Wednesday, May 8, 2019

Kejriwal, Prakash Raj campaign in West Delhi


ఢిల్లీలో కేజ్రీవాల్ తో కలిసి ప్రకాశ్ రాజ్ ప్రచారం
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ అధినేత) కేజ్రీవాల్ తో కలిసి దక్షిణాది ప్రముఖ నటుడు తాజాగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రకాశ్ రాజ్ బుధవారం (మే8) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆప్ పశ్చిమ ఢిల్లీ అభ్యర్థి బల్బీర్ సింగ్ జకర్ ను వెంటబెట్టుకుని ఈ ఇద్దరు నేతలు ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆప్ అభ్యర్థి కి ఓటేసి గెలిపించాలని ప్రకాశ్ రాజ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నిజమైన సమస్యల్ని పేర్కొంటున్న వాటిని తీర్చేందుకు ప్రయత్నిస్తోన్న ఏకైక పార్టీ ఆప్ మాత్రమేనని ప్రకాశ్ రాజ్ ప్రశంసించారు. బల్బీర్ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మహాబల్ మిశ్రా, బీజేపీ సిట్టింగ్ అభ్యర్థి పర్వేశ్ సింగ్ వర్మలతో త్రిముఖ పోటీ ఎదుర్కొంటున్నారు. ఆప్ ఇప్పటికే ఈ నియోజకవర్గంలో రెండు సార్లు ప్రచారం నిర్వహించింది. తొలి విడత ప్రచారం మార్చి10న మొదలు పెట్టి ఏప్రిల్ 7 వరకు రెండోసారి ఏప్రిల్ 25 వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఢిల్లీలో ఎన్నికలు ఆరో విడతగా మే12న జరగనున్నాయి.