Monday, April 22, 2019

chennai two cars go up in flames cause of malfunctioned

పెట్రోల్ కారులో డీజిల్ కొట్టడంతో రెండు కార్లు దగ్ధం

చెన్నైలో పొరపాటున ఓ వ్యక్తి తన పెట్రోల్ కారుకు డీజిల్ కొట్టించాడు. దాంతో అతని కారుకు మంటలంటుకుని పక్కనే ఉన్న మరో కారుకు వ్యాపించడంతో రెండూ దగ్ధమైన ఘటన చెన్నైలో జరిగింది. సోమవారం (ఏప్రిల్ 22) ఉదయం 11కు ఈ ఘటన జి.ఎన్.శెట్టి రోడ్డులో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ప్రయివేటు బ్యాంక్ లో పనిచేస్తున్న రమేశ్ తన కారులో ఇంధనం పోయించడానికి వెళ్లాడు. అక్కడ బంక్ లో డీజిల్ కొట్టారు. కారు ట్రబుల్ ఇస్తుండగా రాత్రి ఎలాగోలా తను నివాసముంటున్న కెనరా బ్యాంక్ కాలనీకి తిరిగి వచ్చి దగ్గర్లో గల టీనగర్ లో కారును పార్క్ చేశాడు. సోమవారం మెకానిక్ ని తీసుకు వచ్చి చూపించాడు. అతని ద్వారా కారులో డీజిల్ పోసిన విషయం గ్రహించాడు. ఇంతలోనే కారు నుంచి పొగలు వస్తుండడాన్ని వారు గమనించారు. అంతలోనే కారులో మంటలు ఎగసి పడ్డాయి. పక్కనే పార్క్ చేసి ఉన్న మాధవన్ అనే వ్యక్తి కారుకు జ్వాలలు వ్యాపించడంతో రెండు కార్లూ తగలబడిపోయాయి.



No comments:

Post a Comment