Wednesday, November 25, 2020

Diego Maradona dies, aged 60, after heart attack

సాకర్ మాంత్రికుడు మారడోనా కన్నుమూత

సాకర్ ప్రపంచంలో మాంత్రికుడిగా పేరొందిన అర్జెంటీనా అలనాటి మేటి ఆటగాడు డిగో మారడోనా ఆకస్మికంగా మృత్యు ఒడి చేరారు. అర్జెంటీనా వార్తాపత్రిక క్లారన్ కథనం ప్రకారం బుధవారం ఉదయం ఈ ఫుట్‌బాల్ లెజెండ్ టైగ్రేలోని ఇంట్లో గుండెపోటుతో కన్నుమూశారు. 60 ఏళ్ల మారడోనా తుదిశ్వాస విడిచే వరకు ఆయన శ్వాసధ్యాస సాకరే. అనారోగ్యం కలవరపెడుతున్నా ఫుట్ బాల్ క్రీడకు ఆయన దూరం కాలేదు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ అక్టోబర్ 30 న మారడోనా ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇప్పటికీ వివిధ సాకర్ క్లబ్ లకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.ఇటీవల అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ సమీపంలోని లా ప్లాటాలో పట్రోనాటోను 3-0తో ఓడించిన గిమ్నాసియా జట్టుతో విజయానందంలో పాలుపంచుకున్నాడు. మెదడు శస్త్రచికిత్స అనంతరం కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి మారడోనా ను డిశ్చార్జ్ చేశారు. అయితే ప్రాణాంతక గుండె పోటు ఆయనను బలితీసుకుంది. తన 21 సంవత్సరాల కెరీర్లో కనబర్చిన అద్భుత ఆటతీరుతో మారడోనాకు "ఎల్ పిబే డి ఓరో" ("ది గోల్డెన్ బాయ్") అనే మారుపేరు స్థిరపడింది. అర్జెంటీనాకు 1986 లో ప్రపంచ కప్ టైటిల్‌ అందించిన ఘనాపాఠి మారడోనా. 20 వ ఫిఫా ప్లేయర్‌గా పీలేతో పాటు, మారడోనా గౌరవం పొందాడు.  2010 ప్రపంచ కప్ సందర్భంగా అర్జెంటీనాకు కొంతకాలం శిక్షణ ఇచ్చాడు.

Tuesday, November 24, 2020

PM Narendra Modi And AP CM YSJagan led trends across Social Media

ప్రజాదరణలో మోదీ, జగన్, మమతా టాప్

దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం జగన్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. సోషల్‌ మీడియా టాప్‌ ట్రెండ్స్‌ను చెక్‌బ్రాండ్స్‌సంస్థ నివేదిక రూపంలో వెల్లడించింది. గడిచిన మూణ్నెల్ల కాలంలో 95 మంది టాప్‌ పొలిటీషియన్లు, 500 మంది అత్యున్నత ప్రభావశీలురకు సంబంధించిన ట్రెండ్స్‌ను చెక్‌బ్రాండ్స్‌ విశ్లేషించింది. సోషల్‌ మీడియాలో మోదీ హవా టాప్ గేర్ లో కొనసాగుతోంది. తర్వాత స్థానంలో జగన్, మమతాలు దూసుకువచ్చారు. ట్విటర్, గూగుల్‌ సెర్చ్, యూట్యూబ్‌ ప్లాట్‌ఫామ్స్‌ల్లో అత్యధిక ట్రెండ్స్‌ మోదీ పేరుపైనే ఉన్నాయి. ఆగస్ట్‌ నుంచి అక్టోబర్‌ వరకు నమోదైన గణాంకాల్ని చెక్‌బ్రాండ్స్‌సంస్థ పరిగణలోకి తీసుకుంది.  10 కోట్ల ఆన్‌లైన్‌ ఇంప్రెషన్స్‌ ఆధారంగా ఈ తొలి నివేదికను వెలువరించింది. 2,171 ట్రెండ్స్‌తో మోదీ తొలి స్థానంలో ఉండగా స్వల్ప దూరంలో 2,137 ట్రెండ్స్‌తో జగన్‌ రెండో స్థానం కైవసం చేసుకున్నారు. మూడో స్థానంలో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ లు ఉన్నారు. బ్రాండ్‌ వ్యాల్యూ విషయంలోనూ మోదీనే తొలి స్థానంలో ఉన్నారు. ఆయన బ్రాండ్‌ వాల్యూ రూ. 336 కోట్లు కాగా ఆ తర్వాత స్థానాల్లో అమిత్‌ షా (రూ. 335 కోట్లు), ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (రూ. 328 కోట్లు) ఉన్నారు.

Saturday, November 21, 2020

Patient Watches BigBoss show and Avataar movie as Guntur doctors perform brain surgery

రోగి బిగ్ బాస్ షో

చూస్తుండగా బ్రెయిన్ సర్జరీ

గుంటూరు సర్వజనాసుపత్రి జీజీహెచ్ మరో రికార్డును సొంతం చేసుకుంది. మెదడులో కణితిని తొలగించే క్రమంలో రోగితో మాట్లాడుతూనే వైద్యులు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.  పెదకూరపాడు మండలం పాటిబండ్లకు చెందిన వరప్రసాద్‌(33)కు మెదడులో కణితి (బ్రెయిన్‌ ట్యూమర్‌) వచ్చింది. అయితే ఆ కణితిని 2016లో హైదరాబాద్‌లో డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించి తొలగించారు. ఆ తర్వాత రేడియేషన్ చికిత్స చేశారు. కానీ మళ్లీ వరప్రసాద్ కు ఫిట్స్ వస్తుండడంతో పరీక్షలు చేయగా మరో కణితి పెరిగినట్లు గుర్తించారు. డాక్టర్లు భవనం హనుమా శ్రీనివాసరెడ్డి, శేషాద్రి శేఖర్‌, త్రినాథ్‌ లు ఈ కేసును చాలెంజ్ గా తీసుకున్నారు. డాక్టర్లు మెదడు త్రీడీ మ్యాప్‌ను తయారు చేసుకుని.. నావిగేషన్‌ సాయంతో కణితి సరిగ్గా ఎక్కడ ఉందో గుర్తించారు. మెదడులో ఆ భాగం కీలకమైనది కావడంతో చాలా జాగ్రత్తగా సర్జరీ చేశారు. రోగి స్పృహలో ఉండగానే మెదడులో మార్పులు, పరిణామాలను గమనిస్తూ సర్జరీ చేశారు. అతడు మెలకువగా ఉండటం కోసం బిగ్‌బాస్ షో, అవతార్ సినిమా చూపించారు. రోగికి పైసా ఖర్చు లేకుండా బీమా సౌకర్యంతో సర్జరీ నిర్వహించారు. రోగి పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి శుక్రవారం డిశ్ఛార్జి చేశారు. ఇదే ఆసుపత్రిలో 2017 లోనూ ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించి వైద్యులు విజయం సాధించారు. విజయకుమారి అనే మహిళకు మెదడులో కణితి (కెవర్నోమా)ని ఆపరేషన్ చేసి తొలగించారు. ఆమెకు బాహుబలి-2 సినిమాను చూపిస్తూ అప్పట్లో ఈ శస్త్రచికిత్స చేశారు. గుంటూరు గవర్న్ మెంట్ హాస్పిటల్ న్యూరోసర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బీహెచ్ శ్రీనివాస్ రెడ్డి ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు.

Wednesday, November 18, 2020

Roja birthtday..takes blessings from CM YSJaganmohan Reddy

 రోజాకి జగన్ ఆశీస్సులు

నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులు అందజేశారు. రోజా బుధవారం తన పుట్టిన రోజు సందర్భంగా సీఎం ని కలిశారు. భర్త సెల్వమణితో కలసి అమరావతిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన రోజా జగన్‌ కు స్వీట్ బాక్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రోజాను ఆశీర్వదించి మిఠాయి తినిపించారు. అదే విధంగా రోజాకు జగన్ స్వీట్ బాక్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజున ఎవరైనా జగన్ వద్దకు వస్తే వారికి ఓ స్వీట్ బాక్స్ కానుకగా ఇవ్వడం ఆయనకు అలవాటు. అనంతరం రోజా ఈ సాయంత్రం తన కుటుంబసభ్యులతో కలిసి బర్త్ డే వేడుక ఘనంగా జరుపుకున్నారు.