Tuesday, April 23, 2019

here he is now with a t20 ton ajinkya rahane slams his second ipl century


ఢిల్లీని గెలిపించిన శిఖర్, పంత్

·        రహానే సెంచరీ వృథా  ·        6 వికెట్ల తేడాతో రాజస్థాన్ ఓటమి

జైపూర్ లో సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్(ఆర్.ఆర్) పై ఢిల్లీ కేపిటల్స్(డీసీ) విజయం సాధించింది. టోర్నీలో నాల్గో అర్ధ సెంచరీ చేసిన శిఖర్ ధావన్(27 బంతుల్లో 54) కు రిషబ్ పంత్ (36 బంతుల్లో 78పరుగులు) తోడవడంతో తేలిగ్గా గెలుపునందుకుంది. తొలి వికెట్ కు ధావన్, పృథ్వీషాల జోడి 72 పరుగులు చేసింది. పంత్ 2x6, 6x4 సుడిగాలి ఇన్నింగ్స్ తో కేవలం నాలుగు వికెట్లనే కోల్పోయిన డీసీ లక్ష్యం 192 పరుగుల్ని ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే సాధించింది. టాస్ గెలిచిన డీసీ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ ఆర్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. కెప్టెన్సీ బాధ్యతల తప్పడంతో బ్యాటర్ గా రహానే పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. 11 బౌండరీలు 3 సిక్సర్లతో 105 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఐపీఎల్లో రెండో సెంచరీని సాధించాడు. కెప్టెన్ స్మిత్ అర్ధ సెంచరీతో రాణించాడు. రబాడ 2 వికెట్లు, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీశారు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ లోపాలు కూడా డీసీ సునాయాస విజయానికి దోహదం చేశాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రిషబ్ పంత్ నిలిచాడు. పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో ప్రస్తుతం డీసీ నెం.1 స్థానానికి చేరుకుంది.

No comments:

Post a Comment