Monday, April 22, 2019

karnataka cid team in raichur to investigate btech girl`s death


బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతిపై సీఐడీ దర్యాప్తు
కర్ణాటకలోని రాయచూర్ కు చెందిన 23 ఏళ్ల బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ బిడ్డను పోగొట్టుకున్నామని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దాంతో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన గళం విప్పడంతో ప్రభుత్వం ఈ దర్యాప్తునకు ఆదేశించింది. నవోదయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆమె మూడో సంవత్సరం చదువుతోంది. ఇంటి నుంచి ఏప్రిల్13న వెళ్లిన విద్యార్థిని జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. అయితే పోలీసులు పట్టించుకోలేదు. ఏప్రిల్ 15న ఓ ఫామ్ హౌస్ లో చెట్టుకు ఉరి వేసిన స్థితిలో విద్యార్థిని శవాన్ని కనుగొన్నారు. తొలుత పోలీసులు సైతం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే తమ బిడ్డను అదే కాలేజీలో చదువుతున్న సుదర్శన్ యాదవ్ అత్యాచారం చేసి చంపేసి సూసైడ్ డ్రామా ఆడుతున్నాడని వారు ఆరోపించారు. ఈ సుదర్శన్ బంధువు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుండడంతో కేసును మాఫీ చేసే ప్రయత్నం చేశాడన్నారు. విద్యార్థిని తను పరీక్షలో ఫెయిల్ కావడంతోనే మనస్థాపంతో ఉరివేసుకుంటున్నట్లు నకిలీ సూసైడ్ నోట్ ను సుదర్శన్ సృష్టించాడని పేర్కొన్నారు. దాంతో ప్రభుత్వం సీఐడీ ఎస్.పి. శరణప్ప ఆధ్వర్యంలో కేసు దర్యాప్తునకు సోమవారం ఆదేశాలిచ్చింది.



No comments:

Post a Comment