Saturday, April 27, 2019

cong lashes out at shah for Ilu-Ilu comment


అమిత్ షా ‘ఇలు ఇలు’ కామెంట్లపై కాంగ్రెస్ ధ్వజం

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా.. కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ చేసిన ఇలు ఇలు కామెంట్ల పై ఆ పార్టీ ధ్వజమెత్తింది. అమిత్ షా శుక్రవారం (ఏప్రిల్26) జలోర్ లో ఎన్నికల సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ కు ఉగ్రవాదులతో ఇలు ఇలు (ఐ లవ్ యూ  ప్రాచుర్యం పొందిన హిందీ సినిమా పాట) సంబంధముందంటూ వ్యాఖ్యలు చేశారు. 1999లో బీజేపీయే జైల్లోని ఉగ్రవాదుల్ని కాందహార్ కు తీసుకెళ్లి మరీ అప్పగించిందని గుర్తు చేస్తూ అమిత్ షాపై రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి అవినాశ్ పాండే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అఫ్ఘానిస్థాన్ కు విమానాన్ని హైజాక్ చేసుకుని వెళ్లి ఉగ్రవాదులు డిమాండ్ చేయడంతో నాటి ఎన్డీయే ప్రభుత్వం వాళ్లు కోరిన విధంగా జైలు శిక్ష అనుభవిస్తున్న మసూద్ అజర్ సహా ముగ్గురు కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాదుల్ని అప్పగించిన సంగతి తెలిసిందే. బీజేపీలోని మోదీ, అమిత్ షా సహా ఆ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడు లేదా వారి కుటుంబసభ్యులు ఎవరైనా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడారా? అని ప్రశ్నించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగ వ్యవస్థల్ని మోదీ ప్రభుత్వం బలహీన పరుస్తోందన్నారు. సోషల్ మీడియాను వారు దుర్వినియోగం చేస్తున్నారని అవినాశ్ ఆరోపించారు. మరో 50 ఏళ్లు దేశాన్ని తామే పరిపాలిస్తామని మోదీ, అమిత్ షాలు గతంలో పేర్కొన అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన రాజ్యాంగం ఎంతటి ప్రమాదంలో పడిందో గమనించాలని ప్రజల్ని కోరారు.

Friday, April 26, 2019

aviation regulator DGCA starts probe into rahul gandhi plane incident


రాహుల్ విమానంలో సాంకేతిక లోపంపై విచారణ

ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన రాహుల్ విమానం సాంకేతిక లోపం తలెత్తడంతో ఢిల్లీ తిరిగి వచ్చారు. శుక్రవారం (ఏప్రిల్26) ఉదయం 10.20కి రాహుల్ ఢిల్లీ నుంచి హాకర్ 850 ఎక్స్.పి. (వి.టి-కె.ఎన్.బి) విమానంలో బయలుదేరారు. గాల్లోకి లేచిన కొన్ని నిమిషాల్లో ఇంజిన్ లో ఇబ్బందిని గుర్తించిన పైలట్లు విషయాన్ని రాహుల్ కు తెలిపి విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించారు. ఈ సాంకేతిక లోపం పై పౌర విమానాయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించారు. విధి విధానాల్లో భాగంగానే ఈ దర్యాప్తునకు ఆదేశించినట్లు డీజీసీఏ వర్గాలు పేర్కొన్నాయి. 2018 ఏప్రిల్లో కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారానికి రాహుల్ వెళ్లిన సందర్భంలో హుబ్లీలో ఆయన విమానం ల్యాండ్ కావడానికి 20 సెకన్లు ఆలస్యమయింది. ఫాల్కన్ విమానంలో గతేడాది ఆయన ప్రయాణిస్తుండగా ఆకాశంలో 8000 అడుగుల ఎత్తులో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. వాస్తవానికి ఆ సెకన్ల వ్యవధి కూడా విమాన పెను ప్రమాదానికి సంకేతం కాగలదు. అప్పుడూ ఆ సాంకేతిక లోపంపై దర్యాప్తు నిర్వహించారు. మరో వైపు తాజా ఇంజన్ లోపానికి సంబంధించి రాహుల్ ట్విట్ చేశారు. తన కోసం ప్రజలు వేచి చూస్తుంటారు కాబట్టి వారికి అసౌకర్యం కల్గకుండా జరిగిన విషయాన్ని తెల్పుతూ ట్విట్ చేయాల్సిందిగా విమానం లోని పార్టీ నాయకుల్ని ఆదేశించారు.

history sheeter held for sexual abuse of school girl

చెన్నైలో బాలికను వేధించిన పోకిరి అరెస్ట్

పాఠశాల విద్యార్థినిని వేధించిన రౌడీషీటర్(20)ను చెన్నై పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. 17 ఏళ్ల విద్యార్థిని(క్లాస్11)ని వేధిస్తున్న యశ్వంత్ రాజ్ అనే పోకిరిని లైంగిక వేధింపుల నుంచి బాలల రక్షణ (పోక్సో) చట్టం కింద శుక్రవారం నిర్భందించారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. అతనిపై గతంలోనే రౌడీషీటర్ ఉన్నట్లు తెలిపారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరచగా అతనికి రిమాండ్ విధించింది. 

People of varanasi have again blessed me after five years pm modi

వారణాసి లో నామినేషన్ వేసిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున వారణాసి లోక్ సభ అభ్యర్థిగా శుక్రవారం(ఏప్రిల్ 26) నామినేషన్ దాఖలు చేశారు. మరోసారి ఈ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న మోదీ గురువారం భారీ రోడ్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే.  వారణాసి కలెక్టరేట్ లో ఆయన నామినేషన్ కార్యక్రమంలో ఏన్డీయే భాగస్వామ్య పక్ష నేతలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, శివసేన అగ్రనేత ఉద్దవ్ థాకరే, అన్నాడీఎంకె నాయకులు పన్వీర్ సెల్వం, ఎం.తంబిదురై, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ తదితరులు మోదీ వెంట ఉన్నారు. మోదీ నామినేషన్ ను నల్గురు ప్రతిపాదించినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. నామినేషన్ దాఖలుకు ముందు మోదీ కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆయన పార్టీ శ్రేణులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరో అయిదేళ్లు తనను ఎన్నుకోవడానికి వారణాసి వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మోదీ అన్నారు. నేను, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, యోగి ఆధిత్య నాథ్ కేవలం కరసేవకులం మాత్రమేనన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్ని ఓటర్లే ప్రతిపక్షాలతో పోరాడుతున్నాయని మోదీ అన్నారు. నిన్నటి రోజున వారణాసి రోడ్డు షో కు హాజరైన అశేష జన వాహినే అందుకు సాక్ష్యంగా పేర్కొన్నారు. దేశంలో ప్రభుత్వ అనుకూల పవనాలు వీస్తున్నాయని మళ్లీ మోదీజీ పాలన అందిస్తారని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశాయి.