన్ రాయ్(60)బెయిర్ స్టో(106)జోరూట్(24)ఇయాన్ మోర్గాన్(42) జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డారు. పేసర్స్పిన్నర్ తేడా లేకుండా అందరి బంతుల్ని ఇంగ్లిష్ బ్యాట్స్ మెన్ బాదేశారు. జేమ్స్ నిషమ్ మాత్రమే ఇంగ్లాండ్ బ్యాటర్ల బాదుడు నుంచి తప్పించుకున్నాడు. 41 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మాట్ హెన్రీ 54 పరుగులిచ్చి 2 వికెట్లుట్రెంట్ బౌల్ట్ 56 పరుగులకు 2 వికెట్లు తీసుకోగా మిషెల్ శాంటనర్టిమ్ సోథీ చెరో 1 వికెట్ పడగొట్టగలిగారు. 306 పరుగుల ఛేదన లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ గెలుపు ధీమా చూపలేకపోయింది. ప్రత్యర్థి బౌలర్ల ప్రతిభ కన్నా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ నిర్లక్ష్యం వల్లే వికెట్లు టపటపా పడిపోయాయి. క్రిస్ వోక్స్ బౌలింగ్ లో హెన్రీ నికోల్స్(0) అవుట్ కాకపోయినా ఫీల్డ్ అంపెర్ ఎల్బీడబ్లూ ఇవ్వడంతో వెనుదిరిగాడు. వాస్తవానికి ఆ బంతి వికెట్ల పై నుంచి వెళ్తున్నట్లు రీప్లే లో బయటపడింది. థర్డ్ అంపైర్ (డీఆర్ఎస్) అవకాశాన్ని హెన్రీ వదిలేసుకున్నాడు. మరో ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ (8) కూడా త్వరగా వెనుదిరిగాడు. రాస్ టేలర్(28)కెప్టెన్ కేన్ విలియమ్సన్(27)లు మ్యాచ్ ను ప్రత్యర్థికి అప్పగిస్తూ అనవసరంగా రనౌట్లయి వెనుదిరిగారు. మార్క్ వుడ్ షార్ట్ పిచ్ఓవర్ పిచ్ బౌన్సర్లతో కివీస్ బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టి 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. జోరూట్ మినహా మిగిలిన ఇంగ్లాండ్ బౌలర్లు క్రిస్ వోక్స్జోఫ్రా ఆర్చర్లియమ్ ప్లంకెట్అడిల్ రషీద్బెన్ స్టోక్స్ 1 వికెట్ చొప్పున పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మొత్తానికి బాధ్యతగా బ్యాటింగ్ చేసిన ఒకే ఒక్కడు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ టామ్ లథమ్(57) మాత్రమే. ఆ జట్టు ఇంకా అయిదు ఓవర్లు మిగిలి ఉండగానే పట్టుమని 200 పరుగులు కూడా చేయకుండా 45 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటయింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా బెయిర్ స్టో నిలిచాడు.

Ambati Rayudu retires all forms of cricket after being ignored this World Cup

అంబటి రాయుడు అలక:అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటన

భారత క్రికెట్ క్రీడాకారుడు అంబటి రాయుడు అలకబూనాడు. వరల్డ్ కప్ కు తనను ఎంపిక చేయలేదని అప్పటి నుంచి రాయుడు కినుక వహించాడు. చివరకి అతణ్ని స్టాండ్ బైగా ప్రస్తుత వరల్డ్ కప్ కు ఎంపిక చేశారు. శిఖర్ ధావన్ గాయంతో వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంతో మరో స్టాండ్ బై గా ఎంపికైన పంత్ కు మ్యాచ్ లు ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత విజయ్ శంకర్ కూడా గాయంతో వైదొలగడంతో రాయుడికి అవకాశం దక్కవచ్చని అందరూ భావించారు. అయితే మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో రాయుడు ఇక తను భారత జట్టులోనే కొనసాగకూడదని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. మంచి భవిష్యత్ ఉన్న రాయుడు క్రికెట్ అంటే వరల్డ్ కప్ గానే భావించడం సరికాదు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర అంతర్జాతీయ మ్యాచ్ లో పాల్గొనడం కూడా ప్రతిష్ఠాత్మకమేనని గ్రహించాలి. 2013లో భారత జట్టుకు ఎంపికై జింబాబ్వేపై తొలి వన్డే ఆడాడు. ఆస్ట్రేలియాతో ఆడిన వన్డే చివరి మ్యాచ్. 55 వన్డేల్లో 47.05 సగటుతో 1694 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్ధ సెంచరీలున్నాయి. అలాగే ఆరు టీ-20 మ్యాచ్ లు ఆడిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్ మన్ కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. వన్డేల్లో అత్యధిక స్కోరు 124. రాయుడు మొత్తం 97 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 6,151 పరుగులు చేశాడు. రాయుడు రిటైర్మెంట్ లేఖ అందినట్లు బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి.