Sunday, December 13, 2020

390 kgs Ganjaa seize in Rajahmundry

రాజమండ్రిలో భారీగా గంజాయి పట్టివేత

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ గంజాయి కలకలం రేగుతోంది. ఉత్తరాంధ్ర ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ కేంద్రంగా భారీగా గంజాయి సాగవుతోందని ఇటీవల తరచు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో పెద్దఎత్తున గంజాయిని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని గామన్‌ బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లారీలో తరలిస్తున్న 390 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ గంజాయిని నర్సీపట్నం నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠా వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Saturday, December 12, 2020

Pawan Kalyan visits Dokiparru Venkateswara Swamy temple



డోకిపర్రు వెంకన్న సన్నిధిలో పవర్ స్టార్

https://www.youtube.com/watch?v=3jKNB2qvDe4

జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలోని డోకిపర్రు గ్రామంలో కొలువైన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో శనివారం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. వారిని ఉద్దేశించి పవర్ స్టార్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆలయాన్నిదర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రెండుమూడేళ్లుగా ఇక్కడకు రావాలనుకున్నా ఆ అదృష్టం ఇప్పుడు కల్గిందన్నారు. జిల్లాలో గల ప్రసిద్ధ ఆలయాల్లో ఇక్కడ శ్రీవారి ఆలయం కూడా ఒకటని పేర్కొన్నారు. ప్రస్తుత కల్యాణోత్సవంలో పాలుపంచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తిరుమల తరహాలో ఈ ఆలయ వేద పండితులు పూజాది కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఈ ఆలయ వైభవానికి అహర్నిశలు శ్రమిస్తున్న కృష్ణారెడ్డి  తదితరులకు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.

Friday, December 11, 2020

US New president Joe Biden and Kamala Harris named Time Person of the Year

టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్

బైడన్..కమలా

అమెరికా తదుపరి అధ్యక్ష, ఉపాధ్యక్షులు జో బైడెన్, కమలా హ్యారిస్‌లను టైమ్స్ పత్రిక `పర్సన్ ఆఫ్ ది ఇయర్`‌గా ఎంపిక చేసింది.‌ నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను  డెమొక్రాటిక్ అభ్యర్థి బైడెన్ ఓడించిన సంగతి తెలిసిందే.‌ దాంతో ఈ ఏడాది టైమ్ మ్యాగజైన్ `పర్సన్ ఆఫ్ ది ఇయర్` తాజా జాబితాలో  బైడెన్, కమలాలకు అగ్రస్థానం దక్కింది. ఈ ఇద్దరు డెమొక్రాటిక్ నేతలు ముగ్గురు ఫైనలిస్టులను దాటుకుని ఎంపికయ్యారు. కోవిడ్-19 మహమ్మారిపై ముందుండి పోరాటం చేస్తున్న ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు ఆంథోనీ ఫౌచీ, డొనాల్డ్ ట్రంప్ తదితరులు పోటీపడ్డారు. 78 ఏళ్ల బైడెన్, 56 ఏళ్ల కమలా ఫోటోలను కవర్ పేజీపై ముద్రించిన టైమ్ మ్యాగజైన్ `అమెరికా కథను మార్చారుఅంటూ  కింద ఉప-శీర్షికను పెట్టింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కు మొత్తం 306 ఎలక్టోరల్ ఓట్లు రాగా.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు 232 ఓట్లు వచ్చాయి. అలాగే అమెరికా ఎన్నికల్లో ఇప్పటి వరకూ ఎవరికి సాధ్యం కానిరీతిలో బైడెన్ 70 మిలియన్లకు పైగా ఓట్లను సాధించారు. ఇంత వరకు 2006 ఎన్నికల్లో బారాక్ ఒబామా సాధించిన 6.9 మిలియన్ ఓట్లే అత్యధికం కాగా దానిని బైడన్ అధిగమించి రికార్డు నెలకొల్పిన విషయం విదితమే.

Thursday, December 10, 2020

Vijayashanthi satirical comments on KCR

కేసీఆర్ పై రాములమ్మ వ్యంగ్యోక్తులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తాజాగా బీజేపీలో చేరిన రాములమ్మ (విజయశాంతి) వ్యంగ్యోక్తులు విసిరారు. కేసీఆర్ ను మించిన మహానటుడు లేరన్నారు. కేసీఆర్ కన్నా ముందే తాను తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టినట్లు విజయశాంతి చెప్పారు. ఉద్యమం కోసమే `తల్లి తెలంగాణ పార్టీ`ని టీఆర్ఎస్‌లో విలీనం చేశానన్నారు. మెదక్ ఎంపీగా ప్రజలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన సంగతి గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉండొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ తనను అనేక ఇబ్బందులకు గురిచేశారని రాములమ్మ ఆరోపించారు.