Sunday, May 19, 2019

Political ad spend on Facebook, Google tops Rs 53 cr



రాజకీయ పార్టీల డిజిటల్ యాడ్స్ ఖర్చు రూ.53 కోట్లు
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు డిజిటల్ యాడ్స్ కు రూ.53 కోట్లు ఖర్చు పెట్టాయి. ఇందులో సింహభాగం భారతీయ జనతా పార్టీ ఖర్చు చేసింది. ముఖ్యంగా ఆయా పార్టీలు ఫేస్ బుక్, గూగుల్ యాడ్లకే ఎక్కువ ఖర్చు చేసినట్లు గణాంకాలు  స్పష్టం చేస్తున్నాయి. ఫేస్ బుక్ నివేదిక ప్రకారం ఈ 17వ లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 1.21 లక్షల రాజకీయ ప్రచార యాడ్స్ జనంలోకి వెళ్లాయి. ఇందుకు గాను మే15 నాటికి ఆ పార్టీలు 26.5 కోట్లు వెచ్చించాయి. ఇదంతా ఫిబ్రవరి19-మే15 తేదీల మధ్యనే వ్యయం చేశారు. గూగుల్, యూట్యూబ్, ఇతర గ్రూపు సామాజిక మాధ్యమాలు 14,837 యాడ్స్ పబ్లిష్ చేయడం ద్వారా ఫిబ్రవరి 19 నుంచి మే15 వరకు రూ.27.36కోట్లు ఆర్జించాయి. ఇందులో బీజేపీ వాటా రూ.4.23 కోట్లు. ఒక్క ఫేస్ బుక్ ద్వారా ఆ పార్టీ యాడ్స్ 2500 వరకు జనంలోకి వెళ్లాయి. మై ఫస్ట్ ఓట్ ఫర్ మోదీ, భారత్ కి మన్ కి బాత్, నేషన్ విత్ నమో టూ తదితర యాడ్స్ సామాజిక మాధ్యమాల్లో విరివిగా చక్కెర్లు కొట్టాయి. 20 కోట్ల మందికి దేశంలో సామాజిక మాధ్యమ అకౌంట్లున్నాయని ఓ అంచనా. మరో వైపు కాంగ్రెస్ పార్టీ గూగుల్ యాడ్స్ కోసం రూ.17 కోట్లు, ఫేస్ బుక్ ద్వారా ప్రచారానికి రూ.1.46 కోట్లు ఖర్చు చేసింది. ఆ పార్టీ ఫేస్ బుక్ ద్వారా 3,686 యాడ్స్, గూగుల్ ద్వారా 425 యాడ్స్ గుప్పించింది. తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) రూ.29.28కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రూ.13.62 కోట్లు ఫేస్ బుక్ యాడ్స్ కు వెచ్చించాయి. ఆప్ గూగుల్ యాడ్స్ ద్వారా ప్రచారానికి రూ.2.18 కోట్లు చెల్లించింది. ఈ ఏడాది ఆరంభంలోనే ఫేస్ బుక్, గూగుల్ సంస్థలు సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీల డిజిటల్ యాడ్స్ ప్రచారానికి సంబంధించి కచ్చితత్వంతో కూడిన మొత్తం లెక్కలన్నింటిని నివేదికలో వెల్లడిస్తామని ప్రకటించాయి.  

No comments:

Post a Comment