Sunday, April 14, 2019

elephant kills oldaged pilgrim injures two others in poondi reserve forest


ఏనుగు దాడిలో వృద్ధ భక్తుడి మృతి ఇద్దరికి గాయాలు
దైవ దర్శనానికి వచ్చిన 60 ఏళ్ల వృద్ధ భక్తుడు ఏనుగు దాడిలో దుర్మరణం చెందాడు. ఈ దుర్ఘటన ఆదివారం పూండి రిజర్వ్ ఫారెస్ట్ కు 30కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఏనుగు దాడిలో మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయినట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడకు సమీపంలోని వెలియాన్ గిరిలో కొండపై పురాతన దేవాలయాన్ని సందర్శించుకోవడానికి పలువురు భక్తులు బయలుదేరారు. వీరంతా మార్గమధ్యంలో సెలయారులో నీళ్లు తాగేందుకు ఆగారు. అకస్మాతుగా అడవిలో నుంచి దూసుకువచ్చిన ఏనుగు ఆరుసామి(60) అనే వృద్ధుడ్ని కాళ్లతో తొక్కేసింది. దాంతో అతను అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరిపైన ఏనుగు విరుచుకుపడగా తీవ్ర గాయాలపాలయ్యారు. మరికొందరు భక్తులు మాత్రం ఏనుగు దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని బయటపడినట్లు సమాచారం.


No comments:

Post a Comment