Saturday, April 13, 2019

ipl2019 royals beat mumbai by 4 wickets in thrilling clash

చెలరేగిన జోస్ బట్లర్ ఆర్ఆర్ జట్టు గెలుపు
·  ఊపు మీదకు వచ్చిన డీకాక్, రోహిత్
·  అయినా ముంబయికి తప్పని ఓటమి
ముంబయి వాంఖేడ్ స్టేడియం జోస్ బట్లర్ జోష్ కు ఫిదా అయింది. సిక్సర్లు, ఫోర్లు వర్షం కురిపించడంతో ముంబయి ఇచ్చిన లక్ష్యం రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుకు ఎంతో చిన్నదిగా కనిపించింది. చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ లో ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే ఆర్ఆర్ విజయం నమోదు చేసింది.
ఐపీఎల్ మ్యాచ్ నం.27లో ముంబయి ఇండియన్స్(ఎంఐ) ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్(ఆర్ఆర్) ఎదుట 188 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ముంబయి వాంఖేడ్ స్టేడియంలో శనివారం(ఏప్రిల్13) టాస్ గెలిచిన ఆర్ఆర్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎట్టకేలకు ఓపెనర్ డీకాక్(87) ఊపు మీదకు రావడం, కెప్టెన్ రోహిత్ (47)మళ్లీ చెప్పుకోదగ్గ స్కోరు చేయడంతో ముంబయి జట్టు 187/5 సాధించింది.
ఆర్ఆర్ జట్టు 188 పరుగుల లక్ష్య ఛేదనలో 9సిక్సర్లు, 19 బౌండరీలు (130 పరుగులు) సాధించడాన్ని బట్టే ఏ రీతిలో ధాటిగా ఆడిందో అర్థమౌతుంది. ఓ వైపు బౌండరీల మోత మోగించిన కెప్టెన్ అజింక రహానే 21 బంతుల్లో 37 పరుగులు చేసి వెనుదిరగ్గానే మరో ఓపెనర్ జోస్ చెలరేగిపోయి ఆడాడు. 43 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి జోస్ అవుటయ్యాడు. రాహుల్ చహర్ బౌలింగ్ లో సూర్యకుమార్ కు క్యాచ్ ఇచ్చాడు. రహానే క్యాచ్ ను కూడా సూర్యకుమారే అందుకున్నాడు. 60 పరుగుల వద్ద రహానే అవుటవ్వగా 147 పరుగుల వద్ద జోస్ పెవిలియన్ చేరాడు. 14 ఓవర్లు ముగిసే సరికి 155/2 స్కోరుతో ఆర్ఆర్ జట్టు విజయానికి చేరువలోకి వచ్చింది. అయితే ఆ తర్వాత నాలుగు వికెట్లను స్వల్ప పరుగుల తేడాతో చేజార్చుకుంది. చివరి ఓవర్లలో గోపాల్ దీటుగా ఆడి జట్టును గెలిపించాడు.

No comments:

Post a Comment