Sunday, June 16, 2019

Avon march in prague most of the women dressed in pink


ప్రేగ్ లో ఘనంగా ఎవాన్ మార్చ్
చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ లో ఎవాన్ మార్చ్ 19వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. బ్రెస్ట్ కేన్సర్ బాధితులు వారి తల్లిదండ్రులకు సంఘీభావంగా ఏటా ఎవాన్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఈ మార్చ్ లో వేల సంఖ్యలో మహిళలు గులాబీ రంగు దుస్తుల్లో పాల్గొనడం రివాజు. జున్ 15 శనివారం ప్రేగ్లోని ఓల్డ్ టౌన్ స్కేర్ లో మార్చ్ కు పెద్ద సంఖ్యలో హాజరైన యువతులు అనంతరం వైభవంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘మన మనసుల్లో ఏముందో ముఖ్యం కాదు మనం అందరి హృదయాలకు ఏమి చేరుస్తున్నామన్నదే ప్రధానం’  అనే నినాదంతో ఈ ఏడాది ఎవాన్ మార్చ్ నిర్వహించారు. ద ఎవాన్ హెల్త్ బ్రెస్ట్ ప్రాజెక్టు సంస్థ పింక్ రిబ్బన్ లతో కూడిన ఉత్పత్తుల్ని, ఎవాన్ మార్చ్ టి-షర్టుల్ని ఈ సందర్భంగా విక్రయించింది. బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడుతున్న వారికి సహాయంగా నిర్వహించే స్వచ్ఛంద కార్యక్రమాలకు ఈ సొమ్మును ఆ సంస్థ అందజేస్తుంది. ఏటా చెక్ రిపబ్లిక్ లో 7వేల మంది బ్రెస్ట్ కేన్సర్ బారిన పడుతున్నారు. ఇందులో 1900 మంది మరణిస్తున్నట్లు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయో స్టాటస్టిక్స్ అండ్ అనలైజెస్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసన్ ఆఫ్ ది మసారిక్ యూనివర్సిటీ, చెక్ అసోసియేషన్ ఆఫ్ మేమోడయాగ్నొస్టిక్స్ నివేదికల ద్వారా తెలుస్తోంది. కణతిని కేన్సర్ తొలిదశలోనే గుర్తిస్తే 90 శాతం వ్యాధిని నివారించే అవకాశముంటుంది. మేమోగ్రఫీ విధానంలో చేసిన బ్రెస్ట్ కేన్సర్ పరీక్షల ద్వారా అత్యంత సమర్ధంగా కచ్చితమైన నివేదికను పొందొచ్చు.

Uttara Pradesh dgp took out traffic awareness rally in lucknow


ట్రాఫిక్ చైతన్యం కోసం యూపీ డీజీపీ సైకిల్ ర్యాలీ
వాహనచోదకులకు ట్రాఫిక్ చైతన్యం కల్పించడంలో భాగంగా ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఓం ప్రకాశ్ సింగ్ ఆదివారం లక్నోలో సైకిల్ ర్యాలీ చేపట్టారు. కాళీదాసు మార్గం రోడ్ నం.5లో  ఉదయం 6 కు ప్రారంభించిన ర్యాలీ సుమారు 10 కిలోమీటర్లు సాగింది. లాల్ బాగ్ వద్ద కు చేరుకున్న అనంతరం డీజీపీ ఓంప్రకాశ్ మాట్లాడుతూ వాహనచోదకులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ముఖ్యంగా మోటారు బైక్ లు నడిపేవారు శిరస్త్రాణం (హెల్మెట్) ధరించడం తప్పనిసరన్నారు. తద్వారా వారి ప్రాణాలకే కాక సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. అదే విధంగా కార్లు నడిపే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. శరీర వ్యాయామానికి, ఆరోగ్యానికి సైకిల్ తొక్కడం (సైక్లింగ్) ఎంతో మేలంటూ అది ప్రజలకే కాక పోలీసులకు వర్తిస్తుందని తెలియపర్చడానికే ఈరోజు ఈ సైకిల్ ర్యాలీ చేపట్టినట్లు డీజీపీ వివరించారు. ఈ ర్యాలీలో డీజీపీ ఓం ప్రకాశ్ వెంట ఎస్.ఎస్.పి. కళానిధి నాథని, ఏడీజీ రాజీవ్ కృష్ణ, ఎస్పీ వికాస్ చంద్ర త్రిపాఠి సహా పలువురు పోలీసులు పాల్గొన్నారు. దేశంలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 15 వేల మంది దుర్మరణం చెందడమో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రులకు పరిమితమౌతోన్న ఘటనలో చోటు చేసుకుంటున్నాయి. వీటిలో అధిక శాతం మరణాలు హెల్మెట్ ధరించని మోటారు బైక్ చోదకులు, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు డ్రైవ్  చేస్తున్నవారివే కావడం గమనార్హం. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే రోజూ 98 మంది బైకర్లు హెల్మెట్ పెట్టుకోక రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. యూపీలో ఈ సంఖ్య 2019 నాటికి తగ్గినా ఇంకా ప్రమాదకర స్థాయిలోనే మరణాలు రోడ్డు ప్రమాదాల్లో నమోదవుతున్నాయి.