Tuesday, May 7, 2019

anti cji sexual harassment charge refuse to subside


సీజేఐకు ఇచ్చిన క్లీన్ చిట్ కాపీని కోరిన ఫిర్యాదుదారు
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)పై వచ్చిన లైంగిక ఆరోపణల పర్వానికి తెరపడినట్లు కనపడ్డం లేదు. తాజాగా ఫిర్యాదుదారైన న్యాయస్థానం మాజీ ఉద్యోగిని ముగ్గురు సభ్యుల అంతరంగిక విచారణ సంఘం సీజేఐకు క్లీన్ చిట్ ఇస్తూ నివేదించిన కాపీని కోరారు. సీజేఐ రంజన్ గొగొయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మాజీ ఉద్యోగిని మంగళవారం (మే7) తన ఫిర్యాదులో ఆధారాల్లేవని పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నివేదిక కాపీని తనకూ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే, న్యాయమూర్తులు ఇందిరాబెనర్జీ, ఇందు మల్హొత్రాల విచారణ సంఘం సీజేఐకు క్లీన్ చిట్ ఇస్తూ సంక్షిప్తంగా పేర్కొన్న నివేదిక కాపీలను సీజేఐ, తదుపరి సీనియర్ న్యాయమూర్తిలకు మాత్రమే ఇచ్చారు. అంతరంగిక విచారణ అయినందున నివేదికను ప్రజలకు బహిరంగ పర్చాల్సిన అవసరం లేదని విచారణ బృందం పేర్కొన్న నేపథ్యంలో ఫిర్యాదుదారు తన ఆరోపణల్లో ఆధారాల్లేవనడాన్ని ప్రశ్నిస్తూ  కాపీని కోరడం న్యాయవ్యవస్థకు సంబంధించిన వర్గాల్లో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

sc allows karti chidambaram to travel abroad in may


కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లేందుకు ఎస్సీ అనుమతి
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులను ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు మంగళవారం (మే7)అనుమతి ఇచ్చింది. ఈ నెలలో కార్తీ అమెరికా, జర్మనీ, స్పెయిన్ పర్యటనలకు వెళ్లేందుకు సుప్రీం అనుమతి కోరుతూ అభ్యర్థించారు. ప్రస్తుత పరిస్థితుల్ని అంచనా వేసిన మీదట కార్తీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం కొడుకయిన కార్తీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జనవరిలో రూ.10 కోట్లను డిపాజిట్ చేసినట్లు సుప్ర్రీంకోర్టు సెక్రటరీ జనరల్ తెలిపారు. అప్పుడే కార్తీకి సుప్రీం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. అయితే విదేశాలకు వెళ్లి తిరిగి రావాలని, కేసుల విచారణలో సహకరించాలని మాత్రం ఆంక్షలు విధించింది. ఈ మేరకు కోర్టుకు కార్తీ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఐ.ఎన్.ఎక్స్ మీడియా హవాలా కేసులో కార్తీ చిదంబరాన్ని సీబీఐ ఫిబ్రవరి 28, 2018లో అరెస్ట్ చేసింది. అక్రమ నగదు బదిలీలకు సంబంధించి ఈడీ కేసుల్ని ఆయన ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.


Monday, May 6, 2019

prince harry and meghan welcome their first royal baby



ప్రిన్స్ హారీ దంపతులకు మగబిడ్డ
సస్సెక్స్ కౌంటీ డ్యూక్, డచస్ ప్రిన్స్ హారీ, మేఘన్ దంపతులకు సోమవారం మగబిడ్డ పుట్టాడు. ఈ విషయాన్ని కెన్సింగ్టన్ ప్యాలెస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రసూతి గదికి మేఘన్ ను తరలించగా ఉదయం 5.26కు మగశిశువు జన్మించినట్లు రాకుమారుడు హ్యారీ విలేకర్లకు తెలిపారు. పిల్లాడు పుట్టడంతో దంపతులిద్దరం చాలా సంబరపడ్డామన్నారు. బాబు 3.25 కేజీల బరువున్నాడు..నిజంగా అద్భుతమైన అనుభూతిని పొందిన క్షణమన్నారు. తమకు ప్రేమను పంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పుట్టిన బిడ్డ బ్రిటన్ రాణి ఎలిజబెత్ కు మునిమనువల్లో ఎనిమిదో వాడు. దీంతో బ్రిటిష్ సింహాసనానికి వరుసగా చివరి ఏడుగురు మునిమనవళ్లే వారసులుగా వచ్చినట్లయింది. సస్సెక్స్ డ్యూక్ ప్రిన్స్ హారీ దివంగత ప్రిన్సెస్ డయానా చిన్న కొడుకు. ఈయన అన్న ప్రిన్స్ విలియమ్. సస్సెక్స్ డచస్ మేఘన్ 1981లో లాస్ ఏంజెల్స్ లో జన్మించారు. ఈమె నటి రాచెల్ మేఘన్ మార్కెల్ కూతురు. ప్రిన్స్ హారీతో గత ఏడాదే మేఘన్ కు వివాహమయింది. 

mamata's wish modi's chest swells to 112 inches



మోదీపై మమత ఘాటు విమర్శ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హద్దు దాటి ప్రధాని మోదీపై ఘాటు విమర్శ చేశారు. సోమవారం (మే6) బిష్ణుపూర్ లోక్ సభ నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ ప్రధాని మోదీ ఛాతీ 56 అంగుళాల నుంచి 112 అంగుళాలకు ఉప్పొంగాలని ఆకాంక్షించారు. ఆయన కు మంచి శరీరాకృతి ఉంది..ఆయన ఛాతీ ఇంకా పెరిగితే అందరి ఆరోగ్యం బాగుంటుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోదీ చాలా జిత్తులమారి అని ఆయన మళ్లీ మళ్లీ మరిగించి ఇచ్చిన టీ ఆరోగ్యాలకు హాని చేస్తుందన్నారు. ఆయన ఎప్పుడూ మట్టి కప్ లో చాయ్ ఇవ్వరన్నారు.  చాయ్ వాలా కాస్తా ఇప్పుడు కాపాలాదారుడై పోయారని మమతా ఎద్దేవా చేశారు. తమ పార్టీ లౌకికతత్వం మార్గం వీడదని ఈ సందర్భంగా ఆమె ర్యాలీలో అన్నారు. మసీదు, మందిరం, చర్చిలన్నీ తమకు ఒక్కటేనని చెప్పారు. ఆదివారం ఎన్నికల ర్యాలీలో మోదీ టి అంటే మూడు అర్ధాలు వస్తాయంటూ తృణమూల్..టోల్బాజి, టాక్స్ (టోల్బాజి అనే పదాన్ని స్థానికంగా బలవంతపు వసూళ్లు, దౌర్జన్యం అనే అర్ధం లో వాడతారు) రాష్ట్రంలో మమతా బెనర్జీ పాలన ఆ విధంగానే సాగుతోందని విమర్శించారు. ఈ విమర్శల నేపథ్యంలో ప్రధానికి మమతా పై విధంగా బదులిచ్చినట్లయింది. టీఎంసీ బలవంతపు వసూళ్లకు పాల్పడుతోందంటున్న మోదీ.. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా ఎంత డబ్బు వెనకేసుకున్నారని మమత ప్రశ్నించారు.