Monday, June 3, 2019

rahul pays homage to karunanidhi on his birth anniversary

కరుణానిధికి ఘనంగా నివాళులర్పించిన రాహుల్

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 95వ జయంతి ఘనంగా నిర్వహించారు. డీఎంకే అధినేత, కరుణానిధి కుమారుడు స్టాలిన్ సోమవారం(జూన్3) ఏర్పాటైన కార్యక్రమంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. `ఫాదర్ ఆఫ్ మోడ్రన్ తమిళనాడు`గా కీర్తిపొందిన కరుణానిధి తన 94వ ఏట వృద్ధాప్యంతో కన్నుమూశారు. దాదాపు ఏడాది పాటు ఆయన చికిత్స పొందుతూ గత ఆగస్ట్7న మరణించారు. ఆయన తమిళనాడుకు అయిదు సార్లు సీఎంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు తమిళనాడు అమ్మగా పిలుచుకునే జయలలిత లేకుండా రాష్ట్రంలో తొలిసారి తాజా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ జయంతి సందర్భంగా కరుణానిధిని తలుచుకోవడం ముదావహం అన్నారు. అమోఘమైన తమిళనాడు ప్రజలకు అసలైన నాయకుడు..ఆయన జ్ఞాపకాలు ఎన్నటికీ చెరగని ముద్రగా రాహుల్ ట్విటర్ లో పేర్కొన్నారు. 


No comments:

Post a Comment