Sunday, June 23, 2019

Six Indians arrested for smuggling gold in Sri Lanka



కొలంబోలో బంగారు బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురి అరెస్ట్
శ్రీలంక రాజధాని కొలంబోలో బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు అరెస్టయ్యారు. వీరంతా భారత్ కు చెందిన వారని సమాచారం. ఆదివారం బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీల్లో వీరు పట్టబడ్డారు. నిందితులు తమ బ్యాగులు, ప్యాంటుల్లో బంగారు బిస్కెట్లు దాచి ఉంచడం సోదాల్లో బట్టబయలయింది. వీటి విలువ రూ.30 లక్షలుంటుందని అంచనా. నిందితులందరూ 36-53 వయసు లోపు వారని డెయిలీ మిర్రర్ కథనం ద్వారా తెలుస్తోంది. ఈ స్మగ్లింగ్ దందాపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని కస్టమ్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ సునీల్ జయరత్నే తెలిపారు.



No comments:

Post a Comment