Saturday, May 4, 2019

mj akbar deposes in criminal defamation case filed against lady journalist


పరువునష్టం కేసులో ఎంజే అక్బర్ ను విచారించిన కోర్టు
మీ టూ ఆరోపణల వెల్లువలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన ఎం.జె.అక్బర్ ను శనివారం(మే4) అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ విశాల్ ఆధ్వర్యంలో రెండు గంటల పాటు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అక్బర్ ఎడిటర్ గా బాధ్యతలు వహిస్తున్న సమయంలో లైంగికంగా తనను వేధించారంటూ రమణి అనే జర్నలిస్ట్ పేర్కొనడంతో ఆమెపై పరువునష్టం దావా వేశారు. రమణి తరఫు న్యాయవాది రెబకా జాన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ అక్బర్ ను పలు అంశాలపై వివరాలు అడిగారు. రమణి తనపై చేసినవి తప్పుడు, అసత్య ఆరోపణలని అక్బర్ పునరుద్ఘాటిస్తూ తన పరువుకు నష్టం వాటిల్లినందున ఈ దావా వేయడం సహేతకమన్నారు. అయితే చాలా ప్రశ్నలకు అక్బర్ నాకు గుర్తు లేదు(ఐడోంట్ రిమెంబర్) అనే సమాధానమిచ్చారు. అక్టోబర్ 17, 2018లో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రమణి తనపై మీటూ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికలకు ఎక్కడంతో అక్బర్ ఈ కేసు వేశారు. 20 ఏళ్ల క్రితం జర్నలిజంలో అడుగుపెట్టిన కొత్తలో తనను అక్బర్ వేధించారంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కేసు తదుపరి విచారణ మే20న జరగనుంది.

No comments:

Post a Comment