Sunday, June 23, 2019

Cop burns alive as car catches fire after collision


కూతురు నిశ్చితార్థానికి వస్తుండగా కారు ప్రమాదం: ఎస్.ఐ. సజీవదహనం

విధులు ముగించుకుని కూతురు వివాహ నిశ్చితార్థానికి బయలుదేరిన ఓ ఎస్.ఐ. కారు ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లా లీమా చౌహాన్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ.గా పనిచేస్తున్న అశోక్ తివారీ ఆదివారం ఈ ఘోర ప్రమాదంలో మృత్యు ఒడికి చేరారు. అలహాబాద్ నుంచి కారులో బయలుదేరిన ఆయన భోపాల్ మీదుగా ఇంటికి తిరుగుప్రయాణమయ్యారు. మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకోబోతున్న ఆనందంలో ఉన్న ఆయనను దుర్ఘటన బలి తీసుకుంది. రాజ్ గఢ్ జిల్లా పాన్ వాడి గ్రామ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కారులో మంటలు వ్యాపించాయి. కారుతో పాటు ఎస్.ఐ.ను మంటలు చుట్టుముట్టడంతో మృతి చెందారు. ట్రక్కు ఢీకొన్న క్రమంలోనే కారులో మంటలు ప్రజ్వరిల్లినట్లు ఎస్.డి.ఒ.పి (సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్) నాగేంద్ర సింగ్ బియాస్ తెలిపారు.

No comments:

Post a Comment