Friday, April 26, 2019

aviation regulator DGCA starts probe into rahul gandhi plane incident


రాహుల్ విమానంలో సాంకేతిక లోపంపై విచారణ

ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన రాహుల్ విమానం సాంకేతిక లోపం తలెత్తడంతో ఢిల్లీ తిరిగి వచ్చారు. శుక్రవారం (ఏప్రిల్26) ఉదయం 10.20కి రాహుల్ ఢిల్లీ నుంచి హాకర్ 850 ఎక్స్.పి. (వి.టి-కె.ఎన్.బి) విమానంలో బయలుదేరారు. గాల్లోకి లేచిన కొన్ని నిమిషాల్లో ఇంజిన్ లో ఇబ్బందిని గుర్తించిన పైలట్లు విషయాన్ని రాహుల్ కు తెలిపి విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించారు. ఈ సాంకేతిక లోపం పై పౌర విమానాయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించారు. విధి విధానాల్లో భాగంగానే ఈ దర్యాప్తునకు ఆదేశించినట్లు డీజీసీఏ వర్గాలు పేర్కొన్నాయి. 2018 ఏప్రిల్లో కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారానికి రాహుల్ వెళ్లిన సందర్భంలో హుబ్లీలో ఆయన విమానం ల్యాండ్ కావడానికి 20 సెకన్లు ఆలస్యమయింది. ఫాల్కన్ విమానంలో గతేడాది ఆయన ప్రయాణిస్తుండగా ఆకాశంలో 8000 అడుగుల ఎత్తులో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. వాస్తవానికి ఆ సెకన్ల వ్యవధి కూడా విమాన పెను ప్రమాదానికి సంకేతం కాగలదు. అప్పుడూ ఆ సాంకేతిక లోపంపై దర్యాప్తు నిర్వహించారు. మరో వైపు తాజా ఇంజన్ లోపానికి సంబంధించి రాహుల్ ట్విట్ చేశారు. తన కోసం ప్రజలు వేచి చూస్తుంటారు కాబట్టి వారికి అసౌకర్యం కల్గకుండా జరిగిన విషయాన్ని తెల్పుతూ ట్విట్ చేయాల్సిందిగా విమానం లోని పార్టీ నాయకుల్ని ఆదేశించారు.

history sheeter held for sexual abuse of school girl

చెన్నైలో బాలికను వేధించిన పోకిరి అరెస్ట్

పాఠశాల విద్యార్థినిని వేధించిన రౌడీషీటర్(20)ను చెన్నై పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. 17 ఏళ్ల విద్యార్థిని(క్లాస్11)ని వేధిస్తున్న యశ్వంత్ రాజ్ అనే పోకిరిని లైంగిక వేధింపుల నుంచి బాలల రక్షణ (పోక్సో) చట్టం కింద శుక్రవారం నిర్భందించారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. అతనిపై గతంలోనే రౌడీషీటర్ ఉన్నట్లు తెలిపారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరచగా అతనికి రిమాండ్ విధించింది. 

People of varanasi have again blessed me after five years pm modi

వారణాసి లో నామినేషన్ వేసిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున వారణాసి లోక్ సభ అభ్యర్థిగా శుక్రవారం(ఏప్రిల్ 26) నామినేషన్ దాఖలు చేశారు. మరోసారి ఈ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న మోదీ గురువారం భారీ రోడ్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే.  వారణాసి కలెక్టరేట్ లో ఆయన నామినేషన్ కార్యక్రమంలో ఏన్డీయే భాగస్వామ్య పక్ష నేతలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, శివసేన అగ్రనేత ఉద్దవ్ థాకరే, అన్నాడీఎంకె నాయకులు పన్వీర్ సెల్వం, ఎం.తంబిదురై, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ తదితరులు మోదీ వెంట ఉన్నారు. మోదీ నామినేషన్ ను నల్గురు ప్రతిపాదించినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. నామినేషన్ దాఖలుకు ముందు మోదీ కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆయన పార్టీ శ్రేణులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరో అయిదేళ్లు తనను ఎన్నుకోవడానికి వారణాసి వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మోదీ అన్నారు. నేను, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, యోగి ఆధిత్య నాథ్ కేవలం కరసేవకులం మాత్రమేనన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్ని ఓటర్లే ప్రతిపక్షాలతో పోరాడుతున్నాయని మోదీ అన్నారు. నిన్నటి రోజున వారణాసి రోడ్డు షో కు హాజరైన అశేష జన వాహినే అందుకు సాక్ష్యంగా పేర్కొన్నారు. దేశంలో ప్రభుత్వ అనుకూల పవనాలు వీస్తున్నాయని మళ్లీ మోదీజీ పాలన అందిస్తారని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశాయి. 

Thursday, April 25, 2019

parag archer take rr to winning side ipl season 12


రాజస్థాన్ చేతిలో కోల్ కతా చిత్తు
కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో గురువారం జరిగిన ఐపీఎల్ సీజన్12 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్(ఆర్.ఆర్) పట్టుదలగా ఆడి విజయాన్ని దక్కించుకుంది. టాస్ గెలిచిన ఆర్ ఆర్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. కోలకతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ దినేశ్ కార్తిక్ (50 బంతుల్లో 9x6, 7x4) మాత్రమే రాణించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. జట్టులో తర్వాత నితీశ్ రాణా (21) చెప్పుకోదగ్గ స్కోర్ సాధించాడు. కేకేఆర్ 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. 176 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్ ఆర్ జట్టు ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి గెలుపునందుకుంది. టోర్నీలో ప్లేఆఫ్ కు చేరాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో ఆర్.ఆర్. మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆ జట్టుకు ఇది నాల్గో విజయం. అజింక రహానే ఈ మ్యాచ్ లోనూ దూకుడుగా ఆడాడు. ఒక సిక్స్, అయిదు బౌండరీలతో 21 బంతుల్లో 34 పరుగులు చేశాడు. సంజు శ్యామ్ సన్ (22) అండగా నిలవడంతో 5.2 ఓవర్లలోనే ఓపెనర్లు 53 పరుగులు చేసి జట్టు విజయానికి పునాది వేశారు. రహానే అవుటయ్యాక 63 పరుగుల వద్ద శ్యామ్ సన్ వికెట్ ను జట్టు వెంటనే కోల్పోయింది. గెలుపు దోబూచులాడిన సమయంలో అయిదో బ్యాట్స్ మన్ గా వచ్చిన రియాన్ పరాగ్ జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. విలువైన 47 పరుగులు చేసిన పరాగ్ 19 ఓవర్లో రస్సెల్ బౌలింగ్ లో హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. అప్పటికే ఆ ఓవర్లో సిక్సర్ సాధించడంతో ఆర్.ఆర్. జట్టు సురక్షితమైన స్థానంలోకి వచ్చింది. చివర్లో ఆర్చర్ (27) మురిపించాడు. ప్రదీప్ కృష్ణ బౌలింగ్ లో వరుసగా బౌండరీ, సిక్సర్ సాధించి కావాల్సిన 9 పరుగుల్ని రెండు బంతుల్లోనే సాధించి జట్టును విజయం ముంగిట నిలిపాడు. కేకేఆర్ జట్టుకు ఇది ఏడో ఓటమి.