Wednesday, November 9, 2022

visakha steel plant employees bike rally against privatization

స్టీల్ ప్లాంట్ కార్మికుల బైక్ ర్యాలీ

విశాఖపట్టణం ఉక్కు కర్మాగారం (ఆర్.ఐ.ఎన్.ఎల్) కార్మికులు నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. బుధవారం ఉదయం కూర్మానపాలెంలో గల ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో ఎంప్లాయీస్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే నగరంలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదని ఆ శాఖ ప్రకటించింది. దాంతో ఎక్కడికక్కడ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. ఇదిలావుండగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణ ప్రయత్నాలకు నిరసనగా కార్మికులు చేపట్టిన ఆందోళన 635వ రోజుకు చేరుకుంది. ప్రధాని మోదీ ఈనెల 12 నగర పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్లాంట్ ఎంప్లాయీస్ నిరసన తీవ్రతను పెంచారు. ఆ రోజు నేరుగా ప్రధానిని కలిసి వినతిపత్రం సమర్పించాలని విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణ సమితి నిర్ణయించింది.  

No comments:

Post a Comment