Friday, April 12, 2019

russel brutal innings again in ipl delhi bowler morris got his wicket

రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్
·  ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చిన ధావన్      

·  కె.కె.ఆర్.పై డీసీ గెలుపు


ఐపీఎల్ మ్యాచ్ నెం.26 ను ఢిల్లీ కేపిటల్స్ గెలుచుకుంది. కోలకతా నైట్రైడర్స్ తో శుక్రవారం జరిగిన మ్యాచ్ ద్వారా ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్ మన్ ధావన్ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. అయితే తొలి ఐపీఎల్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ధావన్ 97* పరుగులు చేశాడు. అయితే మూడో వికెట్ కు రిషబ్ పంత్(47) తో కలిసి 100 పరుగుల్ని జోడించడంతో 179 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు తేలిగ్గానే అందుకుంది. మూడు వికెట్లనే కోల్పోయిన ఢిల్లీ జట్టు ఇంకా ఏడు బంతులు మిగిలి ఉండగానే 180 పరుగులు చేసి విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు కట్టుదిట్టంగానే బౌలింగ్ చేసింది. రస్సెల్ బ్యాటింగ్ దిగాక పరిస్థితి మారిపోయింది.
రస్సెల్... బ్రూటల్...
ఐపీఎల్ సీజన్-12ల్లో ఆండ్రూ రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. కోలకతా ఈడేన్ గార్డెన్స్ లో ఢిల్లీ కేపిటల్ తో పోరులో మరోసారి చెలరేగిపోయాడు. కేవలం 21 బంతుల్లో నాలుగు సిక్సర్లు, మూడు బౌండరీలతో 45 పరుగులు చేశాడు. రబాడ, క్రిస్ మోరిస్ బౌలరెవరైనా అది ఏ బంతయినా చేరేది బౌండరీ లైన్ కే అన్నట్లుగా బ్యాటింగ్ చేశాడు. బౌలర్ అదృష్టం బాగుండి ఫీల్డర్ క్యాచ్ అందుకున్నాడు కాబట్టి గానీ లేదంటే మరో పెద్ద ఇన్నింగ్స్ తో జట్టు స్కోరును 200 దాటించేవాడే. క్రిస్ మోరిస్ ఆఫ్ కటర్ యార్కర్ ను సిక్స్ గా మలిచే ప్రయత్నంలో రస్సెల్ స్క్వేర్ లెగ్ బౌండరీ వద్ద రబాడకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు ఓపెనర్ సుభమన్ గిల్ చక్కటి అర్ధ సెంచరీ చేశాడు. 65 పరుగుల స్కోర్ వద్ద అతను వెనుదిరగడంతో కెప్టెన్ దినేశ్ కార్తీక్ రంగప్రవేశం చేసినా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలదొక్కుకోలేదు. పీయూష్ చావ్లా చివర్లో కొన్నైనా పరుగులు రాబట్టడంతో కోలకతా నైట్ రైడర్స్(కేకేఆర్) జట్టు 178/7 స్కోర్ సాధించింది.

No comments:

Post a Comment