Monday, June 3, 2019

IAF aircraft with 13 people on board goes missing



అదృశ్యమైన భారత వాయుసేన విమానం
భారత వైమానికి దళానికి చెందిన ఓ రవాణా విమానం జాడ తెలియకుండా పోయింది. సోమవారం(జూన్3) మధ్యాహ్నం 12.25 నిమిషాలకు గ్రౌండ్ కంట్రోల్ రూం తో ఈ విమానానికి సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం. అసోం లోని జోర్హాట్ లో బయలుదేరిన 35 నిమిషాలకే విమానం ప్రమాదానికి గురైనట్లు భావిస్తున్నారు. ఈ ఏఎన్-32 యుద్ధ విమానం అరుణాచల్ ప్రదేశ్ లోని మెంచుకాకు ప్రయాణిస్తోంది. చైనా సరిహద్దుల్లోని ఈశాన్య పర్వతప్రాంతాల మీదుగా ప్రయాణిస్తుండగా ఈ విమానం నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. విమానంలో 8మంది సిబ్బందితో పాటు మరో అయిదురు ఇతరులు ప్రయాణిస్తున్నారు. అదృశ్యమైన విమానం జాడ కనుగొనేందుకు భారత వాయుసేన ప్రయత్నాలు ప్రారంభించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఈ విమానం జాడ కనుగొనడానికి ఐఏఎఫ్ సుఖోయ్ యుద్ధ విమానాల్నిరంగంలోకి దించింది. రక్షణ శాఖ నూతన మంత్రిగా గత వారమే బాధ్యతలు చేపట్టిన రాజ్ నాథ్ సింగ్ వాయుసేన అధికారులతో విమాన అదృశ్యం విషయమై మాట్లాడారు. విమానంలోని వారందరూ క్షేమంగా తిరిగిరావాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.


No comments:

Post a Comment