Tuesday, June 4, 2019

srilanka beat afganistan by 34 runs cricket world cup match number 7


అప్ఘానిస్థాన్ పై 34 పరుగుల తేడాతో గెలిచిన శ్రీలంక
వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.7లో అప్ఘానిస్థాన్ ను ఓడించి శ్రీలంక టోర్నీలో తొలి గెలుపునందుకుంది. మంగళవారం కార్డిఫ్ సోఫియా గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన అప్ఘాన్ కెప్టెన్ గుల్బద్దీన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక పడుతూ లేస్తూ 201 పరుగులకు(36.5 ఓవర్లకే) ఆలౌటయింది. వర్షం కారణంగా మధ్యలో మ్యాచ్ కు ఆటంకం కల్గడంతో డక్ వర్త్ లూయిస్ నిబంధనలు(డీఎల్ఎస్) ప్రకారం 41 ఓవర్లలో 187 పరుగుల విజయలక్ష్యంతో అప్ఘాన్ బ్యాటింగ్ కు దిగింది.జట్టులో నజీబుల్లా జర్దాన్ 56 బంతుల్లో 43 పరుగులు, హజ్రతుల్లా జజయ్ 25 బంతుల్లో 30 పరుగులు, గుల్బద్దీన్ నయీబ్ 32 బంతుల్లో 23 పరుగులు మాత్రమే రాణించారు. స్వల్ప స్కోరు ను ఛేదించడం సులభమేనన్న భ్రమలో అప్ఘాన్ బ్యాట్స్ మన్ తేలిగ్గా తీసుకోవడంతోనే ఆరంభంలో త్వరత్వరగా వికెట్లను కోల్పోయారు. ఆ తర్వాత ఛేదనలో పుంజుకుంటున్న దశలో అప్ఘాన్ వికెట్లు కాపాడుకోలేక పోవడంతో ఓటమి పాలయింది. శ్రీలంక స్ట్రయిక్ బౌలర్లు నువాన్ ప్రదీప్ 4 వికెట్లు, లసిత్ మలింగా 3 వికెట్లు తిసర పెరెరా, ఇసుర ఉదాన చెరో వికెట్ తీసుకుని అప్ఘాన్ పతనాన్ని శాసించారు. 32.4 ఓవర్లకే ఆలౌటయిన అప్ఘానిస్థాన్ బ్యాట్స్ మన్ 152 పరుగులు మాత్రమే చేయగలిగారు. శ్రీలంక టోర్నీ తొలిమ్యాచ్ లో మూడ్రోజుల క్రితం ఇదే వేదికపై న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడినా 34 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ లో గెలిచి ముందంజ వేసింది. శ్రీలంక బ్యాట్స్ మన్లలో కుశాల్ పెరెరా 81 బంతుల్లో 78 పరుగులతో రాణించాడు. కెప్టెన్ దిముత్ కరుణరత్నే 45 బంతుల్లో 30 పరుగులు, లహిరుతిరుమాన్నె 34 బంతుల్లో 25 పరుగుల చేయడంతో శ్రీలంక చెప్పుకోదగ్గ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచగల్గింది. అప్ఘాన్ బౌలర్లలో మహ్మద్ నబీ 4/30 రషీద్ ఖాన్2/17 దవ్లాత్ జర్దాన్ 2/34 రాణించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా శ్రీలంక పేసర్ నువాన్ ప్రదీప్ (4/31) నిలిచాడు.

No comments:

Post a Comment