Saturday, June 22, 2019

union bank ATM robbery bid foiled in Mathura


మధుర లో ఏటీఎం చోరీ యత్నం భగ్నం
ఉత్తరప్రదేశ్ లోని మధురలో శుక్రవారం అర్ధరాత్రి దుండగులు ఏటీఎం చోరీకి చేసిన యత్నం పోలీసుల రాకతో భగ్నమయింది. పోలీసు గస్తీ వాహనాన్ని చూసి దొంగలు పారిపోయారు. ఈ ఘటన అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చోటు చేసుకుంది. స్థానిక కృష్ణ విహార్ కాలనీలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం లక్ష్యంగా దొంగలు చోరీకి శతథా ప్రయత్నించారు. మెషిన్ ఎంతకూ తెరుచుకోకపోవడంతో గ్యాస్ కట్టర్లతో కత్తిరించాలనుకున్నారు. అదీ సాధ్యం కాలేదు. చివరకు మెషిన్ ను పెకిలించుకు పోవాలనుకుంటున్న సమయంలో శబ్దాలకు అనుమానం వచ్చిన పోలీసు గస్తీ వాహనం ఆ ప్రాంతానికి చేరుకోవడంతో దొంగలు పలాయనం చిత్తగించినట్లు నగర పోలీసు సూపరింటెండెంట్ రాకేశ్ కుమార్ తెలిపారు.


No comments:

Post a Comment