Sunday, May 19, 2019

modi’s jobs deficit: J&J’s largest India plant idle three years after completion



నిర్మాణం పూర్తై మూడేళ్లయినా ప్రారంభానికి నోచుకోని 
జాన్సన్ అండ్ జాన్సన్ 
భారత్ లోనే అతి పెద్ద తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ సమీపంలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నెలకొల్పింది. ఈ అమెరికా కంపెనీ ద్వారా సౌందర్య సాధనాలు, బాలలకు సంబంధించిన వస్తు ఉత్పత్తులు చేపట్టాలని మహబూబ్ నగర్ జిల్లా పెంజెర్లలో 47 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తై మూడేళ్లయినా ఉత్పత్తి కార్యక్రమాల ఊసే లేదు. ఈ కంపెనీ పని చేయడం ప్రారంభిస్తే 1500 మందికి ఉపాధి లభిస్తుంది. కంపెనీ కేంద్ర కార్యాలయం న్యూజెర్సీలోని న్యూబ్రన్స్ విక్ లో ఉంది. భారత్ లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ముంబయిలో కార్పొరేట్ కార్యాలయం ఏర్పాటయింది. నిర్మాణం పూర్తి చేసుకుని మూడేళ్లయినా ఉత్పత్తి కార్యకలాపాలు ఎందుకు ప్రారంభకాలేదని ముంబయి లోని సంస్థ అధికారుల్ని సంప్రదిస్తే కేంద్ర కార్యాలయంలోనే ఆ విషయాలు తెలుస్తాయని తప్పించుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ 2016లో పెద్ద నోట్లు రద్దు చేయడం, 2017 నుంచి జీఎస్టీ అమలు చేయడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. నిజానికి బేబీ కేర్ వస్తువులు, సౌందర్య సాధనాల్లో జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తులకు భారత్ లో గిరాకీ ఎక్కువ. అయినా ఇక్కడ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఉత్పత్తుల ప్రారంభానికి యాజమాన్యం ముందుకు రావట్లేదని స్పష్టమౌతోంది.


No comments:

Post a Comment