Friday, April 12, 2019

urmila matondkar not approaching politics as a star


ప్రజా ప్రతినిధిగా సేవలందించేందుకే పోటీ చేస్తున్నా:ఊర్మిళ
సినీతార హోదాలో ఏదో పొందాలని రాజకీయాల్లోకి రాలేదని ప్రజా ప్రతినిధిగా జనానికి సేవలందించాలనే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళ పేర్కొన్నారు. 90వ దశకంలో రంగీలా, దౌడ్, జుడాయ్ సినిమాల ద్వారా యావత్ దేశంలో యువతను ఆకట్టుకున్నారామె. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ముంబయి నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. గతంలో ఇదే స్థానానికి మరో బాలీవుడ్ స్టార్ గోవింద ప్రాతినిధ్యం వహించారు. ఈ ప్రాంతంలో పలువురికి గృహ సమస్య, నీటి ఎద్దడి, పారిశుద్ధ్యం వంటి ప్రధానమైన ఇబ్బందులున్నాయని వాటితో పాటు ఇతర ఇక్కట్లను పరిష్కరించడానికి కృషి చేయనున్నట్లు ఊర్మిళ తెలిపారు. ఆమె ప్రత్యర్థి భారతీయ జనతాపార్టీ (బీజేపీ) అభ్యర్థి గోపాల్ శెట్టి ఇటీవల మాట్లాడుతూ ఊర్మిళ పాపం అమాయకురాలు, రాజకీయాల్లో సున్నా అని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఆమెతో ప్రస్తావించగా అది ఆయన మానస్తత్వాన్ని తెలియజేస్తోందని లోక్ సభకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తులకు చక్కటి అవగాహన, ఆలోచన విధానం ఉండి తమ సమస్యల్ని తీర్చేవారే కావాలని ప్రజలు కోరుకుంటారని ఊర్మిళ సమాధానమిచ్చారు. రాజకీయాల్లో సున్నాగా ఉండడమే తనకిష్టమని ఎందుకంటే మాటల్లో,చేతల్లో ప్రజల వెన్నంటి ఉంటూ ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ముందుకెళ్లడానికి రాజకీయాల్లో ఇది తొలి అడుగన్నారు. ఇర్ఫాన్ ఖాన్ బ్లాక్ మెయిల్సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న సమయంలోనే సమాజానికి ఏదైనా చేయాలనే తాము ఆలోచించామన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని తొలుత అనుకోలేదని అయితే ప్రచారకర్తగా వ్యవహరిస్తుండగా పార్టీ టిక్కెటిచ్చి బరిలోకి దింపిందని 45ఏళ్ల ఊర్మిళ తెలిపారు. అయితే ఈ సార్వత్రిక ఎన్నికలు కచ్చితంగా దేశ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలని ఆమె పేర్కొన్నారు.

No comments:

Post a Comment