Sunday, May 5, 2019

five BJP workers die as car falls into gorge in HP



కారు లోయలో పడి అయిదుగురు బీజేపీ కార్యకర్తల దుర్మరణం
హిమాచల్ ప్రదేశ్ లో ఆదివారం (మే5) కారు లోయలో పడిన దుర్ఘటనలో అయిదు భారతీయ జనతాపార్టీకి చెందిన కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారు. భటిక్దర్ లో ముఖ్యమంత్రి జైరాం ఎన్నికల ర్యాలీకి హాజరయ్యేందుకు వీరంతా బయలుదేరినట్లు సమాచారం. కారు అదుపుతప్పి 300 మీటర్ల లోయలోకి జారి పడిపోయినట్లు తెలిసింది. ప్రమాదంలో కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అతనికి తీవ్ర గాయలుకావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

No comments:

Post a Comment