Friday, April 12, 2019

China floods death toll rises to seven 4 missing in shenzhen city


చైనాలో ఆకస్మిక వరదలు 7గురి మృతి నలుగురి గల్లంతు

చైనా దక్షిణ ప్రాంతంలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. షెన్జెన్ నగరంలో శుక్రవారం వరదల తాకిడికి ఏడుగురు మృతి చెందగా మరో నలుగురి జాడ తెలియడం లేదు. ఆకస్మికంగా భారీ వర్షాలు కురవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గురువారం రాత్రి 9 గంటల నుంచి షెన్జెన్ భారీ వర్షాల తాకిడికి చివురుటాకుల వణికిపోయింది. ఎడతెగని భారీ వర్షంతో వరద విరుచుకుపడగా జనజీవనం అస్తవ్యస్తమైంది. లూవోహు, ఫుటియాన్ ప్రాంతాల్లో పూడికతీత పనుల్లో అలక్ష్యం వల్లే వరద పోటెత్తడానికి కారణంగా భావిస్తున్నారు.


No comments:

Post a Comment